*కర్మ ఫలం:*
కథలు మనసును ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించలేవన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నతనంలో పెద్దలు చెప్పిన కొన్ని కథలు ఈ రోజుకీ మన ప్రతి ఒక్కరి మదిలో తిరుగుతూనే ఉంటాయి. కాలం గడిచినా, పరిస్థితులు మారినా, ఆ కథలు మాత్రం మన జ్ఞాపకాల నుంచి చెరిగిపోవు. కారణం ఏంటంటే—ఆ కథలు మన మనసును లోతుగా తాకాయి; నవ్వించాయి, ఆలోచింపజేశాయి, జీవితం నేర్పాయి.
అయితే, అలా కథల ద్వారా అనుభవాన్ని, సత్యాన్ని పంచే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి పల్లెలో ఉండే కథకులు, పామరులు, పెద్దలు—ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోతున్నారు. కథలు తగ్గిపోలేదు గానీ, వాటిని చెప్పే గొంతులు మాత్రం మెల్లగా తగ్గిపోతున్నాయి అన్న భావన కలుగుతోంది.
మా ఊరిలో (గుమ్మడవెల్లి) ఒక తాత (గార్థుల రాజమల్లు) చెప్పిన ఒక అద్భుతమైన కథ నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ కథ మొన్నే ఈమద్యే చెప్పింది కాదు. నేను అయిదవతరగతిలో ఉన్నపుడు చెప్పిన కథ. తాత ఆ కథ చెప్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారందిరిని ఆకర్షించి హాస్యాన్ని అందరి పెదాలపై నాట్యమాడేలా చేసింది తాత చెప్పిన కథ. ఆ కథ కంటే ముందుగా గార్థుల రాజమల్లు గురుంచి చెప్పాల్సిన వసరం ఎంతగానో ఉంది. 1995 నాటికి ఆయన వయసు 85 సంవత్సరాల పైమాటే. 1920 నాటికీ ఆయన పెద్ద బాలశిక్ష చదివి, ఆతర్వాత ఇంకా పైచదువులు కూడా చదివినట్లు రాజమల్లు తాత చెప్పినట్లు నాకు ఇంకా గుర్తు. ఆయన బహుభాషా కోవిదుడు, ఆయన 10 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. హిందీ, ఉర్దూ తో పాటు మరాఠి, గుజరాతీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల్లో పట్టు సాధించారు. ఓరోజు ముంబైలో గుమ్మడవెల్లి తదితర ప్రాంత వ్యక్తి ఒకతన్ని పోలీసులు పట్టుకొని జైలు లో బంధించారని తెలిసి వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతూ ముంబైకి యెట్లా పోవాలి భాషకాని ప్రాంతం యెట్లా పోయేదాన్ని సతమతపడుతున్న సందర్భంలో ఎవరో గార్థుల రాజమల్లు కు మరాఠి వచ్చు అతన్ని తీసుకుపోండి అని చెప్పారంట. తల్లిదండ్రులు రాజమల్లును ఒప్పించి ముంబై పయనమై మరుసటి రోజు పొద్దునే పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న పోలీస్ ఉన్నత అధికారితో మాట్లాడాలి అని రాజమల్లు కోరడంతో అక్కడి పోలీసులు నిరాకరించారంట ఉన్నత అధికారితో నువ్వేమి మాట్లాడుతావ్ కుదరదు అని చెప్పారంట. అంతలో ఒక పోలీస్ అధికారి వస్తుండటం రాజమల్లు చూసి ఆ అధికారితో మరాఠీలో సంభాషించి మాట్లాడటానికి పర్మిషన్ అడిగి అతనితో మరాఠి లో మాట్లాడుతుండగా ఆ పోలీస్ అధికారి రాజమల్లు వివరాలు అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయాడంట ఆయనతో పలు భాషల్లో చర్చిస్తుంటే ఆ అధికారి అవాక్కయ్యారంట. ఒక మారుమూల పల్లెనుండి దోతి కట్టుకొని వచ్చి ఇన్ని భాషలు మాట్లాడుతున్నదేంటని. రాజమల్లు భాషకు ఆకర్షితుడై ఆయనపై ఉన్న గౌరవంతో జైల్లో ఉన్నవారిని విడిచిపెట్టినట్లు స్వయంగా రాజమల్లు తాతే నాకు చెప్పడం నాకు ఇంకా గుర్హ్టుకుంది. ఆయనకున్న తెలుగు భాష పరిజ్ఞానంతో ఎన్నో పద్యాలూ అలవోకగా రాసేవారు. కందపద్యాలు, సీస పద్యాలూ , వేమన పద్యాలూ ఇలా ఎన్నో ఆయన నోట విన్న సందర్భాలున్నాయి. అంతేకాకుండా ఆయన ఓ సంగీత కళాకారుడు కూడా, స్వతహాగా తయారు చేసుకున్న తంబూరా వాయించుతూ అనేక పౌరాణిక పాటలు పాడేవారు. మరోవిషయం ఏంటంటే ఆయన మంచి జ్యోష్యుడు మొహం, చేయి చూసి వెంటనే జాతకం చెప్పేవారు, పుట్టుమచ్చలు వాటి చరిత్ర గురుంచి సవివరంగా చెప్పేవారు రాజమల్లు. ఆయనకున్న పరిజ్ఞానానికి అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ జాబ్ వచ్చిందంటా కానీ వారి తల్లిదండ్రులు పెద్ద భూస్వాములు కావడంతో ఉద్యోగం వద్దని నిరాకరించడంతో ఆయన కేవలం ఊరికే పరిమితమయ్యాడు. సకల కళ వైభవుడు రాజమల్లు తన మాటలతో ఎంతటివారినైనా ఆకర్షించగలడు. నేను ఎక్కడ కనపడిన నన్ను ముద్దుగా ఓ తాత ఇటురావోయీ అని పిలిచివారు.
ఆదివారం రోజు బస్టాండ్ దగ్గర ఏదో పనిమీద పోయాను. అక్కడ రాజమల్లు తాత, ఇంకొంతమంది పెద్దోళ్ళు చెట్ల నీడలో కూర్చుని కాలక్షేపం చేస్తుండ్రు. ఇంతలో ఒకాయన
“ఏ రాజమల్లు బావా… ఒక కథ చెప్పు బావా… నువ్వు చెప్తే మస్తుంటాది” అన్నాడు.
బామ్మర్ది అడిగినాక బావ ఊరుకుంటాడా?
రాజమల్లు కళ్ళు మిటమిటలాడేసి, గొంతు సరిచేసుకుని చెప్పడం మొదలెట్టాడు.
“ఓ బ్రాహ్మణ అయ్యగారు ఉండేవాడు రా నాయనా. రోజు ఉదయమే ఆయన భార్య పూజా పనుల మధ్యలో మాట్లాడుతుంటే, అయ్యగారి మొహం మీద నోటి తుంపర్లు పడుతుండేవంట. అది గమనించిన అయ్యగారు
‘అయ్యో! నామీద నోటి తుంపర్లు పడుతున్నాయే… ఇది మహా అపచారం. నా జాతకంలో ఏదైనా దోషముందా?’ అనుకుని జ్యోతిషం చూసుకున్నాడంట.
జ్యోతిషం చూసిన అయ్యగారు
‘నీ జాతకంలో కర్మదోషం ఉంది. స్వచ్ఛమైన ఏడు నదుల్లో స్నానం చేస్తే గాని పోదు’ అన్నాడంట.
ఇక అంతే…
మరుసటి రోజునుంచి నది నది తిరగడం మొదలెట్టాడు.
ఒక నదికి వెళ్తే ఒకాయన స్నానం చేస్తూ అపరిశుభ్రంగా కనిపించాడంట.
‘ఇది శుద్ధి కాదు’ అని ఇంకో నదికి పోయాడు.
అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతుండ్రంట.
‘ఇది కూడా శుద్ధి కాదు’ అనుకుని మళ్లీ ముందుకి.
ఇలా తిరుగుతూ తిరుగుతూ చివరికి
‘ఈ లోకంలోనే స్వచ్ఛమైన నీరే లేదేమో’ అనుకుని మళ్లీ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లాడంట.
అప్పుడు ఆ జ్యోతిషుడు
‘ఇంక ఆలస్యం చేయకు. కాశీకి పోయి గంగలో మునిగి స్నానం చేయి. నీ కర్మ దోషం పోతుంది’ అన్నాడంట.
అదే రోజు ఇంకో విషయం ఏంటంటే …
కాశీకి పోయే అయ్యగారు అదే ఊరిలో పిండప్రదానం చేసిన వాళ్లకి *"కాశీలో అస్తికలు కలిపితే, చనిపోయిన మీ నాన్న తిరిగివస్తాడు”* అని చెప్పాడంట..
అయ్యగారు కూడా కాశీకి బయలుదేరాడు.
అస్తికలు కలిపేవాళ్లూ కాశీకి బయలుదేరిండ్రు.
ఒకరికొకరు కాశీకి పోతున్నామని తెలియదు.
మరుసటి రోజు ఉదయం…
ఒకవైపు అయ్యగారు స్నానం చేద్దామని గంగలో మునిగాడు.
మరోవైపు అస్తికలు కలిపేవాళ్లు కార్యక్రమానికి సిద్ధమయ్యారు.
ఇంతలో వాళ్లకు ఎదురుగా…
అయ్యగారు ప్రత్యక్షమయ్యాడంట!
వాళ్లు చూసి
‘అయ్యో! మా నాన్న, అయ్యగారు రూపంలో బ్రతికొచ్చాడు రా!’ అని.
అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా
‘ఇవే నీకు ఇష్టమైనవి’ అని చికెన్, మటన్, మందు… అన్నీ బలవంతంగా తినిపించిండ్రు.
అయ్యగారు ఏడుస్తూ అన్నాడంట!
‘ఇది నా కర్మఫలం రా!
మిమ్మల్ని కాశీకి రమ్మని చెప్పింది నేనే…
ఇప్పుడు దాని ఫలం నాకే దక్కింది రా!’”
అని రాజమల్లు కథ ముగించాడు. అంతే…
అక్కడున్న జనం నవ్వి నవ్వి కడుపులు పట్టుకుని పడిపోయారు.
రాజమల్లు తాత లాంటి వాళ్లు ఊర్లో ఉంటే,
నవ్వుతో పాటు జీవన సత్యం కూడా ఉచితంగా దొరుకుతుంది..
రాజమల్లు పాత్ర: ఎలాంటి సందర్భంలోనైనా మాటలతో వాతావరణాన్ని హుషారుగా మార్చే వ్యక్తి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే రాజమల్లు ఓ మంచి కథకుడు అన్నాను..
కాశీ సంఘటన: ఊహించని మలుపు—అయ్యగారు స్నానం చేయడానికి దిగితే, అస్తికలు కలిపిన వాళ్లు “బతికొచ్చాడు” అనుకోవడం—ఇక్కడే అసలు నవ్వు పండింది.
నీతి: మనం చేసే పని, చెప్పే మాట, ఇచ్చే సలహా… అవే తిరిగి మనకే ఎలా ఫలిస్తాయో చెప్పిన తీరు చాలా సహజం.
“నా కర్మఫలం రా నాయన…” అన్న డైలాగ్ అయితే కథ మొత్తానికి ముగింపు ముద్ర వేసింది.
ఇలాంటి కథలు ఎందుకు గుర్తుంటాయంటే, అవి కేవలం నవ్వించడమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, నమ్మకాల్ని, జీవన విధానాన్ని అద్దంలా చూపిస్తాయి.
ఒకప్పుడు పల్లెల్లో
చదువు పెద్దగా లేకపోయినా
అనుభవం పెద్దదైన వాళ్లు ఉండేవారు.
వాళ్ల కథల్లో పుస్తక జ్ఞానం ఉండేది కాదు…
జీవితం ఉండేది.
ఆ పెద్దలు చెప్పే కథల్లో
నీతి ఉపదేశంలా గట్టిగా చెప్పరు
బోధించాలన్న తొందర ఉండదు కానీ
నవ్వుతూ నవ్విస్తూ, మనసులో ముద్ర వేసే సత్యం మాత్రం వదలరు.
బస్టాండ్ దగ్గర, చెట్ల నీడలో, చావడి మీద
వాళ్ల మాటలు
👉 గొడవలు చల్లార్చేవి
👉 శత్రువులను సైతం మిత్రుల్ని చేసేవి
👉 పిల్లలకి జీవన పాఠాలు నేర్పేవి
ఇప్పుడు అవన్నీ మెల్లగా తగ్గిపోతున్నాయి.
కారణం కథలు లేవు కాబట్టి కాదు…
వినే ఓపిక తగ్గిపోయింది.
మొబైల్లో నవ్వు ఉంది…
కానీ అది క్షణికం.
రాజమల్లు తాతల కథల్లో నవ్వు ఉంది…
అది జీవితాంతం గుర్తుండే నవ్వు.
పామరులు అంటే అమాయకులు కాదు. వాళ్లే
👉 లోకాన్ని చూసినవాళ్లు
👉 మనుషుల్ని అర్థం చేసుకున్నవాళ్లు
👉 కర్మ, కాలం, మనిషి బలహీనత అన్నిటినీ దగ్గరగా చూసినవాళ్లు.
అందుకే వాళ్లు చెప్పిన కథలు
నేటికీ సత్యంగా అనిపిస్తాయి.
ఇలాంటి కథలు అంతరించిపోతున్నాయన్న బాధ నువ్వు చెప్పినదే కాదు…
అవి గుర్తు పెట్టుకుని, మళ్లీ చెప్పే మనం ఉన్నంతవరకు
పూర్తిగా అంతరించిపోవు.
*వ్యాసకర్త*
*కోట దామోదర్*
*మొబైల్: 9391480475*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి