24, ఆగస్టు 2022, బుధవారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఆయుధం కన్న అక్షరం గొప్పది. కత్తి కన్న కలం గొప్పది.

అక్షరం, కలం విలువలు  ప్రసాదించే గురువు ఈ రెండింటికన్నా గొప్పవాడు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.

గురువు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేవాడు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.  దానికి ఆధారం గురువు.

దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. ఆచార్యదేవోభవ అన్నారు

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే . తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - మనం ఎదగాలని వారు కోరుకుంటారు.

గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం..

గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది.

 అర్జునుడిని అత్యుత్తమ  మేటి విలుకాడిని చేయ ప్రతినభూని తన ప్రతిజ్ఞ  నెరవేరడానికి  తన ప్రతిమను మాత్రమే పూజించి అపూర్వమైన విలువిద్య పొందిన ఏకలవ్యుడి కుడి బొటన వేలిని గురు దక్షిణగా స్వీకరించి ఏకలవ్యుడి ప్రతిభను అనగదొక్కిన  ద్రోణాచార్యుల సంఘటన  మహాభారతంలో ఎంతవరకు నిజమో కల్పితమో కానీ  ఇప్పటికీ  గురు స్థానం మారలేదు ఎందుకంటే గురు లక్ష్యం మారలేదు గురువుకు పర్యాయపదంగా ద్రోణుడి పేరును ఉటంకిస్తాము  అందుకే   అత్యుత్తమ గురువులను నేడు ద్రోణాచార్య పురస్కారం చేత గౌరవిస్తున్నాము.

నిజమైన గురువు అంటే..

ఈమధ్య కాలంలో జరిగిన యదార్ధ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి జిల్లాలో రాయ్‌ఘడ్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు శివేంద్ర సింగ్ అనే ఉపాద్యాయుడు నాలుగేళ్ల క్రితం వచ్చారు.అప్పటినుండి విద్యార్థులకు శివేంద్ర సింగ్ చెప్పే పాఠాలు మరియు నైతిక నిలువలు గురుంచి చెప్పేవారు. శివేంద్ర సింగ్ అంటే ఎంతగానో ఇష్టపడేవారు. అందుకు ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఆయన క్లాస్‌కు వెళ్లేవారు. శివేంద్ర సింగ్ ప్రభుత్వం వేరే స్కూల్ కి బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న సమయంలో చాలా మంది విద్యార్థులు అతనిని కౌగిలించుకుని ఏడ్చేశారు. కొంతమంది విద్యార్థులు అతనిని గట్టిగా పట్టుకుని.. ప్లీజ్ సార్ వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం ఉద్వేగానికి గురియైనారు. విద్యార్థులపట్ల స్నేహభావంతో ప్రేమానురాగాలను పంచుతు వారికీ విలువైన విద్యనందిచిన గురువు పట్ల విద్యార్థుల భాధ వర్ణణాతీతం.  నిజమైన గురువు అంటే శివేంద్ర సింగ్ లాగా ఉండాలి .

ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రవేట్ వివిధ రంగాలలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు, ప్రతిఒక్కరం గురువులకు శిష్యులమే.

అందుకే ఏస్థాయికి ఎదిగిన మనకు విద్యనందిచిన ఉపాధ్యాయులను మరువకూడదు. సంవత్సరానికి ఒకసారైనా మన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటూ వారికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేద్దాం..
నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం
దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ..
గురువులందరికీ వందనం.. అభివందనం.      

మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475


కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...