6, ఆగస్టు 2022, శనివారం

అండలేని "చేనేత" జెండా !

 



ప్రాచీన సంప్రదాయాలన్ని అంతరించిపోతున్నప్పటికీ తన సంప్రదాయ వారసత్వ వృత్తిని, కళను   కాపాడుకుంటు వస్తున్న నేతన్న,  కళ  తప్పిపోయిన బతుకీడుస్తున్నాడు. మొదటినుండి ఎందరో నేతలు చేనేత గొప్పదని ఒప్పుకొంటున్నారే గాని నేతన్నజీవితాలు మెరుగు పరిచే బాధ్యత  నుండి తప్పుకుంటున్నారు. మూడు పూటలు కష్టపడే నేతన్న తన బిడ్డలకు ఒక్క పూట కూడా  కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనే దాదాపు స్వాతంత్ర్య ఆనంతరం కుటుంబాలను వదిలి నేతన్నలు పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని షోలాపూర్, బిమండి, బొంబాయి నగరాలు కూడా దాటి గుజారాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్ పట్టణాలలో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేసి ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. పిల్లలను చదివించడానికి స్తోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలెన్నో. ఎప్పటి నుండైతే వీరి వలసలు కొనసాగినాయొ పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయ బద్దంగా నాట్యమాడిన నేతన్నల వీధులు అప్పటి నుండే నిశ్శబ్ధంగా రోధిస్తున్నాయి. అటు తర్వాత జరిగిన పరిణామమే కొంత మంది నేతన్నలు అప్పులు చేసి మర మగ్గాలను తెప్పించుకున్నారు. కానీ వారికి ముడి సరుకు అందుబాటులో లేదు, వున్నా కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితులలో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధ నుండి చూడలేక చాలా మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఇంకా మర మగ్గం మీద నేసిన సరుకు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక, గిట్టుబాటు ధరలేక తప్పనిసరి పరిస్థితులలో  మధ్య ధలారీల దోపిడికి గురు అయి మర మగ్గానికి కూడా దూరంకావలిసిన దుస్థితి ఏర్పడింది. మన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నపటికీ మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్తానం ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. మొదటగా ఇక్కత్ వస్త్రాలు నేసిన పోచంపల్లి నేతకార్మికులు వారి కళానైపుణ్యాన్ని తెలంగాణలోని పలు జిల్లాలోని గ్రామాలకు వ్యాపింపజేయటం చేనేతకు కొంత అండగా నిలిచింది. ఇక్కత్ వస్త్రాలు తెలంగాణ నుండి పలు విదేశాలు ఎగుమతి చేస్తున్నారు అంటే మన చేనేత కార్మికుడి కళానైపుణ్యం ఎలాంటిదో నేరుగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా నేతన్న కల చెదిరినట్లయింది. అనేక నేత పరిశ్రమలు మూతపడటం వలన వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పనిచేయలేక సతమతపడుతున్నాడు, చావుకైనా సిద్ధపడుతున్నాడు.
 అయినా తన వృత్తిని కాపాడటంకోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే భారత దేశానికి గర్వకారణమైన చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమున్నది. ప్రస్తుతం పెరు గుతున్న పెట్టుబడి వ్యయం, తగిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాలచేత చేనేత రంగం ఇబ్బందులు పడుతున్నాయి మన చేనేత కుటుంబాలు. రోజురోజుకి నేతన్నల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అగ్గిపెట్టలో పటేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుడి జీవితం దుర్భరంగా మారకుండా   ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిస్కారం చేయాలని  కోరుకుంటున్న.
✍️
కోట దామోదర్
మొబైల్: 9391480475

1 కామెంట్‌:

యేచన్ చంద్ర శేఖర్ చెప్పారు...

అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి యావత్ ప్రపంచాన్ని "ఔరా" అని ముక్కున వేలేసుకునేలా చేసిన మన తెలుగు నేతన్నల వెతలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. నిజమే మీరన్నట్లు జాతి ఔన్నత్యాన్ని మువ్వన్నెల జెండా ద్వారా రేపరేపలాడించే నేతన్నలకు ప్రభుత్వ అండ కరువవుతోంది...

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...