24, డిసెంబర్ 2022, శనివారం

క్రిస్మస్



ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జన్మించి నేటికీ రెండు వేల సంవత్సరాలు గడిచినా భక్తుల మనుసులో ఇంకా  ఆయన అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడు, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా క్రైస్తవుల ఆరాధనను అందుకుంటున్నాడు.

క్రిస్మస్ డిసెంబర్ 25 న ఎందుకు జరుపుకుంటారు? 

రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ నగరంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి 'ఓ మేరీ! మీరు దేవునిచే ఆశీర్వదించబడ్డారు. నువ్వు కన్యగా గర్భం దాల్చి కొడుకును కంటావు. మీ బిడ్డకు ఏసు అని పేరు పెట్టండి. తాను దేవుని కుమారుడనని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రాత్రి అతనికి కలలో దేవదూత కనిపించి, 'మేరీని పెళ్లిచేసుకోవాలి అని చెపుతారు. దేవుడి దీవెనతో ఆమె గర్భవతి అయింది. కనుక ఆమెకు పుట్టిన కొడుకు భగవంతుడు. తనను నమ్ముకున్న ప్రజలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పారు. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకు రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడు అగస్టస్ సీజర్ తన రాజ్య జనాభాను లెక్కించడానికి  మరియు గణాంకాలను సులభంగా సేకరించేందుకు వీలుగా ప్రజలందరూ డిసెంబర్ 25లోగా స్వగ్రామాలకు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. రాజు ఆజ్ఞను అనుసరించి, జోసెఫ్ మరియు మేరీ వారి స్వస్థలమైన బెత్లెహేముకు బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఆమెకు వసతి దొరకలేదు. చివరకు ఒక సత్ర యజమాని తన గోశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరి పక్కనే ఉన్న పొలాల్లో గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు కొందరు. ఆ సమయంలో, ఒక దేవదూత వారి ఎదురుగా ఆకాశం నుండి దిగివచ్చింది. దూత చుట్టూ కాంతి వ్యాపించడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వారితో, 'భయపడకండి, మీకు శుభవార్త తీసుకురావడానికి నేను ఇక్కడకు వచ్చాను' అని చెప్పాడు. ఈరోజు బేత్లెహేములోని ఒక తొట్టిలో మీ అందరికీ ప్రభువు అయిన లోక రక్షకుడు జన్మించాడు. ఒక పసికందును బట్టలతో చుట్టి, తల్లి కడుపులో తొట్టిలో పడుకోబెట్టారు. ఇవే మీకు సంకేతాలు. లోక రక్షకుడని చెప్పాడు. అతను ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగా, ఆ ప్రాంతమంతా పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌లు తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత తమకు చెప్పినట్లు వారు అందరికీ చెప్పారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల తర్వాత జన్మించాడు. అంటే డిసెంబర్ 25న పుట్టిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు.

క్రిస్మస్ చెట్టు కథ ఏంటి?..

చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టిన రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ఏదో ఒక రకమైన బహుమతి ఇచ్చేవారు. ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచక తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క ఏపుగా పెరిగి అందరి కళ్ల ముందు బంగారు రంగును సంతరించుకుంది. ఇది క్రీస్తు ద్వారా లభించిందని నమ్మిన ప్రజలు క్రిస్మస్ చెట్టును పెట్టడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు అబుదాబిలోని ఓ హోటల్‌లో ఉంది. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన దీని విలువ ఒక మిలియన్ పది మిలియన్ డాలర్లు. ఇది 181 వజ్రాలు, ముత్యాలు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడింది.


మీ 

కోట దామోదర్ 

మొబైల్ 9391480475


కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...