19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమానత్వం కోసం పోరాటం





ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకునే ఈ దేశ పౌరిడిని నేను. ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించటానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తిరస్కరిస్తారా ? ఎందుకు ప్రవేశం లేదు? కారణం నా వర్ణమా? అయితే విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? అయితే నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని ఉద్యమ వీరుడు. నడవరా ముందుకని నడిపించిన నల్ల వీరుడు. 

ఓక్లహామా యూనివర్సిటీలో నల్లజాతీయులకు సమానత్వ విద్యకోసం తిరగబడ్డ అక్షర యోధుడు  ప్రొఫెసర్ 'జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ ". 

ఓక్లహామా యూనివర్సిటీలో మొట్ట మొదటి నల్లజాతి విద్యార్థిగా చరిత్రలో నిలిచారు. 

వివక్ష చూపించినా:

కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందిన తరువాత ఆయన లాంగ్‌స్టన్ విశ్వవిద్యాలయం లో అత్యధిక కాలం ప్రొఫెసరుగా పనిచేసి జనవరి 28, 1948న రిటైర్మెంట్ తీసుకున్నారు. మొదటినుండి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంవల్ల అయన ఉద్యోగ విరమణ తరువాత 61 సంవత్సరాల వయసులో కూడా మరొక డిగ్రీ కోసం ఓక్లహోమ యూనివర్సిటీ లో ప్రవేశం కొరకు సెప్టెంబర్ లో దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 20, 1948 న ఆయన ధరఖాస్తుని నిరాకరించింది ఓక్లహోమ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిరాకరిస్తారా? ఎందుకు ప్రవేశం లేదు? నేను ఈ దేశ పౌరిడిని కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను నల్లజాతీయుడనే కారణంతో దరఖాస్తుని నిరాకరించినట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? తెల్లజాతీయులే చదవాలి గాని నల్లజాతీయులు చదువకూడదా? అయితే ఈ విషయాన్నీ  నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి మెక్‌లౌరిన్ ఫెడరల్ కోర్టుకి వెళ్లారు. అక్టోబర్ 14, 1948న తరగతులు ప్రారంభం కానున్నాయి. తక్కువ సమయం ఉండటంవల్ల తన ప్రవేశానికి అనుమతి దొరుకుతుందా అన్న సందేహంతో సతమతపడుతున్న సందర్భంలో ఫెడరల్ కోర్టు వారు సెప్టెంబరు 29, 1948, తీర్పులో అతనికి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో అతను విజయం సాధించాడు. అతనికి కోర్టు తీర్పు అనుకూలంగా ఉండటంతో ఓక్లహోమ స్టేట్ రీజెంట్‌లు అక్టోబరు 11, 1948న అతనిని అడ్మిషన్‌కు ఆదేశించక తప్పలేదుఅక్టోబర్ 14, 1948న మెక్‌లౌరిన్ తరగతులకు హాజరైనారు.

అసమానత విద్యకు గురైనారు:

అడ్మిషన్‌కు ఆదేశించినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తరగతి గదిలో అకృత్య రూపాన్ని చూశారు. అతను చదువుతున్న తరగతి గదిలో తెల్లజాతీయుల విద్యార్థులకు దూరంగా వేరు డెస్క్ మరియు చైర్ తో తరగతి గది వెలుపల తలుపు ప్రక్కన కూర్చొని పాఠాలు వినేలా ఏర్పాటుచేశారు. అలా తరగతులన్నింటికీ హాజరవుతూనే తెల్లజాతి విద్యార్థులకు దూరంగా ఉంటూ తన అసమానమైన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. అంతేకాకుండా విద్యార్థులు తినే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రత్యేక టేబుల్స్ వద్ద భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసేవారు; అతను చదువుకోవడానికి కూడ లైబ్రరీలో వేరే టేబుల్‌ని ఉపయోగించాలని మరియు క్రీడా కార్యక్రమాలలో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు మరియు ప్రత్యేక విశ్రాంతి గది అలా అసమానత విద్యకు గురైనారు. అలా జరిగినప్పటికీ శ్వేతజాతీయులకంటే కూడా చదువులో ముందుడేవాడు. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి దృఢమైన సంకల్పంతో తన విద్యను కొనసాగించారు. ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే వర్ణ వివక్షత పోరాటానికి పదునుపెట్టగలిగారు. ఆయన ఎన్నో నల్లజాతీయుల విద్యార్థుల సంఘలని కూడగట్టి వర్ణ వివక్షత నిర్ములన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.  

జీవితంలో మరిచిపోలేని రోజు:

అసమానత విద్య షరతులు వల్ల తాను సమానత్వాన్ని కోల్పోయానని పేర్కొంటూ దావా వేశారు. అయితే ఈసారిమాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అతని వాదనతో ఏకీభవించలేదు మరియు జాతి విభజన అనేది "ఓక్లహోమ రాష్ట్రం యొక్క సామాజిక విధానం" అనే కారణంతో అతను వేసిన దావాను తిరస్కరించింది. అయినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తన పోరాటాన్ని కొనసాగించటానికి తన కేసును ఏకంగా U.S. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు.సుప్రీం కోర్టు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని అతని జాతి ఆధారంగా ఇతర విద్యార్థుల నుండి భిన్నంగా చూడగలరా అనే ప్రశ్నపై దృష్టి సారించింది.జూన్ 5, 1950 న తన కేసును విచారించి ప్రధాన న్యాయమూర్తి ఫ్రెడ్ విన్సన్, న్యాయస్థానం కోసం వ్రాస్తూ, మెక్‌లౌరిన్‌కు అందించబడిన భేదాత్మకమైన చికిత్స పద్నాల్గవ సవరణ యొక్క సమాన రక్షణ నిబంధన ప్రకారం, రాష్ట్ర అధికారులు ఇతర జాతుల విద్యార్థుల మాదిరిగానే వాదిని పరిగణించాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటారని సుప్రీం కోర్టు వాదించింది.ఇలాంటి పరిమితులు అతని విద్యాబ్యాసం  మరియు చర్చలలో పాల్గొనటం ఇతర అబిప్రాయాలు మార్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని మరియు నిరోధిస్తాయని. విద్యార్థులు, మరియు, సాధారణంగా, తన వృత్తిని నేర్చుకోవడానికి ఇలాంటి పరిమితులు అనుకూలించవని సూచించారు. ఇకపై న్యాయస్థానం ఇలాంటి పరిమితులను సహించదని ఓక్లహోమా స్టేట్ రీజెంట్స్ ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో మెక్‌లౌరిన్ ఆశ నెరవేరినట్లైంది. అక్టోబర్ 14 తనకి సంతోషకరమైన రోజు అని ఆయన డైరీ లో రాసుకున్నారు. నిజంగా నల్లజాతియులకు అక్టోబర్ 14 సంతోషకరమైన రోజు అనే చెప్పొచ్చు.  నల్లజాతి విద్యార్థులకు నడవరా ముందుకని దారిచూపిన మార్గదర్శి మెక్‌లౌరిన్. 

నల్లజాతీయుల కోసమే అయన పోరాటం:

దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను, వారి విద్యపట్ల వివక్షతను అంతం చేయటానికి ఎంతగానో పోరాడిన వీరుడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి మనుసులో చిరకాల ముద్రవేసుకున్నారు. అమెరికావంటి అగ్రదేశాలల్లో నల్లజాతీయులు స్వేచ్ఛగా విద్యను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం జార్జ్ మెక్‌లౌరిన్ చేసిన పోరాటమే.

కుటుంబ నేపథ్యం:

జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ 16 సెప్టెంబర్ 1894 న మిస్సిస్సిప్పి, USA లో జన్మించాడు. అతని భార్య పెనినా మెక్‌లౌరిన్, వాన్ కెనడా లో జన్మించింది. పెనినా మెక్‌లౌరిన్ ఉపాధ్యాయ వృత్తిలో 33 సం, విద్యనందించింది. ఆమె 1954లో ఓక్లహోమ యూనివర్సిటీలో హోమ్ ఎకనామిక్స్ లో మూడు డిగ్రీలు, లాంగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ మరియు బి.ఎస్ పట్ట పొందారు. అతని కుటుంబం 1910లో ఓక్లహోమాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మెక్‌లౌరిన్ కి ఇద్దరు కుమారులు, డన్బార్ ఎస్. మెక్ లారిన్, న్యూయార్క్ లో లాయర్, జోఫ్రే సి. మెక్ లారిన్, లాస్ ఏంజిల్స్ టీచర్, ఆయనకు ఒక కుమార్తె కార్డెజా మెక్ లారిన్ లాస్ ఏంజిల్స్ ఉంటుంది. మెక్‌లౌరిన్ అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 4, 1968న 74 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన మరణం నల్లజాతీయులు తీరని లోటు.


మీ 

కోట దామోదర్

Mobile: 9391480475


 .         

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...