21, మే 2024, మంగళవారం

మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:

వన్నె తగ్గుతున్న తెలుగు:

విద్యావంతులు మాతృభాష సమస్యను ఎదుర్కొంటే మనం కలలు కంటున్న స్వేచ్ఛా భారతాన్ని సాధించలేమని, అన్ని స్థాయిలలో మాతృభాషను ప్రభుత్వ భాషగా, బోధనా భాషగా కొనసాగించాలని మహాత్ముడు ఆనాడే కోరారు. నేటికీ మహాత్ముడి మనోవ్యధను చిత్రించే పరిస్థితులు ఎందుకున్నాయో అందరూ ఆలోచించాల్సిన విషయమే.

భారత రాజ్యాంగం (ఆర్టికల్ 350A) మరియు కొఠారి కమిషన్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరం అని సూచించారు. యునెస్కో తో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా పిల్లలకు మాతృభాషలోనే చదువు చెప్పాలని చెబుతున్నాయి. ఉత్పత్తిలో అత్యున్నత స్థాయి అభివృద్ధి సాధించిన జపాన్ దేశీయ మాధ్యమాన్ని అత్యున్నత స్థాయిలో అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం 2010 లో ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించిన ప్పటికీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. చాలా దేశాలు మాతృభాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండగా, మన దేశం మాత్రం ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విచారకరం. యువత ఇంగ్లీషు భాషపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో మాతృభాషా మాధ్యమాన్ని బోధించే ప్రభుత్వ పాఠశాలలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగు వద్దు ఆంగ్లం ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాలలు యువతను, తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తున్నా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:

భాష ఒక దేశం యొక్క నాగరికత, సంస్కృతి మరియు ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భాష అనేది భావాన్ని వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా, భావాలు ఏకీకృతం చేయడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మనం తల్లి నుండి మొట్టమొదటగా నేర్చుకునేది , ఎక్కువగా మాట్లాడేదీ, భావోద్వేగ లేదా హృదయాను గత సంబంధం కలిగినదీ, ప్రతిచర్యలో ఉపయోగించేది మాతృభాష. చదువు సమయంలో పిల్లలకు ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు మాతృభాషలో బోధన తప్పనిసరి. విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడంలో మాతృభాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో బోధించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందుతాయి. మాతృభాషలో వ్యక్తీకరించడం, బోధించడం మరియు నేర్చుకోవడం వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం, కళాపోషణ, సాహిత్య అభినయం, సృజనాత్మకత, తీర్పు మొదలైన వాటిలో మాతృభాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో చదువుకోవడం వల్ల ప్రతి పాఠాన్ని కంఠస్థం చేయకుండా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న పాఠం మరచిపోలేము. అంతేకాదు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవగాహన భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థి మాతృభాషలో జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచనకు సిద్ధమవుతాడు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విషయం బాగా అర్థమవుతుంది. ఇంగ్లీషు మీడియంలో అదే చదివే పిల్లలు  పాఠం పై పట్టు సాధించ లేరు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారిని, మాతృభాషా మాధ్యమం లో చదివిన వారిని పరిశీలించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివే వారికి పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది.

తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత కొరత:

ఇప్పటివరకు ఏ పార్టీ అయినా ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియానికి మార్చుతామని, తెలుగు ని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంచుతామని హామీలు ఇవ్వడం జరిగింది అంతే తప్ప ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్టుగా ఉంచుతామని ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం లో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకపోవడమే కాదు గత మూడేళ్ల నుంచి అనేక ప్రాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం గా మార్చారు. దీంతో పాటు మిగిలిన పాఠశాలలను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అవుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమంపై మక్కువ చూపుతున్నారనే ఒక్క కారణం చూపుతూ తెలుగు మాధ్యమాన్ని లేకుండా తీసిపారేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు మాతృభాష పై పట్టు కోల్పోవడమే కాక గురువులు చెప్పే పాఠం లోని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మహాత్మాగాంధీ మాతృభాషలో విద్య ఉంటె స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట. ఇది మాత్రం అక్షర సత్యమే, భాషా చాతుర్యం ఉంటే ఏదైనా సంక్లిష్టమైన విషయాన్ని సులభంగా పరిష్కరించగలము మరియు మనం చెప్పదలుచుకున్న ప్రతిదాన్ని క్షణాల్లో వివరించగలము. ఊహాత్మక ఆలోచనకు, ఊహాత్మక శక్తికి, సృజనాత్మకతకు మూలం మాతృభాష.

మాతృభాషను విస్మరిస్తున్నారు:

మాతృభాషను విస్మరించి పర భాషకు పట్టం ఎందుకు కడుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పర భాషలోనే దొరుకుతున్నాయి కాబట్టి అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య లేనందున విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం కోల్పోతున్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా  ఆంగ్లమాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగు మాట్లాడితే అందులో చాలావరకు తప్పులు ఉంటున్నాయి. అంటే వారు కనీసం మాట్లాడటానికి కూడా విముఖత చూపుతున్నారు. రాబోవు రోజుల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. ఆంగ్ల మాధ్యమానికి ఉన్నంతగా ప్రోత్సాహకాలు తెలుగు మాధ్యమానికి లేకపోవడంతో ప్రజలు కూడా తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని మార్పు కోరుకుంటున్నారు.  

ఇతర దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో చూద్దాం:

అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి విద్యా విధానం విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది కాబట్టి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు.

 జపాన్:

జపాన్‌లో విద్యార్థులకు పాఠాలే కాకుండా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం ఎలా? స్వీయ నియంత్రణ ఎలా ఉండాలి? ఈ సబ్జెక్టులను ప్రాథమిక మాధ్యమంలోనే విద్యార్థులకు బోధిస్తారు. పది సంవత్సరాల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా చిన్న చిన్న పరీక్షలతోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత గా భావించి ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాకుండా వారితో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉపయోగపడే జపనీస్ కాలిగ్రఫీ మరియు సాహిత్యం కూడా నేర్పిస్తారు.

ఫ్రాన్స్:

ఆరేళ్లలోపు పిల్లలందరిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలి. ఇక్కడ పాఠశాలలు వారానికి నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మన దేశంలో 10వ తరగతి పరీక్ష లాగా ఇక్కడ కూడా బ్యాకలారియాట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయినట్లు. బ్యాకలారియాట్ అనేది US హైస్కూల్ డిప్లొమా కి సమానం.

సింగపూర్:

ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్య నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు.

ప్రభుత్వ పాఠశాలలు మూత బడటానికి కారణం:

తెలంగాణలో ప్రభుత్వ బడులు మూసివేయడం బాధాకరమైన విషయం. అందుకు కారణం బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలో టీచర్స్ కొరత వల్లే పిల్లలను పంపలేక పోతున్నామని చెబుతున్నారు. కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవడానికి, తల్లిదండ్రులు చేర్పించక పోవడానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారికంగా, శాస్త్రీయంగా ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. కేవలం ఉపాధ్యాయులనే నిందిస్తున్నారనే విష ప్రచారం జోరుగా సాగుతోంది. పిల్లలను తెలుగు మీడియం చదివిస్తే రాబోవు రోజుల్లో సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువు కొరకు ఊరి బడిని వదిలి, కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది. కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడం మరొక ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా, ఉపాధ్యాయుల కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475

11, మే 2024, శనివారం

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్నారు ":KS రాజన్న".

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్న ":KS రాజన్న".

“సేవే మార్గం” అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చరిత్రలో తన నమూనా సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాత్తు పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, “ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవి”అని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని ఆమె తన జీవితం ద్వారా చాటిచెప్పింది. ఆమె తన జీవిత కాలంలోనే కాకుండా మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. “మానవుడే మహనీయుడు” అనే నానుడి నిజమని నిరూపించిన మహిళా మూర్తి ఆమె. మదర్‌ థెరిసా స్ఫూర్తితోనేటికీ ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటం ఆమె ఆదర్శమయ జీవితానికి ప్రతీక.

మనిషికి వైకల్యం ఉన్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వికలాంగుడు, సామాజిక సేవాతత్పరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె ఎస్ రాజన్న జీవిత కథ గురించి కొంత తెలుసుకుందాం.

పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయిన ఆయన స్వీయ ప్రేరణ, దీక్షతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. సమాజంలో తాను ఎవరికీ తక్కువ కాదని భావించిన రాజన్న 2002లో వివిధ వైకల్యాలున్న క్రీడాకారుల కోసం నిర్వహించిన పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో క్రీడలో స్వర్ణం సాధించాడు. అంతేకాదు స్విమ్మింగ్‌లో రజతం సాధించి ఆశయసిద్ధికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు. అతను వికలాంగుల రాష్ట్ర కమిషనర్‌గా కూడా పనిచేశాడు.

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన కేఎస్ రాజన్న 11 ఏళ్ల వయసులో పోలియో బారిన పడి చేతులు, కాళ్లు చచ్చుబడి వికలాంగుడైన రాజన్న ధైర్యం కోల్పోకుండా మోకాళ్లపై నడవడం నేర్చుకున్నాడు. అందరితో సమానంగా విద్యనభ్యసించాలనే దృఢ సంకల్పంతో పట్టుదలతో చదివి 1975లో రాష్ట్రస్థాయి సివిల్ పరీక్షల్లో విజయం సాధించారు. 1980లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, తను వికలాంగుల ప్రయోజనాల కోసం, వికలాంగుల సమాన అవకాశాల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సామాజిక కార్యకర్తగా శ్లాఘనీయమైన సేవలందించారు. వికలాంగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి వివిధ రంగాల్లో అఖండ విజయాలు సాధించారు. వందలాది మందికి ఉపాధి కల్పించి వేలాది మంది వికలాంగులకు స్వావలంబన కల్పించారు. అక్కడితో ఆగకుండా, రాజకీయాల్లో చేరి లింగరాజ పురం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ఎస్ ఎంకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బెళూరు సిటీ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా నామినేషన్‌కు చేర్చారు. వికలాంగులకు ఉపాధి హామీ కల్పించడం కోసం రాజన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు.తన సంస్థ ద్వారా ప్రత్యేకంగా 500 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పించడం అభినందనీయం. రాజన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2013లో రాజన్నకు 'కమిషనర్ డిసేబుల్' పదవి ఇచ్చింది. రాజన్న 54 ఏళ్ల వయసులో రాష్ట్ర తొలి వికలాంగ కమిషనర్‌గా సభ్యులవ్వడం గర్వకారణమని.. ఆయన హయాంలో వికలాంగుల జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వికలాంగుల చట్టం సక్రమంగా అమలు కావాలంటే వికలాంగుల గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్ద ఎత్తున పోరాటం సాగింది. ఈ నేపథ్యంలోనే వికలాంగుల సంఖ్య మాత్రమే కాకుండా వైకల్యంతో బాధపడుతున్న జనాభా ఎంత, విద్యార్హత, ఉపాధి, ఆదాయం వంటి వివరాలను కూడా నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అనేక సమస్యలపై అధ్యయనం చేసి వికలాంగులకు ప్రశంసనీయమైన సేవలందించారు. కమిషనర్ పదవిలో రాజన్న 2016 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రారంభంలో ఆయనను పదవి నుంచి తొలగించింది. రాజన్నను తొలగించడంపై రాష్ట్ర వికలాంగుల సంఘాలు విమర్శించాయి. కాగా ఆ తర్వాత ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం పునః సంస్కరణల్లో భాగంగా రాజన్నను తిరిగి నియమించింది. పునర్నియామకం తర్వాత ఆయన  ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

KS రాజన్న సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం “అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త” విభాగంలో ఆయనకు 2024 మే 9న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలవడం ద్వారానే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్న వారే గొప్పవారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసే వారిని ఇష్టపడతారు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.

సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో జీవించడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనినైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసే వారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా పరోక్షంగా సేవ చేస్తున్నట్టే. రాజన్న సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేఎస్ రాజన్న తన సామాజిక సేవలో వైకల్యాన్ని ఎప్పుడూ అడ్డంకిగా భావించలేదు. అది ఆశయ సాధనకు ఏమాత్రం అవరోధం కాబోదని ఆయన సాధించిన ఈ విజయం నేటి యువతకు ముఖ్యంగా వికలాంగులకు ఎంతో స్ఫూర్తిదాయకం.

సంకల్పం, నిర్విరామ కృషితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన "కె.ఎస్.రాజన్న" జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు..  

అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "KS రాజన్న". ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

3, మే 2024, శుక్రవారం

చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం"

  చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం":


మానవుడు దైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఆటంకాలు, అవహేళనలు, భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. విమర్శలు వింటూ కూర్చుంటే లక్ష్యం సాధించడం అసాధ్యం. విమర్శలను వినకుండా ముందుకు సాగినప్పుడే విజయం తథ్యం.

మారుతున్న కాలానికి అనుగుణంగా, శ్రమను తగ్గించడానికి మరియు పనిని సులభతరం చేయడానికి అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఆవిష్కరణలు సృష్టించడం అవసరం. మునుపు చేతితో ఉత్పత్తి చేయడం ద్వారా తక్కువగా ఉండే ఉత్పాదకతను యంత్రీకరణ ద్వారా పెంచేందుకు అవిశ్రాంత కృషి చేసిన ఆవిష్కర్తలకు అభినందనలు. తయారు చేయడానికి విద్య మాత్రమే కాదు, యంత్రం యొక్క పనిలో నైపుణ్యం కూడా అవసరం. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆవిష్కర్తలలో ఉన్నత విద్యావంతుల కంటే సామాన్యులే ఎక్కువగా ఉండటం వారి కళాత్మక ప్రతిభకు నిదర్శనం.

మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుసడలని ప్రయత్నం, సాధించాలంటే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏదైనా పనిని మొదట ప్రారంభించినప్పుడు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు పొందడం కంటే అవహేళనలు, అవరోధాలు ఎక్కువగా ఎదుర్కొంటాము. అవరోధాలకు భయపడి వెనుతిరిగితే లక్ష్యం చేరడం అసాధ్యం. అవరోధానికి అవకాశాలుగా మలచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగిన వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ ప్రయత్నాన్ని 7 సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి "చింతకింది మల్లేశం".

అతను కనిపెట్టిన "లక్ష్మీ ఆసు" యంత్రం అతనికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టింది అదనంగా ఫోర్బ్స్ జాబితాలో మల్లెశంకు చోటు దక్కింది. లక్ష్మి ఆసు యంత్రం ఆసియాలోనే అత్యుత్తమమైనది అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ కొనియాడడం గర్వించదగ్గ విషయం. అద్వితీయమైన ఆవిష్కరణ అతని గుర్తింపుగా భారతదేశం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' తో సత్కరించింది.

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చింతకింది మల్లెశం స్వగ్రామం యాదాద్రి జిల్లా, ఆలేరు మారుమూల పల్లె షారాజీపేట. తండ్రి లక్ష్మి నారాయణ, తల్లి లక్ష్మి ఇద్దరు చేనేత కార్మికులు, రోజు అంత కష్టపడితే గాని కడుపునిండని పరిస్థితి వారిది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతి లోనే చదువు ఆపేశాడు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకవైపు మగ్గం పని చేస్తూనే చదువుపై ఆసక్తితో ప్రైవేటుగా 7వ చదివి పాసైనారు, తోటి స్నేహితులందరూ చదువుతున్నారు తాను మగ్గం పని చేస్తున్నాను రాబోవు కాలంలో కనీసం 10వ తరగతి చదివే వారికి సరైన ఉపాధి అవకాశాలు ఉండవు అనే ఉద్దేశ్యంతో 10వ తరగతి కూడా ప్రైవేటుగా చదివి పాసయ్యాడు. తండ్రి చీరలు నేస్తూ కొడుకును కూడా చీరలు నేయడంలో నిపుణుడిని చేశారు. తల్లి చీర నేయడానికి సరిపడా దారాన్ని ఆసు పోసి వారికి అందించింది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. ఇలా రోజుకు 18 వేల సార్లు అంటే సుమారు 25 కి.మీ దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారుకావు. ఎంతో శ్రమ తో కూడుకున్నది చేనేత పని. రోజు కండెల చుట్టూ దారాన్ని తిప్పడం వలన చేతులు లాగుతూ భుజం నొప్పితో బాధపడుతుండేది. అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక అమ్మ శ్రమను తగ్గించడానికి ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచన ఆచరణలో పెట్టేందుకు తల్లితో కలిసి ఆమె చేస్తున్న పనిని గమనించి ఆ పనిని ఐదు భాగాలుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.తన ఆలోచన ఇరుగుపొరుగు వారితో పంచుకున్నాడు. అందరూ మల్లేశం ను నిరుత్సాహపరిచారు కానీ ఎవరూ ప్రోత్సహించలేదు కానీ అతను తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు మరియు విఫలమయ్యాడు మరియు కొంత డబ్బు కోల్పోయాడు. అయితే, ప్రతి రోజూ అదే పని గురించి ఆలోచన. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. వారి నుంచి విమర్శలు రావడం వంటి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే ఆ పనిని వదలక పోవడం వల్ల మల్లేశం కి పెళ్లి చేస్తే నైనా ఆ పనిని మరచి వేరే పని చేసి బతుకుతాడు అని భావించి అతనికి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంత కాలం వరకు ఆ పని జోలికి వెళ్లకుండా మగ్గం పని చేశారు. తర్వాత మధ్యలో ఆగిపోయిన పనిపై మళ్లీ ఆలోచన వచ్చింది. తన ఆలోచన భార్యకు చెప్పి, తన వద్ద ఉన్న కొంత డబ్బుతో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అతను విజయం సాధించలేకపోయాడు మరియు అతను తన భార్య నుండి తీసుకున్న డబ్బు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు తీవ్రంగా విమర్శిస్తుండగా.. ఇక్కడ అప్పులు తీర్చడం కష్టమని భావించి హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. అతను ఎలక్ట్రికల్ మోటార్స్ గురించి కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. తాను తయారు చేయాలనుకున్న యంత్రానికి కావాల్సిన టెక్నాలజీని వెతుకుతుండగా బాలానగర్ లోని ఓ ఎలక్ట్రికల్ కంపెనీలో తనకు కావాల్సిన టెక్నాలజీ దొరికింది. తాను తయారు చేసిన యంత్రానికి సాంకేతికతను అమర్చేందుకు ప్రయత్నించి, అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. అనంతరం తాను తయారు చేసిన యంత్రాన్ని పరీక్షించమని కొందరిని అడగగా, పరీక్షిస్తే ముడిసరుకు వృధా అవుతుందని చెప్పారు. అయితే తాము విజయం సాధిస్తామని పట్టుబట్టి.. ముడిసరుకు వృధా అయితే చెల్లిస్తామని చెప్పి యంత్రాన్ని పరీక్షించారు. అద్భుతంగా పనిచేస్తుంది అని వారు చెప్పడంతో తన 7 ఏళ్ల శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.చాలా ఏళ్ల తర్వాత చేనేత శ్రామికకుల శ్రమను తగ్గించేందుకు సరైన యంత్రాన్ని కనుగొన్న మల్లేశం ను చేనేత కార్మికులు, జిల్లా నాయకులు అభినందించారు. అతని యంత్రాన్ని పరీక్షించిన కొందరు ఇలాంటి యంత్రాన్ని కూడా తయారు చేయమని అడిగారు మరియు చాలా కొనుగోలు చేశారు. అయితే మొదట్లో ఆసు యంత్రాన్ని పూర్తిగా స్టీల్ తో తయారు చేయబడినందున యంత్రం ధర 13000 మాత్రమే అవుతుంది. అనూహ్యంగా 2005లో స్టీలు రేటు పెరగడంతో యంత్రం ఖరీదు 26000 కు చేరుకోగా అంత డబ్బుతో ఎవరికైనా యంత్రం కొనడం కష్టమని తెలిసి మల్లేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అనుకోకుండా ఒక స్నేహితుడు అతనికి మంచి సలహా ఇచ్చారు. స్టీల్ తో తయారు చేస్తే ఎక్కువ ఖర్చవుతుందని, అదే యంత్రాన్ని విద్యుత్ సహాయంతో తయారు చేస్తే ఖర్చు తగ్గుతుందని సూచిస్తున్నారు. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ లో ప్రావీణ్యం సంపాదించేందుకు ఎలక్ట్రికల్ సంబంధిత పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా కొన్నాడు. ప్రతి రోజు ఒక్కో పాఠాన్ని డిక్షనరీ సహాయంతో అర్థం చేసుకుని కష్టపడి తనకు కావాల్సిన యంత్రాన్ని తయారు చేసి రెండేళ్ల తర్వాత స్టీల్ మెషీన్ ధర రూ.13000 కి తయారు చేసి ఎలక్ట్రికల్ ఆసు యంత్రాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశాడు. అతి తక్కువ సమయంలోనే 750 మిషన్లు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2009లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్‌లు నేయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.
మొదట్లో విమర్శలు చేసిన తల్లిదండ్రులు సైతం గర్వించదగ్గ ఆవిష్కరణ చేశారు.
చేనేత కార్మికులకు సాంకేతిక సహకారం అందించిన చింతకింది మల్లెశం కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

అవార్డులు:
2009లో భారత రాష్ట్రపతి చే
2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు లభించాయి.
2011లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చేరింది.
2017లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు మరియు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ యంత్రాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) భారతదేశం ద్వారా అత్యుత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్‌గా గుర్తించింది మరియు మల్లేశం ను 2009లో భారత రాష్ట్రపతి సత్కరించారు.

ప్రేరణ పొందారు:

2019లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "మల్లేశం" చింతకింది మల్లెశం జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. 

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475                              

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...