19, డిసెంబర్ 2022, సోమవారం

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట 
 
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు.

మనిషి పుట్టుకతో ఏదైనా అవయవలోపం ఏర్పడినా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి. 

కానీ ఇంద్రియాలలో ప్రధానమైన నయనాలు (కళ్ళు) లేకుంటే మాత్రం ఆ జీవితం అంధకారమే.

మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం వుండకూడదు అంటారు. అవయవ లోపం ఉన్నా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి స్ఫూర్తివంతమైన అంధ మహిళల సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది.  "లక్ష్మీ మీనన్" లోని అచంచలమైన ఆత్మవిశ్వాసమే ఆమెను కొందరు అంధ మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముందుకు నడిచేలా చేసింది. అంతేగాక కళ్లులేవనే ఆత్మన్యూనతా భావంతో వారు చింతించకుండా వారికి నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా చేశారు. ఆమె అందించిన ప్రోత్సాహంతో వారు అంధత్వాన్ని లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగిస్తున్నారు.   

కేరళలోని కొచ్చిన్ కి చెందిన లక్షి మీనన్ వృత్తిరీత్యా డిజైనర్ మరియు వ్యాపారవేత్త. ఆమె కొచ్చిన్‌లో 'ప్యూర్ లివింగ్' అనే సంస్థను నడుపుతుంది. హరిత జీవన ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహనను ప్రచారం చేయడం మరియు నిరుపేదలకు జీవనోపాధి కల్పించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. లక్షి మీనన్ రూపొందించిన అమ్మూమ్మతిరి / విక్స్‌డమ్‌ ప్రాజెక్ట్ క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా కేరళ రాష్ట్రంలోని వృద్ధాశ్రమాలు మరియు అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న ఎంతోమంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. 
లక్షి మీనన్ కళాత్మక ఆలోచనతో "పెన్ విత్ లవ్" అనే ప్రాజెక్ట్ ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఏకైక ఉద్దేశ్యంతో కాగితంతో పెన్నుల తయారీకి శ్రీకారం చుట్టారామె. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30 మంది మహిళలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కొరకు చేపట్టిన ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రమంతటా విజయవంతమైంది. 
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కోసం  "ఆరెంజ్ అలర్ట్" హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు.
ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు పొందారు.   
లక్షి మీనన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం నిరుపేదల జీవనోపాధికి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు. 

అవార్డులు మరియు విజయాలు:

• 'ఆజ్ కీ రాత్ హే జిందగీ' షోలో BBC వరల్డ్ నిర్మించిన స్టార్ ప్లస్‌లో అమితాబ్ బచ్చన్ ద్వారా సత్కారం పొందారు.
• అపెక్స్ సంస్థ అయిన “ఎర్త్ డే నెట్‌వర్క్ గ్లోబల్” ద్వారా అక్టోబర్ 2018లో “ఎర్త్ డే నెట్‌వర్క్ స్టార్‌”గా గౌరవింపబడ్డారు . సీడ్ పెన్‌కు ప్రత్యేక ప్రస్తావనతో పర్యావరణం & జీవావరణ శాస్త్రంలో చేసిన సహకారాల కోసం 195 దేశాలలో 50,000 అనుబంధ సమూహాలు.
• 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు.
• ఆమె ప్రతిష్టాత్మక వనిత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా లెక్కలేనన్ని అవార్డులు  గెలుచుకున్నారు. 
• ప్రఖ్యాత మేరీ క్లైర్ మ్యాగజైన్ యొక్క 'జీనియస్' జాబితాలో చేర్చబడ్డారు
• 2017లో, ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థ ఆమెను వారి '10 మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్' జాబితాలో చేర్చింది.

చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట:

ఒకరోజు లక్షి మీనన్ సెలవుదినంలో త్రిస్సూర్‌లోని ఆయుర్వేద బీచ్ రిసార్ట్‌ సందర్శన సందర్భంగా  అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు కొబ్బరిచెట్లు ఆమెని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా తోటమాలి ఎండిపోయిన కొబ్బరి ఆకులను తొలిగించడం ఆమె మదిలో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది.  పల్లెటూళ్ళలో ఎండు కొబ్బరి ఆకులతో చీపురు తయారుచేయడం సాధారణ విషయం. ఆమె తన చిన్నతనంలో తన తల్లి మరియు అమ్మమ్మతో చీపుర్లు తయారు చేసిన సంఘటనలను గుర్తుచేసుకొని అక్కడున్న కొబ్బరి ఆకు పుల్లలతో చీపురు తయారుచేసే ప్రక్రియను ప్రారంభించారు. అలా ఆమె రోజుకు ఐదు చీపుర్లను సులభంగా తయారు చేయగలమన్న విషయాన్ని గ్రహించింది. అయితే చీపురు కట్ట మొదళ్ళను దగ్గరగా అదిమిపెట్టి ఉంచడానికి సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్‌కు బదులుగా టైలర్ షాపులోని తుక్కు గుడ్డ ముక్కలను ఉపయోగిస్తే బాగుంటుందని నిర్ణయించుకుంది. దీని వెనుక ప్రధాన కారణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడడం. ఇలా తయారైన ఒక్కో చీపురు 250 రూపాయలకు అమ్మగలమనిపించింది ఆమెకు.  
ఆమె తయారుచేసిన మొదటి రెండు చీపురుర్లనూ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని తన ఇంటి ఆవరణంలోని గోడకు అమర్చి ఆ చీపురు కట్టల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా తన మిత్రులకు, బంధువులతో పంచుకున్నారు. అవి చూసిన ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అనుచరులు వెంటనే వాటికోసం ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత కేరళ అంధుల ఫెడరేషన్ గురించి తెలుసుకున్న ఆమె అంధ మహిళలకు సహాయపడే కార్యాచరణ గురించి ఆలోచన చేయమని తన స్నేహితురాలు చేసిన సూచనపై దృష్టి సారించింది. ఆ మరుసటి రోజే ఫెడరేషన్ ను  సందర్శించి చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి తన ప్రతిపాదనను వారికి సవివరంగా వివరించగా చూపులేకపోయినప్పటికీ వారు దృఢసంకల్పంతో సానుకూలంగా స్పందించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. "చూల్" అంటే మలయాళం భాషలో చీపురు అని అర్థం. అలా సంగీతపరంగా సరికొత్త అక్షరాన్ని జోడించి "చూలాల" అని పేరు పెట్టారు.  దంలోని ప్రతి వ్యక్తి సగటున ర్లను తయారుధీమా ఏర్పడ్డాక అందుకుకల్పించడం ముమ్మరంగా ప్రయత్నించి ఈ చీపురు కట్టలను ఆర్టిసానల్ చీపురు విభాగంలో భాగంగా ఉంచాలని నిర్ణయించుకుంది. 
చీపురు కట్టలను తయారు చేసే విధానం గురించి ఆమె చొరవ తీసుకుని కేరళలోని విమానాశ్రయ అధికారులతో పాటు ఇతరులతో చర్చలు జరిపి అన్ని షాపుల్లో ఈ చీపుర్లు అందుబాటులో ఉండేలా చూసి "ఇది మన రాష్త్రం నుండి మీకు ఇవ్వబడుతున్న ఉత్తమ జ్ఞాపకం" అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి ఇవి దృష్టి లోపం ఉన్న మహిళలచే ఎంతో కళాత్మకంగా తయారుచేయబడిన వెలకట్టలేని చీపురుకట్టలు. వైకల్యం మనిషికి తప్ప మనుసుకు కాదని నిరూపించిన ఈ మహిళా బృందానికి మరియు ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన లక్ష్మి మీనన్ కృషి బహుదా ప్రశంసనీయం.     

పెన్ విత్ లవ్:

 పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి చెట్లను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో “పెన్ విత్ లవ్” అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఆమె పెన్ తయారీకి ప్లాస్టిక్ బదులుగా కాగితాన్ని ఉపయోగించి పెన్ చివరభాగాన అగస్త్య చెట్ల విత్తనాలను అమర్చేలా డిజైన్ చేశారు. ఈ తరం వాళ్ళకి అగస్త్య వృక్షం గురుంచి అంతగా తెలియదనే చెప్పొచ్చు. ఆమె సుదీర్ఘ అన్వేషణ మరియు కృషి తర్వాత ఈ విత్తనాలను సేకరించారు.
అగస్త్య వృక్షాలలో ఔషధ గుణాలు అధికంగా ఉండటమే గాక ఆ చెట్టు ఆకులు మరియు పువ్వులు థైరాయిడ్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఎంతో ప్రత్యేకతలున్న ఈ పెన్ ఒకసారి వాడి పడేస్తే పెన్ చివరి భాగంలో ఉండే విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయనే ఉద్దేశంతో రూపొందించారు. ఎదిగిన చెట్టు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలుచేస్తుందని,  పర్యావరణాన్ని కాపాడడంకోసం మీరు ఒక పెన్ కొంటే సరిపోతుందని ఆమె నినాదం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మంది దృష్టి వైకల్యమున్న మహిళలు జీవనోపాధి పొందుతున్నారు.
2016 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మెగాస్టార్ మమ్ముట్టి చేత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. తొలి ఏడాది లక్ష పెన్నులు విక్రయించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం నాలుగు నెలల్లోనే ఆ లక్ష్యాన్ని సాధించడం కొస మెరుపు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది మహిళలలో ఒకరిగా ఎంపిక చేయబడటం గొప్ప విషయం. 

వరద బాధితులకు అండగా:

2018 వరదల కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికుల గ్రామమైన చేందమంగళంలో పుట్టిన 'చెక్కుట్టి' బొమ్మలు ఐక్యరాజ్యసమితి వరకు ప్రయాణించి ప్రేమ, కరుణ సందేశాన్ని ప్రపంచం నలుమూలల తెలిసేలా చేశాయి. చెందమంగళంలో వరదల కారణంగా చెడిపోయిన చేనేత వస్త్రాలతో తయారైన 'చెక్కుట్టి' బొమ్మలు భారత్‌లో రూ.25కు అమ్ముడుపోగా, విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా వసూలైన మొత్తాన్ని వరదలలో సర్వస్వం కోల్పోయిన నేత కార్మికులకు పంచారు. లక్షి మీనన్ వరద బాధితులకు అండగా నిలిచింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే గాక వారికి ఆర్ధిక   సహాయం అందించడం గొప్ప విషయం. 

మత్స్యకారులకు అభినందనల వెల్లువ:

వరదల సమయంలో రక్షకులుగా మారిన మత్స్యకారుల కోసం ఆమె ప్రవేశపెట్టిన బీమా పథకం విజయవంతమైంది. కేవలం రూ. 24 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా ఎవరైనా మత్స్యకారులను స్పాన్సర్ చేయవచ్చు. దీనిని ప్రోత్సహించడానికి, కేరళలోని వివిధ క్యాంపస్‌ల విద్యార్థులు మత్స్యకారులపై ప్రేమ అనురాగాలతో కూడిన సందేశాలను తెలియజేయడానికి పేపర్ బోట్‌లను తయారు చేశారు. ఆ పేపర్ బోట్‌లను ఇప్పుడు కొచ్చిలోని నిఫ్ట్ క్యాంపస్‌లో ప్రదర్శించడం గమనార్హం. 

లక్షి మీనన్ ప్రారంభించిన ప్రాజెక్ట్స్ ద్వారా ఎందరో దృష్టి లోపం గల మహిళలు జీవనోపాధిని పొందుతున్నారంటే అందుకు కేరళ రాష్ట్రమే గాక భారతదేశం గర్వించదగ్గ విషయం.
 
రచన:
కోట దామోదర్ 
మొబైల్: ⁨+91 93914 80475⁩







కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...