3, మే 2024, శుక్రవారం

చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం"

  చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం":


మానవుడు దైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఆటంకాలు, అవహేళనలు, భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. విమర్శలు వింటూ కూర్చుంటే లక్ష్యం సాధించడం అసాధ్యం. విమర్శలను వినకుండా ముందుకు సాగినప్పుడే విజయం తథ్యం.

మారుతున్న కాలానికి అనుగుణంగా, శ్రమను తగ్గించడానికి మరియు పనిని సులభతరం చేయడానికి అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఆవిష్కరణలు సృష్టించడం అవసరం. మునుపు చేతితో ఉత్పత్తి చేయడం ద్వారా తక్కువగా ఉండే ఉత్పాదకతను యంత్రీకరణ ద్వారా పెంచేందుకు అవిశ్రాంత కృషి చేసిన ఆవిష్కర్తలకు అభినందనలు. తయారు చేయడానికి విద్య మాత్రమే కాదు, యంత్రం యొక్క పనిలో నైపుణ్యం కూడా అవసరం. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆవిష్కర్తలలో ఉన్నత విద్యావంతుల కంటే సామాన్యులే ఎక్కువగా ఉండటం వారి కళాత్మక ప్రతిభకు నిదర్శనం.

మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుసడలని ప్రయత్నం, సాధించాలంటే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏదైనా పనిని మొదట ప్రారంభించినప్పుడు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు పొందడం కంటే అవహేళనలు, అవరోధాలు ఎక్కువగా ఎదుర్కొంటాము. అవరోధాలకు భయపడి వెనుతిరిగితే లక్ష్యం చేరడం అసాధ్యం. అవరోధానికి అవకాశాలుగా మలచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగిన వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ ప్రయత్నాన్ని 7 సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి "చింతకింది మల్లేశం".

అతను కనిపెట్టిన "లక్ష్మీ ఆసు" యంత్రం అతనికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టింది అదనంగా ఫోర్బ్స్ జాబితాలో మల్లెశంకు చోటు దక్కింది. లక్ష్మి ఆసు యంత్రం ఆసియాలోనే అత్యుత్తమమైనది అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ కొనియాడడం గర్వించదగ్గ విషయం. అద్వితీయమైన ఆవిష్కరణ అతని గుర్తింపుగా భారతదేశం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' తో సత్కరించింది.

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చింతకింది మల్లెశం స్వగ్రామం యాదాద్రి జిల్లా, ఆలేరు మారుమూల పల్లె షారాజీపేట. తండ్రి లక్ష్మి నారాయణ, తల్లి లక్ష్మి ఇద్దరు చేనేత కార్మికులు, రోజు అంత కష్టపడితే గాని కడుపునిండని పరిస్థితి వారిది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతి లోనే చదువు ఆపేశాడు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకవైపు మగ్గం పని చేస్తూనే చదువుపై ఆసక్తితో ప్రైవేటుగా 7వ చదివి పాసైనారు, తోటి స్నేహితులందరూ చదువుతున్నారు తాను మగ్గం పని చేస్తున్నాను రాబోవు కాలంలో కనీసం 10వ తరగతి చదివే వారికి సరైన ఉపాధి అవకాశాలు ఉండవు అనే ఉద్దేశ్యంతో 10వ తరగతి కూడా ప్రైవేటుగా చదివి పాసయ్యాడు. తండ్రి చీరలు నేస్తూ కొడుకును కూడా చీరలు నేయడంలో నిపుణుడిని చేశారు. తల్లి చీర నేయడానికి సరిపడా దారాన్ని ఆసు పోసి వారికి అందించింది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. ఇలా రోజుకు 18 వేల సార్లు అంటే సుమారు 25 కి.మీ దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారుకావు. ఎంతో శ్రమ తో కూడుకున్నది చేనేత పని. రోజు కండెల చుట్టూ దారాన్ని తిప్పడం వలన చేతులు లాగుతూ భుజం నొప్పితో బాధపడుతుండేది. అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక అమ్మ శ్రమను తగ్గించడానికి ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచన ఆచరణలో పెట్టేందుకు తల్లితో కలిసి ఆమె చేస్తున్న పనిని గమనించి ఆ పనిని ఐదు భాగాలుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.తన ఆలోచన ఇరుగుపొరుగు వారితో పంచుకున్నాడు. అందరూ మల్లేశం ను నిరుత్సాహపరిచారు కానీ ఎవరూ ప్రోత్సహించలేదు కానీ అతను తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు మరియు విఫలమయ్యాడు మరియు కొంత డబ్బు కోల్పోయాడు. అయితే, ప్రతి రోజూ అదే పని గురించి ఆలోచన. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. వారి నుంచి విమర్శలు రావడం వంటి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే ఆ పనిని వదలక పోవడం వల్ల మల్లేశం కి పెళ్లి చేస్తే నైనా ఆ పనిని మరచి వేరే పని చేసి బతుకుతాడు అని భావించి అతనికి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంత కాలం వరకు ఆ పని జోలికి వెళ్లకుండా మగ్గం పని చేశారు. తర్వాత మధ్యలో ఆగిపోయిన పనిపై మళ్లీ ఆలోచన వచ్చింది. తన ఆలోచన భార్యకు చెప్పి, తన వద్ద ఉన్న కొంత డబ్బుతో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అతను విజయం సాధించలేకపోయాడు మరియు అతను తన భార్య నుండి తీసుకున్న డబ్బు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు తీవ్రంగా విమర్శిస్తుండగా.. ఇక్కడ అప్పులు తీర్చడం కష్టమని భావించి హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. అతను ఎలక్ట్రికల్ మోటార్స్ గురించి కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. తాను తయారు చేయాలనుకున్న యంత్రానికి కావాల్సిన టెక్నాలజీని వెతుకుతుండగా బాలానగర్ లోని ఓ ఎలక్ట్రికల్ కంపెనీలో తనకు కావాల్సిన టెక్నాలజీ దొరికింది. తాను తయారు చేసిన యంత్రానికి సాంకేతికతను అమర్చేందుకు ప్రయత్నించి, అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. అనంతరం తాను తయారు చేసిన యంత్రాన్ని పరీక్షించమని కొందరిని అడగగా, పరీక్షిస్తే ముడిసరుకు వృధా అవుతుందని చెప్పారు. అయితే తాము విజయం సాధిస్తామని పట్టుబట్టి.. ముడిసరుకు వృధా అయితే చెల్లిస్తామని చెప్పి యంత్రాన్ని పరీక్షించారు. అద్భుతంగా పనిచేస్తుంది అని వారు చెప్పడంతో తన 7 ఏళ్ల శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.చాలా ఏళ్ల తర్వాత చేనేత శ్రామికకుల శ్రమను తగ్గించేందుకు సరైన యంత్రాన్ని కనుగొన్న మల్లేశం ను చేనేత కార్మికులు, జిల్లా నాయకులు అభినందించారు. అతని యంత్రాన్ని పరీక్షించిన కొందరు ఇలాంటి యంత్రాన్ని కూడా తయారు చేయమని అడిగారు మరియు చాలా కొనుగోలు చేశారు. అయితే మొదట్లో ఆసు యంత్రాన్ని పూర్తిగా స్టీల్ తో తయారు చేయబడినందున యంత్రం ధర 13000 మాత్రమే అవుతుంది. అనూహ్యంగా 2005లో స్టీలు రేటు పెరగడంతో యంత్రం ఖరీదు 26000 కు చేరుకోగా అంత డబ్బుతో ఎవరికైనా యంత్రం కొనడం కష్టమని తెలిసి మల్లేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అనుకోకుండా ఒక స్నేహితుడు అతనికి మంచి సలహా ఇచ్చారు. స్టీల్ తో తయారు చేస్తే ఎక్కువ ఖర్చవుతుందని, అదే యంత్రాన్ని విద్యుత్ సహాయంతో తయారు చేస్తే ఖర్చు తగ్గుతుందని సూచిస్తున్నారు. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ లో ప్రావీణ్యం సంపాదించేందుకు ఎలక్ట్రికల్ సంబంధిత పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా కొన్నాడు. ప్రతి రోజు ఒక్కో పాఠాన్ని డిక్షనరీ సహాయంతో అర్థం చేసుకుని కష్టపడి తనకు కావాల్సిన యంత్రాన్ని తయారు చేసి రెండేళ్ల తర్వాత స్టీల్ మెషీన్ ధర రూ.13000 కి తయారు చేసి ఎలక్ట్రికల్ ఆసు యంత్రాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశాడు. అతి తక్కువ సమయంలోనే 750 మిషన్లు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2009లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్‌లు నేయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.
మొదట్లో విమర్శలు చేసిన తల్లిదండ్రులు సైతం గర్వించదగ్గ ఆవిష్కరణ చేశారు.
చేనేత కార్మికులకు సాంకేతిక సహకారం అందించిన చింతకింది మల్లెశం కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

అవార్డులు:
2009లో భారత రాష్ట్రపతి చే
2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు లభించాయి.
2011లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చేరింది.
2017లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు మరియు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ యంత్రాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) భారతదేశం ద్వారా అత్యుత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్‌గా గుర్తించింది మరియు మల్లేశం ను 2009లో భారత రాష్ట్రపతి సత్కరించారు.

ప్రేరణ పొందారు:

2019లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "మల్లేశం" చింతకింది మల్లెశం జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. 

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475                              

కామెంట్‌లు లేవు:

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్

మా నాన్నే స్ఫూర్తి.. TEDx స్పీకర్ ప్రాచీ ఠాకూర్ : తల్లిదండ్రులు   తమ   పిల్లల   చదువుల   కోసం   రేయింబవళ్లు   శ్రమిస్తూ ,  ఎలాంటి   కష్టాలు ...