21, ఏప్రిల్ 2024, ఆదివారం

అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".

 అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".

విజయం సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వారిలో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యం వైపు వెళ్లి అనుకున్న విజయాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోలేక కొందరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. లక్ష్యం సాధించాలంటే లక్ష సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొనే శక్తి మీలో ఉన్నప్పుడు విజయం మీ సొంతమవుతుంది. అనుకూల వాతావరణం లేకపోవడం మరియు ప్రతికూల పరిస్థితులు లక్ష్యాల సాధనకు ప్రాథమిక అవరోధాలు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు చెందిన వారే.

41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసి, అసాధ్యాలను సుసాధ్యం చేసి లేటు వయసులో అరుదైన ఘనతను సాధించి సంచలనం సృష్టించాడు. సాధారణంగా క్రికెటర్లు 40 ఏళ్లు నిండకుండానే రిటైర్ అవుతారు. కానీ ప్రవీణ్ తాంబే రిటైర్మెంట్ వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి తన ప్రతిభతో క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీల్) లోకి ఎలా రాగలిగారనేది ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలగక మానదు.  

ప్రవీణ్ తాంబే ఓ మధ్యతరగతి కుటుంబంలో విజయ్ తాంబే, జ్యోతి తాంబే దంపతులకు 8 అక్టోబర్ 1971 న ముంబైలో జన్మించారు. తండ్రి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. ప్రవీణ్ తాంబే చిన్నప్పటినుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో స్నేహితులందరూ చదువుపై శ్రద్ధ చూపేవారు, కానీ తను మాత్రం క్రికెట్ పైనే ఆసక్తి చూపేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అతనికి క్రికెట్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకుని ఫాస్ట్ బౌలర్‌గా ఎదగాలనుకున్నాడు. కానీ అతని ఓరియంట్ షిప్పింగ్ కెప్టెన్ అజయ్ కదమ్ అతన్ని లెగ్ స్పిన్ ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతడికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి తగు ప్రోత్సాహాన్ని అందించారు తప్ప ఏ ఒక్క రోజు క్రికెట్ మానేయమని చెప్పలేదు. ఎందుకంటే తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. కానీ ప్రవీణ్ తాంబే తల్లికి క్రికెట్ ఆడటం ఇష్టం ఉండదు. క్రికెట్ ఆడటం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రవీణ్ తాంబేలో మార్పు రాలేదు. అన్నదమ్ములిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ప్రవీణ్ అన్నయ్య ప్రశాంత్ చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధిస్తుండగా, క్రికెట్ అంటే ప్రాణం అన్నట్లుగా ప్రవీణ్ తాంబే చదువుపై ఆసక్తి చూపేవాడు కాదు . ప్రవీణ్ తాంబే ఎప్పుడు తనతో కలిసి క్రికెట్ ఆడేవాడు. 10వ తరగతి తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ తర్వాత అన్నయ్య ప్రశాంత్ మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి సాయపడేవాడు, అయితే ప్రవీణ్ తాంబే క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతనికి సరైన కోచింగ్ లభించలేదు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని జాబ్ చేయడం ప్రారంభించాడు. అయినా క్రికెట్ ఆటపై అతని ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న ఆశయాన్ని అధిగమించాలంటే తపన పెరిగింది. ఉద్యోగం చేస్తూనే రాత్రిపూట ప్రాక్టీస్ చేసేవాడు. కొడుకు క్రికెట్ పిచ్చిని అరికట్టేందుకు తల్లి జ్యోతి తాంబే ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా మారతారు అనే ఉద్దేశంతో పెళ్లి చేశారు. అయినప్పటికీ, ఏమీ మారలేదు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆడలేదు. ఆటే ప్రాణంగా, క్రికెట్ తన జీవితంలో భావించి తన 41 సంవత్సరాల వయస్సులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసి అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వయస్సును లెక్కచేయని మేరునగధీరుడు. ప్రపంచం మెచ్చిన ఆటగాడు ప్రవీణ్ తాంబే.

ప్రారంభ వృత్తి:

జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి తీరాల్సిందే అప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉందనడానికి ఉదాహరణే ప్రవీణ్ తాంబే జీవితం. అతను 1995-96లో ముంబై దేశీయ లీగ్‌లోని డి పార్సీ సైక్లిస్ట్‌ల జట్టుతో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2000 మరియు 2002 సంవత్సరాల మధ్య ముంబై రంజీ ప్రాబబుల్స్ జట్టులో మంచి పేరు సంపాదించారు. కానీ దురదృష్టవశాత్తు తుది జట్టులో డ్రాఫ్ట్ చేయలేకపోయింది. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. లక్ష్యం ముందు ఎన్ని అవరోధాలు కనపడదు అన్నట్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం లక్ష్యంగా ముందుకు సాగారు. పగలు ఉద్యోగం రాత్రి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అహర్నిశలు శ్రమించారు. ఆతర్వాత IPL ప్రారంభ సమయంలో నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా ప్రవీణ్ తాంబే లైజన్ ఆఫీసర్‌గా పనిచేశాడు. జనవరి 2013లో జరిగిన ఆహ్వానం T20లో DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ యొక్క B జట్టుకు తాంబే కోచ్‌గా ఉందని తెలుసుకుని ప్రవీణ్ తాంబే ను బౌలర్‌గా అవకాశం పొందారు. టోర్నమెంట్‌లో గాయపడిన రాహుల్ శర్మ మరియు తాంబే 12 వికెట్లు పడగొట్టి అతని జట్టు ఆహ్వానం టోర్నమెంట్‌లో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తన ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది మరియు రాజస్థాన్ రాయల్స్‌తో IPL ఆడటానికి దోహదపడింది. ఐపీఎల్‌లో ఎంపికయ్యే ముందు, తాంబే ఫస్ట్-క్లాస్ జట్టు కోసం ఉన్నత స్థాయి ఆట కూడా ఆడకపోవడం గమనార్షం. అతను 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రొఫెషనల్ క్రికెట్ అరంగేట్రంతో పాటు 41 సంవత్సరాల వయస్సులో తన T20 అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తర్వాత జరిగిన ఛాంపియన్స్ లీగ్ T20లో లెగ్ స్పిన్నర్ గా స్పాట్‌లైట్‌ని పొందాడు, అతను ఐదు గేమ్‌లలో 6.50 సగటుతో 12 వికెట్లతో పోటీలో ప్రముఖ వికెట్-టేకర్‌గా ఉన్నాడు, నరైన్ మరియు ఆర్ అశ్విన్. ఆ సంవత్సరం అతని ప్రదర్శనలు అతనికి 2013-14 రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు తన తొలి పిలుపునిచ్చాయి. ఇంకా 2014 IPL లో తాంబేక్తా నైట్ రైడర్స్‌పై 5 మే 2014న అహ్మదాబాద్‌లో మనీష్ పాండే , యూసుఫ్ పఠాన్ మరియు ర్యాన్ టెన్ డోస్చాట్‌లను అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు. 2018 T10 లీగ్‌లో కేరళ నైట్స్‌తో జరిగిన నాల్గవ గ్రూప్ మ్యాచ్‌లో అతను క్రిస్ గేల్ , ఇయాన్ మోర్గాన్ , కీరన్ పొలార్డ్ , ఫాబియన్‌లను అవుట్ చేయడం ద్వారా T10 చరిత్రలో 5 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలెన్ మరియు ఉపుల్ తరంగ, మోర్గాన్, పొలార్డ్ మరియు అలెన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా T10 లీగ్‌లో షాహిద్ ఆఫ్రిది తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రవీణ్ తాంబే తన IPL కెరీర్‌లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లో తాంబే గోల్డెన్ వికెట్ అవార్డు అందుకున్నాడు. అనుకున్న ఆశయం కోసం ఎన్నో అవరోధాల అవకాశాలుగా మలుచుకుని ప్రపంచంలోనే అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించి 2020లో, 48 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాడు.

"కౌన్ ప్రవీణ్ తాంబే చిత్రం" స్ఫూర్తితో:

"మీ కలలు సాకారం కావాలంటే ముందుగా కలలు కనాలి" అబ్దుల్ కలాం మాటలను ప్రవీణ్ తాంబే ప్రపంచానికి పోరాట స్ఫూర్తితో తెలియజేశారు. ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా 2022లో జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "కౌన్ ప్రవీణ్ తాంబే". ఉత్తమ క్రీడా చిత్రాల్లో ఒకటి. వయస్సు అనేది ఒక అంకె అని లక్ష్యం చేరుకోవాలంటే వయసుతో పనిలేదని, ప్రవీణ్ తాంబే నిజ జీవితంలో అవరోధాలు, అవమానాలను ఎదుర్కొని లక్ష్యం సాధించిన తీరును ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 









 


9, ఏప్రిల్ 2024, మంగళవారం

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం ఎన్ను నింటే మొయిదీన్ ”. 

ప్రేమించే హృదయానికి ధనిక , పేద అనే తేడా ఉండవు .. నిజమైన ప్రేమికులకు కుల , మత బేధాలు ఉండవు .. ప్రపంచంలో డబ్బు మించిన శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే . కుల మత బేధాలను ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు తల్లిదండ్రులను సైతం మరిపించగల శక్తి ప్రేమకు కలదు . ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చురగగలిగే శక్తి . ప్రాణాలు తీసే శక్తి కలదు ప్రేమకు . ప్రేమ ఒక మధురమైన అనుభూతి , అనిర్వచనీయమైన భావన .  

ఎన్నో ఏళ్లుగా తమ ప్రియురాలు కోసం ఎదురు చూసి చివరికి ప్రేమ విఫలమైన ప్రేమికులను మన నిజ జీవితంలో చూస్తుంటాం . కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తే గర్ల్ ఫ్రెండ్ లను చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ప్రేమిస్తానంటూ నమ్మించి మోసం చేసి చాటేసిన బాయ్ ఫ్రెండ్స్ మరియు ఎంతోకాలంగా ప్రేమించినట్లు నటిస్తూ చివరకు వేరే వారిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్స్ మన దైనందిన జీవితంలో తారసపడటం సహజమే కానీ కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల , మత కట్టుబాట్లను అధిగమించడానికి కూడా వెనుదిరగని విశ్వాసంతో పెళ్లితో ఒక్కటవుతుండటం విశేషం .ఇలాంటి సంఘటనలు మనం నిత్య జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నాను . అంతేకాదు నిత్య జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను చిత్రీకరించడంలో మన దేశ సినీ పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు .​ 

తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రేమ సినిమాలు వచ్చినా . వాటిలో కొన్ని మాత్రమే ప్రేమికుల హృదయాలను కదిలించాయి . ఎస్ శంకర్ నిర్మించిన తమిళ చిత్రం " కాదల్ " అటువంటి చిత్రమే . ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది . ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకున్నారని ప్రియుడిని చిత్రహింసలు పెట్టి అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడం వల్ల ప్రియుడు పిచ్చివాడు కావడం , కొన్ని సంవత్సరాల తరువాత తన ప్రియుడిని పిచ్చివాడు గా గుర్తించి ప్రియురాలు అతని దయనీయ పరిస్థితి కి తానే కారణమని బాధపడిన ప్రేమికుల హృదయాన్ని ద్రవింపజేస్తుంది .అప్పట్లో సినిమా సంచలనం సృష్టించింది

ప్రియురాలి కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేయడం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం . అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్లుగా ఎదురుచూస్తే ప్రేయసి బహుశా సినిమాలో చూసుండకపోవచ్చు . 1960 మరియు 70 దశకంలో కేరళలోని ముక్కమ్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా RS విమల్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం " ఎన్ను నింటె మొయిదీన్ " .

కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ మరియు హిందూ కుటుంబానికి చెందిన కాంచనమాల మధ్య వాస్తవంగా సంభవించిన విషాదకరమైన ప్రేమకథ ఇది . చిత్రం 1960 లో ఇరువంజిప్పుజ నది మరియు ముక్కం గ్రామం నిర్మాణం జరిగిన మొయిదీన్ మరియు కాంచనమాల నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది . సినిమాలో సన్నివేశాలన్నీ ప్రేమికులకు ఉత్కంఠభరితంగా ఉండి వారిని భావోద్వేగాలకు గురిచేస్తాయి . ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ , హిందూ కుటుంబానికి చెందిన భూస్వామి కుమార్తె అయిన కాంచనమాల ఇరువురు ప్రేమలో పడిన సమయంలో మతాంతర వివాహాలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నందున , వారి ప్రేమ వివాహానికి ఇద్దరి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో విడిపోవాల్సి వచ్చింది .మరో పెళ్లి కావాలని కాంచనమాల తండ్రి కట్టుదిట్టమైన ఆంక్షలతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు . పెళ్లి చేసుకుంటే మొయిదీన్ ను పెళ్లి చేసుకుంటానని , లేదంటే అవివాహితగా ఉండిపోతానని కాంచనమాల తన తండ్రికి చెప్పిన సంఘటన అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరూ తమ ప్రేమ గురించిన లేఖల ద్వారా వ్యక్తం చేసుకునే క్రమం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది .రోజు ఆమెను సంప్రదాయవాద బంధువులు పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టిన సందర్భం ద్వారా ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాన్ని చిత్రీకరించడం అభినందనీయం . కాంచనమాలతో విడిపోవడానికి మొయిదీన్ అంగీకరించారు ,

మొయిదీన్ తండ్రి బాల్యంబ్ర పొట్టాట్టు ఉన్న మొయిదీన్ సాహిబ్ కొడుకుని ఇంట్లోనుండి వెళ్ళగొట్టాడు . తర్వాత మొయిదీన్ సామాజిక - రాజకీయ కార్యకర్తగా మారారు . రోజు మొయిదీన్ తండ్రి దగ్గరి సంబంధీకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొయిదీన్ ని అడగగా అందుకు మొయిదీన్ నిరాకరించడంతో , అతని తండ్రి ఓరోజు మొయిదీన్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు .అదృష్టవశాత్తు మొయిదీన్ బతికి బయటపడ్డారు . కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిసి భర్తకు దూరంగా ఉంటూ కొడుకు బాగోగులు చూస్తుంది అతని తల్లి . అనంతరం మొయిదీన్ తండ్రి పై బహిరంగంగా హత్యాప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు . అనంతరం కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మొయిదీన్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది . అంతేకాదు కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని , అనుకోని కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు . తండ్రి కేసు నుంచి విముక్తి పొందేందుకు కొడుకు గొప్ప మనసున్న వ్యక్తిత్వాన్ని కనబరిచాడు . కొడుకు సమాధానంతో మొయిదీన్ సాహెబ్ తన కుమారుడి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు . ఒక రోజు మొయిదీన్ సాహెబ్ తన భార్య మరియు కొడుకు వద్దకు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి ఉండమని చెప్పాడు మరియు రాత్రి మొయిదీన్ సాహిబ్ గుండెపోటుతో వెంటనే మరణించాడు .కాంచనమాల ఇంట్లో ఒప్పుకో ప్రత్యక్ష మొయిదీన్ మరియు కాంచన పారిపోవాలని నిర్ణయించుకున్నారు , అయితే మొయిదీన్ వారి పాస్ పోర్ట్ లను సేకరించి తిరిగి వస్తున్నప్పుడు , తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది . అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగాడు , అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు . అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది . చివరికి , కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి ఇంటిని విడిచిపెట్టింది . ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా . అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు . ఇలాంటి చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి . 19 సెప్టెంబర్ 2015 విడుదలైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది , ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . “ కత్తిరున్ను పాటకు సంగీత దర్శకుడు ఎం . జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం . ఇంకా , ఇది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , 5 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ , కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నుండి అనేక అగ్ర అవార్డులను అందుకుంది

కులమతాల బండిఖానాలో బలైపోతున్న ప్రేమికులు ఎందరో

ప్రేమ అనేది కులం , మతం రంగుల కే పరిమితం కాదని , దేశాలు , ఖండాల వారీగా కూడా ప్రేమగలదని నిరూపించే యదార్థ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారు కొందరైతే . కులం , మతం , పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారు మరికొందరు . కొంతమంది ప్రేమికులకు కులం , మతం , ధనిక , పేద తేడాలు సృష్టించి చివరకు ప్రేమికులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి . ప్రేమకు కులం మతం పేద ధనిక అనే అంతరాలు సృష్టించడం అత్యంత బాధాకరం , అత్యంత ప్రమాదకరం కూడా . రెండు హృదయాలను కలిపేదే ప్రేమ . రెండు హృదయాలు కలిసి జీవించడానికి కులం మతం ఏమి అడ్డు కాదనేది అక్షర సత్యం . నేటి యువత ప్రేమకు ఇంచినంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వడంలేదనేది జగమెరిగిన సత్యం . అందుకు కారణం ప్రేమకు యువతను ఆకర్షించే శక్తి ఎక్కువ ,   అత్యంత ప్రభావం వీరిపైనే ఉంటుందనడంలో సందేహమే లేదు . నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు . అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475       



 








మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...