28, జులై 2024, ఆదివారం

మ్యాథ్స్ ఒలంపియాడ్ లో సత్తా చాటిన భారత్

20, జులై 2024, శనివారం

టీసీఎస్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ కు పునర్వైభవం రానుందా

 *టీసీఎస్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ కు పునర్వైభవం రానుందా!*

16, జులై 2024, మంగళవారం

చింపుకున్న నాగరికం.. చినిగిపోయిన పేదరికం..

చింపుకున్న నాగరికం..

చినిగిపోయిన పేదరికం..

భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులు ప్రపంచానికే ఆదర్శం గా నిలుస్తాయన్నది ఎప్పటికీ నిజం. వారి వేషధారణ ను బట్టి వారు ఏ దేశానికి చెందినవారో చెప్పవచ్చు. ప్రతి దేశంలో వస్త్ర సంస్కృతి చాలా ముఖ్యమైనది. పూర్వం పెద్దలు బట్టల సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేటి యువత ఫ్యాషన్ రంగంలో భాగంగా అమెరికన్ మరియు యూరోపియన్ సంస్కృతికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చాలా కాలంగా వాదిస్తున్నారు. భారతదేశం యువత ఆర్థికంగానే కాకుండా వస్త్ర సంప్రదాయం, సంస్కృతి, ఆహారం విషయంలో కూడా ప్రపంచీకరణ చెందిందంటే అతిశయోక్తి కాదు. యువత మన దేశ సంప్రదాయాలను మరిచి విదేశాల్లోని సంప్రదాయాలపై ఆసక్తి చూపడం చాలా బాధాకరమైన విషయం. నేటి యువత స్వదేశీ సంస్కృతిని మరిచి విదేశీ సంస్కృతికి లొంగిపోతున్నారు. ఫ్యాషన్ పేరుతో విదేశీ దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల దేశీయ వస్త్ర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో చాలా మంది కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులలో ఫ్యాషన్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఎంత మార్పు వచ్చిందంటే? 

డబ్బున్నోడు బట్టలను ఫ్యాషన్‌ అంటూ చించుకుంటుండు.

డబ్బు లేనోడు చినిగిన బట్టలను కుట్టి వేసుకుంటున్నారు.. అంత మార్పు జరిగింది..

ఆ రోజుల్లో పేదవాడు, ధనవంతుడు బట్టలు వేసుకుని పద్ధతిని బట్టి నిర్ణయించేవారు కానీ ఈ రోజుల్లో అది సాధ్యం కాదు ఎందుకంటే అందరి బట్టలు చినిగే ఉంటున్నాయి కాబట్టి.

పేద, ధనిక అంతరాలు:

పేదవాడు ఎదగక పోవడానికి కారణం డబ్బు లేకపోవడమే. పేదవారికి ఏదైనా సాధించాలనే ఆలోచన ఉంటుంది కానీ దాన్ని అమలు చేయడానికి అవకాశాలు ఉండవు మరియు ఏదైనా చేయడానికి సరిపడా డబ్బు ఉండదు. ధనవంతుడు తన కళ్ల ముందు ఎన్నో అవకాశాలు మరియు తనకు కావలసినది కొనడానికి డబ్బు ఉంటుంది. అయినా సరే అవి చాలవు అన్నట్లుగా కొత్త మార్గాలను వెతుక్కుంటూ మనశ్శాంతిని కోల్పోతారు. 

"కోటివిద్యలు కూటికొరకే" అన్నట్లు ఇప్పటికీ తినడానికి తిండి లేక నిరుపేదలు అలమటిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. నిరుపేదలు తిండి దొరకక పస్తులు ఉంటుండగా మరికొంతమంది ధనికులు మాత్రం కడుపునిండా తిన్నా ఎలా అరిగించుకోవాలో తెలియక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ‘లేనోడు తిండికేడిస్తే. ఉన్నోడు అరగక ఏడ్చిండట’ అనే నానుడి పుట్టిందేమో బహుశా. ఉన్నోడికి అన్ని ఉంటాయి లేనోడికి ఏమి ఉండవు అన్నట్టుగా చాలా విచిత్రం ఏమిటంటే, పేదలకు అందుబాటులో లేని ప్రభుత్వ రేషన్ కార్డులు ధనికులకు లభిస్తున్నాయి, రేషన్ బియ్యం తినని వారికి రేషన్ కార్డులు ఉంటున్నాయి, నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో అందలేకపోతున్నాయి. ఇది మన దేశంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. ఏ ఆపద వచ్చినా నష్టపోయేది పేదలే. ఆకలితో అలమటించేది పేదలే.. నిరుపేదలే ప్రాణాలు కోల్పోతున్నారు. పేద పిల్లలకు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులకు చదివించే  స్తోమత ఉండదు. అదే ధనికుల పిల్లలకు చదవాలనే ఆసక్తి లేకున్నా తల్లిదండ్రులు  చదువుకోరా బాబు అని ఎంత చెప్పిన చదవడం చేతకాదు. అందుకే ఒక సామెత పుట్టింది ఎద్దున్నోడికి బుధ్ది ఉండదు బుద్ధి ఉన్నోడికి ఎద్దుండదని. డబ్బు లేని వారికి చదువుకోవాలనే కోరిక ఉంటుంది అందుకే డబ్బు లేని వారు కష్టపడి ప్రయోజకులు అవుతారు. సివిల్స్‌లో విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. పైగా వీరంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం గొప్ప విషయం.

భారతదేశంలో పేద రాష్ట్రాల గురించి నీతి ఆయోగ్ కీలక విషయాలను వెల్లడించింది. బీహార్‌లో సగానికి పైగా పేదలు ఉండగా, కేరళలో ఒక్క శాతం కూడా పేదవారు లేరని వెల్లడించింది. భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ. దేశంలోని పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. మధ్యతరగతి వారు కూడా పేదలుగా మారుతున్నారు. ధనికులు మాత్రమే ధనవంతులు అవుతున్నారు మరియు కొద్దిమంది మాత్రమే ప్రపంచ కుబేరుల అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారనే సందేహం అందరిలోనూ కలగడం సహజం. ఈ సందేహాలకు నీతి ఆయోగ్‌ తెరపడింది. దేశం మొత్తం షాకింగ్ గణాంకాలు విడుదల చేసింది. 

నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో బీహార్ అత్యంత పేద రాష్ట్రం. బీహార్‌లో 52 శాతం మంది పేదలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. మానసిక ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట గ్యాస్ మరియు విద్యుత్ సౌకర్యాలు లేనివారు బీహార్‌లో ఎక్కువ శాతం ఉన్నారు. బీహార్‌లో పోషకాహార లోపం ఉన్నవారి శాతం అత్యధికంగా ఉంది. ఆ తర్వాత జార్ఖండ్ 42.5 శాతం, యూపీ 32 .67 శాతం తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం పేదలు.

అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ. జనాభా 0.71 శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారు. అంటే కేరళలో ఒక్క శాతం కూడా పేదల లేరన్నమాట. పేదలు ఒక శాతం లోపే ఉన్నారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడి ప్రజలందరికీ గుడ్డ, నీడ కొరత లేదు. తర్వాతి స్థానంలో ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఉంది. ఆ తర్వాత దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు 4.89 శాతం మంది పేదలు మాత్రమే ఉన్నారు. పంజాబ్‌లో 5.59 శాతం మంది పేదరికంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 13.74 శాతం పేదలు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కాస్త మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 12.31 శాతం మంది పేదలున్నారు.  పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు తెలంగాణలో 31.10 శాతం, ఏపీలో 26.38 శాతం ఉన్నారు. శిశు మరణాలు ఏపీలో 1.82 శాతం, తెలంగాణలో 1.38 శాతం.

పేదరికం నిర్ములన సాధ్యమేనా?

యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఒకటి 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం. అయితే, ఆ కాలం ముగిసే సమయానికి, ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన ఉంటారని జూలై 2019లో సంస్థ విడుదల చేసిన నివేదిక అందించింది. ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు "పేదలకంటే సంపన్నులకు ఎక్కువ అందుతున్నాయని అందువల్లే భారతదేశంలో పేదలు పేదలుగానే ఉంటున్నారని, ప్రభుత్వాలు ఉచిత పథకాలంటూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదోడి నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు, ఉచిత పథకాలకంటే, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. పైగా ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం వల్ల పేదరికం పెరిగే అవకాశం ఉందని, రాజకీయ నాయకుల అవినీతి కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. దేశంలో అవినీతి అంతమై పేదలకు సరైన ఆశ్రయం లభించినప్పుడు పేదరికం నిర్మూలించబడుతుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

https://www.dishadaily.com/editpage/article-on-latest-dressing-of-youth-and-poverty-342888










మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...