5, డిసెంబర్ 2022, సోమవారం

చెదిరిన "క్షౌరవృత్తి"




చెదిరిన "క్షౌరవృత్తి":

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి) కి ప్రాచీన చరిత్ర ఉంది.

మనుషులను జంతువులనుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తి కి ఉందనడంలో అతిశయోక్తిలేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు.
భారతదేశంలో కులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందునుండే ఈ వృత్తి ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని “నాయీ బ్రాహ్మణులు” (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి చేసే వారిని ఒక్కొక్క ప్రాంతంలోఒక్కో పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపరంగా ఈ వృత్తిని నిర్వహించేవారిని "నాయీ" లుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

తొలివైద్యుడు:

చారిత్రక ఆధారాల ప్రకారం క్షురకులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యులు శస్త్రచికిత్సప్రారంభించడానికి వైద్యుడి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లేడ్లు ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.

మొదటి వైద్యురాలు (మంత్రసాని):

గతంలో ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్టు) బదులుగా ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశువు జననం వరకు ‘మంత్రసాని’గా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం.
అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు.
కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది.
వైద్య, విద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
 
మంగళ వాయిద్యాల ప్రత్యేకత:

ప్రాచీన కాలం నుండి నాయీ బ్రాహ్మణులు(మంగళి) క్షౌరవృత్తి తో పాటు సంగీతం (మంగళ వాయిద్యాలు వాయించడం), వైద్యం కూడా వృత్తిగా నిర్వహించేవారు.
మంగళ వాయిద్యాలువాయించడంలో వీరు నిష్ణాతులు. మంగళ వాయిద్య సంగీతంలో భాగంగా వీరు సన్నాయి (నాదస్వరం),డోలు(శృంగభేరి) వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. హిందూ దేవాలయాలలో దైవారాధనకువేదాలలోఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకుకూడా అంతే ప్రాధాన్యత ఉంది.నాదోపాసన చేయడం సాక్షాత్తూఆ పరబ్రహ్మను పూజించడమేనని భగవద్గీత పదవ అధ్యాయం 22వ శ్లోకంలో ప్రస్తావించబడింది.

హిందూ దేవాలయాలలో, నాదస్వరం వినిపించడం సర్వసాధారణ విషయం. గర్భాలయంలో ప్రతిష్టమైన దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనకు ముందు మంగళ వాయిద్యాలను వాయించడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహం, నూతనగృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు బ్రాహ్మణుడివేద మంత్రాలకుఎంత ప్రాముఖ్యత ఉందో మంగళ వాయిద్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

పుణ్యక్షేత్రాలలో నాయీ బ్రాహ్మణుల పాత్ర:

హైందవ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకల తొలగింపుకు చాలా ప్రాధాన్యముంది. ఈ ప్రక్రియను ఒక వేడుకగా నిర్వహించడం మనందరికీ తలుసు. అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం కలగడం సహజమే. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం ఒక ఆచారంగా మారింది. దైవ క్షేత్రాలలో “కళ్యాణ కట్ట” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో భక్తుల తలనీలాలను దేవునికి సమర్పించేందుకు తమ సేవలందిస్తారు కేశఖండనకారులు.
మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగి ఉంటాయనేది నిర్వివాదాంశం. ఈ ఆచారవ్యవహారాలలో భాగమే "పుట్టువెంట్రకుల" వేడుక ఒకటి.

వివాహంలో నాయీ బ్రాహ్మణులపాత్ర:

సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత పందిట్లో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తాడు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు తొలగించి శుభ్రం చేస్తారు.

కేశాలంకరణ(క్షౌరవృత్తి):

మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉంచడానికి శుభ్రపరచడంశుభ్రంగా మరియుమరియు అందంగా మార్చడం "నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తి". పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి "కేశఖండనకేశఖండనం". మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. "ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచక తప్పదుాలి" అనేది జగమెరిగిన నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం . ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళానైపుణ్యం అనివార్యంఎంతో ప్రత్యేకం.

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
 
రచయిత:

కోట దామోదర్
మొబైల్: 9391480475

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...