24, అక్టోబర్ 2022, సోమవారం

మల్లు స్వరాజ్యం




పల్లె ప్రాంత పలకరింత. పల్లె ప్రజల పులకరింత.
భూమికోసం.. భుక్తికోసం.. జమీందారుల బానిసత్వం నుంచి విముక్తికోసం పోరాడిన వీర, ధీర వనిత మల్లు స్వరాజ్యం. 
తడి ఆరని మట్టి సుగంధపు పాటల పూదోట, పదునెక్కిన ప్రజా పాట మల్లు స్వరాజ్యం. 
కత్తిమొనకుండే సురుకుదనం.. ఆమె మాటల్లోఉండే గరుకుదనం. గర్జించిన సింహమోలే ఘాటైన మాటల మర ఫిరంగి మల్లు స్వరాజ్యం..  
ఉద్యమ పాటల వాడి.. ఉద్యమ విప్లవ వేడి, ఎలుగెత్తిన ఎర్రని ఎర్రదనం ఎర్రజెండా.
పెత్తందారీ వ్యవస్థమీద ఎక్కుపెట్టిన తూటా.. మల్లు స్వరాజ్యం మాట..
అక్రమ, అన్యాయాలను అణగదొక్కే అగ్నికణాల ఆట.. మల్లు స్వరాజ్యం పాడిన పాట. 
ఆమె పాటలు ప్రజలను ఊగిస్తాయి. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తాయి..
తాడిత, పీడిత, బీదసాదలకు నిలువెత్తు ఊతం.. మల్లుస్వరాజ్యం గీతం..

మీ 
కోట దామోదర్ 
మొబైల్ 9391480475

అంతరించిపోతున్న కల్లుగీత వృత్తి




కల్లు గీత వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి

పురాతన కాలంనాటి గ్రంథాలన్నీ తాళపత్రాలే... అంటే తాటాకులమీద రాసినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ ఆకులోని వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది.
పురాణాలు మరియు ఇతిహాసాలలో తాటిచెట్టు గురుంచి ఎంతో గొప్పగా వివరించబడింది.

అన్నమయ్య కీర్తనలు , పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లాంటి అమూల్యమైన విషయాలెన్నో తాళపత్ర గ్రంధాల పైనే రాయబడింది. అలాగే తాటిచెట్టు నుండి లభించే కల్లును ప్రకృతి ఔషధంగా పురాణాలలో సురాపానంపేరుతో ప్రస్తావించటం చాల గొప్ప విషయం. స్వర్గలోకంలో అమృతభాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమి మీద పడి తాళ వృక్షమై మొలిచిందట. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ. మానవ జాతి మనుగడలోను కల్లు పాత్ర కీలకమైనది.

తాటి చెట్లు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది కల్లు. ఆది మానవుని నుంచి ఆధునికమానవుని వరకు కల్లు సేవించటం ఆనవాయితీగా వస్తుంది.  తాటి  కల్లు అత్యంత ఆరోగ్యదాయకమైన ప్రకృతిసిద్ధమైన పానీయం.  ఒకప్పుడు ప్రజలు పొద్దున్న నుండి సాయంకాలం వరకు చేసిన శ్రమ నుండి ఉపశమనం పొందడానికి కల్లు ని సేవించేవారు. ఒకప్పుడు ఇంటికి బంధువులొస్తే కల్లు, గుగ్గిలతో మర్యాద చేసేవారు.  శ్రమ జీవులకు , కల్లుకు విడదీయరాని బంధం ఉండేది.

అలాంటిది కాలక్రమేపి నేడు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో లిక్కర్‌,బీర్‌, బ్రాంది, విస్కీ, రమ్ము, శీతల పానియాలు (థమ్స్ అప్, కోకోకొలా, స్పైట్‌, మాజా) అనేకం రావటం వలన కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అందు ఫలితంగా దీనిపై ఆధారపడ్డ లక్షలాదిమంది గీతకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకంగామారుతున్నాయి. అందుకు కారణం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు శీతల పానీయాలమీద పత్రికలు,టీవీ లలో గుప్పించి ఆకట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం కల్లు ఆరోగ్యానికి ఏ విధమైన మేలుచేస్తుందో ప్రజలకు అడ్వర్‌ టైజ్‌మెంటుల  రూపంలో చెప్పకపోవడం ఇందుకు ముఖ్యకారణం అనే చెప్పాలి. నేటియువత మద్యానికిఇచ్చిన ప్రాధాన్యత కల్లుకు ఇవ్వక పోగా దానిని చులకన చేసి చూడటం అత్యంత బాధాకరమైన విషయం. అంతేగాక వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో అభివృద్ధి సాదించినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిలో ఎలాంటి ఆధునిక పద్ధతులను, విధానాలను తీసుకురాకపోవడంతో ఆ వృత్తి దెబ్బతింటోంది.  ప్రభుత్వం పట్టించుకోనప్పటికీ గౌడన్న తన సంప్రదాయ వృత్తిని బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు.

పూటగడవటం కోసం గౌడన్న పొద్దుపొద్దుగాల కత్తుల పొదితో, మోకేసుకొని తాళ్లల్ల ప్రత్యేక్షమవుతాడు. సుమారు 10 నుండి 18 మీటర్ల ఎత్తున్న చెట్లని తన ప్రాణాలను సైతంలెక్కచేయకుండా అవలీలగా ఎక్కడంతోపాటు పెద్ద పెద్ద కల్లు కుండలను వెదురుబద్దల సహాయంతో ఎర్రటి ఎండలో ఒంటినిండా చెమటతో వాటిని మోయగలిగే  అసలైన బాహుబలి అంటే గౌడన్నే. వెదురుబద్దతో కుండలను మోయటంకేవలం గౌడన్నకే సాధ్యం. చెట్టెక్కిన  తరువాత ఏదైనా అకస్మాత్తుగా సంభవిస్తే ఇక తన ప్రాణాలు గగనమే. తాటిచెట్టు పైన కొన్ని విషపూరితమైన పాములు, తేలు, ఉడుములు వంటి ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు. అనుకోకుండా అవి కాటేస్తే  క్రిందకు దిగేవరకు తాను బ్రతికే అవకాశం ఉండదు. అడవిలో అప్పటికప్పుడు చికిత్స అందించేవారు కూడా ఉండరు.  ఇలాంటి వృత్తిని ఎంతో ధైర్యంతో కొనసాగిస్తున్న గౌడన్నని అభినందించాల్సిందే. నిజానికి వీరి వృత్తి చావుతో పోరాటమే అనటంలో అతిశయోక్తిలేదు.

కల్లుగీత కార్మికుల పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చెట్టుపైనుండి పడి చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం అందచేయటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మేము బ్రతుకున్నపుడే  మంచి మార్గాన్ని చూపే పథకాలుంటే బాగుంటుంది అనే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాబోవురోజుల్లో ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకోవాలని, వారి వృత్తికి సరిపడా నూతన పరికరాలకోసం అధ్యయనం చేసి వృత్తి కొనసాగించేవిధంగా మరియు నీరా కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరుకుందాం..

ముఖ్యంగా తెలంగాణ లోని గ్రామాలలో శుభకార్యాలకే గాక అన్ని రకాల కార్యాలకు మరియు వేసవి కాలంలో కల్లు సేవించేవారి సంఖ్య ఎక్కువ. విందు, వినోదాలకు స్నేహితులతో కలిసి తాళ్లల్ల ముచ్చటిస్తూ కల్లుతాగే మధురమైన జ్ఞాపకాలు పల్లెవాసులు ఎన్నటికీ మరువలేనివి మరుపురానివి. గ్రామాలలో కల్లు మాత్రమే కాకుండా తాటి ఆకులను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు.  పేదవాడి గూటికి పైకప్పుగా ఈ తాటికమ్మలు వాడేవారు. వేసవికాలంలో విలాసవంతమైన భవంతులకంటే పూరిగుడిసెల్లో వేడితీవ్రత తక్కువ. పెళ్లిపందిరికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి తాటాకులు ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాటి మొద్దులతో ఇళ్ల నిర్మాణంసర్వసాధారణం. అంతేగాక వేసవిలో తాటి ముంజలు అమితమైన చలవనివ్వడంతో పాటు తక్షణ శక్తిని మరియు దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. 

కల్లు గురించి వైద్యుల కితాబు:

ఇది ప్రకృతి సిద్ధమైన సహజ పానీయం. దీనిని ఎవరైనా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
  • ·         తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది.
  • ·         డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
  • ·         అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలనుదూరం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ·         కంటిచూపును, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ·         నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తుంది.
  • ·         లీవర్ లేదా కాలేయసంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
  • ·         కిడ్నీలో రాళ్లను నివారించడంతో పాటు అప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగిస్తుంది.
  • ·         తాటిబెల్లం, తాటి పంచదార వల్లకూడా మంచి ప్రయోజనాలున్నాయి.
  • ·         తాటిక‌ల్లుకు క్యాన్సర్కార‌క క‌ణాల‌ను న‌శింప‌జేసే శ‌క్తి కూడా ఉందని వైద్యనిపుణులు తెలియ‌జేస్తున్నారు.
ఇంతటి విశిష్టత కలిగిన తాటిచెట్లు కనుమరుగవుతున్నాయి. కొందరి స్వార్థప్రయోజనాలకోసం చెట్లని నరికేస్తున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది.

వంద సంవత్సరాలకు పైగా జీవించే తాటిచెట్టు పేదవాడి కల్పతరువు. గౌడన్నల బతుకుదెరువు..

ఈ విషయం ప్రభుత్వం గుర్తిస్తే గౌడన్నలకు ఆదరువు ...



మీ

కోట దామోదర్

మొబైల్ : 9391480475

17, అక్టోబర్ 2022, సోమవారం

సరిలేని చిత్రకారుడు

https://drive.google.com/uc?export=view&id=12y87LzCVKpCTUeivmcWnUnY-71kvLgnh 


దేవుడు మనిషిని సృష్టిస్తే! అసలు దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి ఆ దేవుడి రూపాన్ని సృష్టించిన గొప్ప చిత్రకళాకారుడు "రాజా రవి వర్మ "

తాను చదివిన పురాణేతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తులను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అద్భుతమైన ఆలోచనతో తన కుంచె ద్వారా దేవుళ్లు, దేవతల రూపాలకి ప్రాణంపోసిన కళాకారుడు. మనం నిత్యం పూజించే దేవుళ్ళు దేవతల విగ్రహాలన్నీ అయన గీసిన చిత్రాల ఆధారంగానే రూపొందించారంటే చిత్రకళ ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. భారతదేశ చిత్రకళను ప్రపంచవ్యాప్తి చేయటమే కాకుండా ఆ కళకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు.

అనబత్తుల కుంచె నుండి జాలువారిన చిత్రాలు ఖండాంతర ఖ్యాతి పొందాయి. ఆయనది వృత్తి బోధన అయినా, చిత్రకళే ప్రవృత్తిగా కళాఖండాలను ఆవిష్కరిస్తున్న "అనబత్తుల వెంకన్న" తన బాల్యమునుండి చిత్రకళపై మక్కువతో అవిశ్రాంత సాధనతో ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్రకళాకారుడిగా  గోల్డ్ మెడల్, జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో సాధించిన "అనబత్తుల వెంకన్న" తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ గొప్ప విషయం. 

  • 2012 లో KVS National Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2021 సంవత్సరం అంతర్జాతీయ ఆర్ట్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్, అస్సాం, వారిచేత గోల్డ్ మెడల్ సాధించారు.
  • 2022 సంవత్సరంలో Magic Book of Records, ఫరీదాబాద్, న్యూ ఢిల్లీ వారిచేత అత్యున్నతమైన Honorary Doctorate Award అవార్డు సాధించారు. 
  • 2022 సంవత్సరంలో లలిత్ కళా కేంద్ర, Guwahati, అస్సాం వారిచే  "Diamond Award" పొందారు.
  • 2021 సంవత్సరంలో "కళ రత్న" అవార్డు సాధించారు. 
  • 2005  లో ఆఫ్రికా దేశం తన ప్రతిభకు ఆ దేశ అత్యున్నతమైన "ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.

బాల్యం, విద్యాబ్యాసం:

సూర్యాపేట జిల్లా, మారుమూల గ్రామమైన మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబం చేనేత కార్మికుడైన అనబత్తుల నారాయణ, నాగలక్ష్మి దంపతులకు 08.03.1969 లో జన్మించారు. నారాయణ చేనేత వృత్తినే కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వెంకన్న అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి  7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయనకి 7 వ తరగతిలోనే చదువుతో పాటు చిత్రకళపై ఆసక్తి కలగటం జరిగింది. వెంకన్న గీసిన చిన్న చిన్న చిత్రాలను చూసి తల్లిదండ్రులు సంతోషించేవారూ మరియు అభినందించేవారు కూడా. తన తల్లిదండ్రుల ప్రోత్సాహముతో మరింత ఉత్సహంతో కళకు పదునుపెట్టగలిగారు. అప్పట్లో గుమ్మడవెల్లి గ్రామంలో 8 వ తరగతి చదివే సదుపాయంలేక వెంకన్న చిన్నమ్మ గారి ఊరు నెల్లికుదురులో స్థిరపడి అక్కడే 8 వ తరగతి నుండి 12 వరకు జూనియర్ కళాశాలలో విద్య పూర్తిచేశారు.  8 వ తరగతి చదివే సమయంలో వారి గురువు చిత్రకళ నైపుణ్యం కలిగిన అక్కెర కరుణ సాగర్ గారి దగ్గర శిక్షణతో పాటు నైపుణ్యం పొందగలిగారు. ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ లో శ్రీ టీ.సుధాకర్ రెడ్డి గారి దగ్గెర గ్రాఫిక్స్ లో శిక్షణ పొందినారు వెంకన్న ఈ స్థాయికి చేరుకున్నారంటే  గురువులే కారణం, గురువులే ఆదర్శం. వెంకన్న చిన్నతనం నుండి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ  తన కళను విడిచిపెట్టకుండా విద్యను మరియు చిత్రకళను రెండింటిని కొనసాగించారు. నెల్లికుదురులో విద్య అనంతరం. అయన విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్లర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం లో డిగ్రీతో పాటు  డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (నటన మరియు దర్శకత్వం) పూర్తిచేశారు. తరువాత ఎం. ఎస్. యూనివర్సిటీ, బరోడాలో ఎం. ఏ. గ్రాఫిక్స్ పూర్తి చేశారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకన్నచదువుతోపాటు గొప్ప చిత్రకళాకారుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి నేత కళాకారుడైతే, తనయుడు మాత్రం గొప్ప చిత్రకళాకారుడిగా అవార్డులు పొందడం గొప్ప విషయం.

ఉద్యోగ ప్రస్థానం :

  • 1995 లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ టీ.జి .టీ  ఆర్ట్ టీచర్ గ హైదరాబాద్ లోని కే .వి 2  ఎయిర్  ఫోర్స్ అకాడమీ లో చేరారు. 
  • 2000 - 2004 వరకు కే .వి 1  గోల్కొండ, లంగర్ హౌస్ పనిచేసి 2004 ఫిబ్రవరి లో బోట్స్వానా ( ఆఫ్రికా ) కు భారత ప్రభుత్వం తరుపున డెప్యూటేషన్ పై  వెళ్లి ఐదు సంవత్సరాలు అక్కడి విద్యార్థులకు చిత్ర కళలో మెళకువలు నేర్పిచారు . వెంకన్న చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆఫ్రికా దేశంలోని అత్యున్నతమైన " ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.
  • 2009 లో తిరిగి కే .వి,1  ఉప్పల్ హైదరాబాద్ లో చేరారు.
  • 2011 నుండి కే .వి వరంగల్ లో చిత్ర కళ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు.

వెంకన్న సాధించిన అవార్డులు:

  • 1987 లో ఇంటర్  కాలేజ్ యూత్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1988 లో భారతిదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి సౌత్ జోన్  ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.,
  • 1989 లో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ తయారీ కాంపిటీషన్ లో మొదటి బహుమతి.    
  • 1990 లో కాలికట్ యూనివర్సిటీ - కేరళ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.
  • 1990 లో REC,వరంగల్ అల్ ఇండియా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
  • 1991 లో  మదురై కామరాజ్ యూనివర్సిటీ లో అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్  సందర్బంగా రెండవ బహుమతి.
  • 1992 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 1993 లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి "దాసరి నారాయణరావు - "గోల్డ్ మెడల్" అవార్డు పొందారు. 
  • 1997 లో  Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
  • 2011 లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 324C 2 ఆచార్య సేవ పురస్కార్” హైదరాబాద్, వారిచేత పొందారు. 
  • 2011 లో KVS Regional Incentive Award”  కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India  వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
  • 2015 లో “Best Teacher award” by రోటరీ  క్లబ్  హన్మకొండ  , వరంగల్  - తెలంగాణ స్టేట్ వారి చేత పొందారు 
  • 2016 లో “Active Teacher award” కళాభారతి చైల్డ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్, ఔరంగాబాద్ వారిచేత పొందారు.
  • 2017 లో “Best Artist” కళ వైభవం ఆర్ట్ ఎక్సిబిషన్ - వరంగల్ వారిచేత పొందారు.
  • 2017 లో తెలంగాణ స్టేట్ Rs. 51,116 నగదు తో పాటు “District Artist Award"  డిప్యూటీ  చీఫ్ మినిస్టర్ శ్రీ  కడియం శ్రీహరి గారిచే పొందారు.
  • 2019 లో యంగ్  ఎంవోయిస్  ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారిచే బాపూజీ స్మృతి  పురస్కార్ అవార్డు పొందారు.
  • 2021 లో గ్రాఫిక్ డిజైన్- న్యూ ఢిల్లీ వారి చేత గోల్డెన్  ఫ్రేమ్ అవార్డు పొందారు.  
ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకున్న వెంకన్న "తెలంగాణ విముక్తి" చిత్రాన్ని గీసి తెలంగాణ వాదాన్ని చాటుకున్నాడు. అలాగే అనబత్తుల కుంచెనుండి జాలువారిన భద్రాచలంలో పవిత్రస్తానం అనే చిత్రాన్ని గోదావరి పుష్కర సమయంలో తిలకించని వారులేరు. ప్రకృతి పై పర్యావరణ పరిరక్షణపై తను గీసిన చిత్రాలకు ఎందరో ప్రముఖులు ఆకర్షితులైనారు. 
రాబోవు రోజుల్లో అనబత్తుల కుంచెనుండి మరిన్ని చిత్రాలను గీయాలని కోరుకుందాం..

వ్యాసకర్త :

కోట దామోదర్ 
మొబైల్: 9391480475 


                      

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...