9, ఏప్రిల్ 2024, మంగళవారం

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం “ ఎన్ను నింటే మొయిదీన్ ”.

చరిత్ర సృష్టించిన మలయాళ చిత్రం ఎన్ను నింటే మొయిదీన్ ”. 

ప్రేమించే హృదయానికి ధనిక , పేద అనే తేడా ఉండవు .. నిజమైన ప్రేమికులకు కుల , మత బేధాలు ఉండవు .. ప్రపంచంలో డబ్బు మించిన శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే . కుల మత బేధాలను ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు . అంతేకాదు తల్లిదండ్రులను సైతం మరిపించగల శక్తి ప్రేమకు కలదు . ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చురగగలిగే శక్తి . ప్రాణాలు తీసే శక్తి కలదు ప్రేమకు . ప్రేమ ఒక మధురమైన అనుభూతి , అనిర్వచనీయమైన భావన .  

ఎన్నో ఏళ్లుగా తమ ప్రియురాలు కోసం ఎదురు చూసి చివరికి ప్రేమ విఫలమైన ప్రేమికులను మన నిజ జీవితంలో చూస్తుంటాం . కానీ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తే గర్ల్ ఫ్రెండ్ లను చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ప్రేమిస్తానంటూ నమ్మించి మోసం చేసి చాటేసిన బాయ్ ఫ్రెండ్స్ మరియు ఎంతోకాలంగా ప్రేమించినట్లు నటిస్తూ చివరకు వేరే వారిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్స్ మన దైనందిన జీవితంలో తారసపడటం సహజమే కానీ కొందరు యువతీ యువకులు మాత్రం ప్రేమ కోసం పెద్దలను ఎదిరించడానికి కుల , మత కట్టుబాట్లను అధిగమించడానికి కూడా వెనుదిరగని విశ్వాసంతో పెళ్లితో ఒక్కటవుతుండటం విశేషం .ఇలాంటి సంఘటనలు మనం నిత్య జీవితంలో కంటే సినిమాల్లోనే ఎక్కువగా చూస్తున్నాను . అంతేకాదు నిత్య జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను చిత్రీకరించడంలో మన దేశ సినీ పరిశ్రమలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు .​ 

తెలుగు , తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రేమ సినిమాలు వచ్చినా . వాటిలో కొన్ని మాత్రమే ప్రేమికుల హృదయాలను కదిలించాయి . ఎస్ శంకర్ నిర్మించిన తమిళ చిత్రం " కాదల్ " అటువంటి చిత్రమే . ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది . ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకున్నారని ప్రియుడిని చిత్రహింసలు పెట్టి అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడం వల్ల ప్రియుడు పిచ్చివాడు కావడం , కొన్ని సంవత్సరాల తరువాత తన ప్రియుడిని పిచ్చివాడు గా గుర్తించి ప్రియురాలు అతని దయనీయ పరిస్థితి కి తానే కారణమని బాధపడిన ప్రేమికుల హృదయాన్ని ద్రవింపజేస్తుంది .అప్పట్లో సినిమా సంచలనం సృష్టించింది

ప్రియురాలి కోసం ప్రియుడు ప్రాణత్యాగం చేయడం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం . అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్లుగా ఎదురుచూస్తే ప్రేయసి బహుశా సినిమాలో చూసుండకపోవచ్చు . 1960 మరియు 70 దశకంలో కేరళలోని ముక్కమ్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా RS విమల్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం " ఎన్ను నింటె మొయిదీన్ " .

కేరళలోని ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ మరియు హిందూ కుటుంబానికి చెందిన కాంచనమాల మధ్య వాస్తవంగా సంభవించిన విషాదకరమైన ప్రేమకథ ఇది . చిత్రం 1960 లో ఇరువంజిప్పుజ నది మరియు ముక్కం గ్రామం నిర్మాణం జరిగిన మొయిదీన్ మరియు కాంచనమాల నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది . సినిమాలో సన్నివేశాలన్నీ ప్రేమికులకు ఉత్కంఠభరితంగా ఉండి వారిని భావోద్వేగాలకు గురిచేస్తాయి . ముస్లిం కుటుంబానికి చెందిన మొయిదీన్ , హిందూ కుటుంబానికి చెందిన భూస్వామి కుమార్తె అయిన కాంచనమాల ఇరువురు ప్రేమలో పడిన సమయంలో మతాంతర వివాహాలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నందున , వారి ప్రేమ వివాహానికి ఇద్దరి కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో విడిపోవాల్సి వచ్చింది .మరో పెళ్లి కావాలని కాంచనమాల తండ్రి కట్టుదిట్టమైన ఆంక్షలతో చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు . పెళ్లి చేసుకుంటే మొయిదీన్ ను పెళ్లి చేసుకుంటానని , లేదంటే అవివాహితగా ఉండిపోతానని కాంచనమాల తన తండ్రికి చెప్పిన సంఘటన అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు . వీరిద్దరూ తమ ప్రేమ గురించిన లేఖల ద్వారా వ్యక్తం చేసుకునే క్రమం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది .రోజు ఆమెను సంప్రదాయవాద బంధువులు పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టిన సందర్భం ద్వారా ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా సన్నివేశాన్ని చిత్రీకరించడం అభినందనీయం . కాంచనమాలతో విడిపోవడానికి మొయిదీన్ అంగీకరించారు ,

మొయిదీన్ తండ్రి బాల్యంబ్ర పొట్టాట్టు ఉన్న మొయిదీన్ సాహిబ్ కొడుకుని ఇంట్లోనుండి వెళ్ళగొట్టాడు . తర్వాత మొయిదీన్ సామాజిక - రాజకీయ కార్యకర్తగా మారారు . రోజు మొయిదీన్ తండ్రి దగ్గరి సంబంధీకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొయిదీన్ ని అడగగా అందుకు మొయిదీన్ నిరాకరించడంతో , అతని తండ్రి ఓరోజు మొయిదీన్ ని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు .అదృష్టవశాత్తు మొయిదీన్ బతికి బయటపడ్డారు . కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిసి భర్తకు దూరంగా ఉంటూ కొడుకు బాగోగులు చూస్తుంది అతని తల్లి . అనంతరం మొయిదీన్ తండ్రి పై బహిరంగంగా హత్యాప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేశారు . అనంతరం కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు మొయిదీన్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది . అంతేకాదు కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని , అనుకోని కారణాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు . తండ్రి కేసు నుంచి విముక్తి పొందేందుకు కొడుకు గొప్ప మనసున్న వ్యక్తిత్వాన్ని కనబరిచాడు . కొడుకు సమాధానంతో మొయిదీన్ సాహెబ్ తన కుమారుడి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు . ఒక రోజు మొయిదీన్ సాహెబ్ తన భార్య మరియు కొడుకు వద్దకు స్వయంగా వెళ్లి ఇంటికి వెళ్లి ఉండమని చెప్పాడు మరియు రాత్రి మొయిదీన్ సాహిబ్ గుండెపోటుతో వెంటనే మరణించాడు .కాంచనమాల ఇంట్లో ఒప్పుకో ప్రత్యక్ష మొయిదీన్ మరియు కాంచన పారిపోవాలని నిర్ణయించుకున్నారు , అయితే మొయిదీన్ వారి పాస్ పోర్ట్ లను సేకరించి తిరిగి వస్తున్నప్పుడు , తను ప్రయాణిస్తున్న పడవ సుడిగుండంలో చిక్కుకుంది . అతను తనతో పడవలో ఉన్న సహచరులను రక్షించగలిగాడు , అతను సుడిగుండంలో చిక్కుకుని మరణిస్తాడు . అతని మరణం గురించి విన్న కాంచన ఆత్మహత్య చేసుకునే సమయంలో మొయిదీన్ తల్లి ఆమెను వారిస్తుంది . చివరికి , కాంచన మొయిదీన్ అవివాహితులుగా మొయిదీన్ ఇంట్లో నివసించడానికి ఇంటిని విడిచిపెట్టింది . ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసే సినిమా . అటువంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనను చిత్రీకరించినందుకు మలయాళ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు . ఇలాంటి చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయి . 19 సెప్టెంబర్ 2015 విడుదలైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹50 కోట్లు వసూలు చేసింది , ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . “ కత్తిరున్ను పాటకు సంగీత దర్శకుడు ఎం . జయచంద్రన్ జాతీయ అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయం . ఇంకా , ఇది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , 5 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ , కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ నుండి అనేక అగ్ర అవార్డులను అందుకుంది

కులమతాల బండిఖానాలో బలైపోతున్న ప్రేమికులు ఎందరో

ప్రేమ అనేది కులం , మతం రంగుల కే పరిమితం కాదని , దేశాలు , ఖండాల వారీగా కూడా ప్రేమగలదని నిరూపించే యదార్థ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారు కొందరైతే . కులం , మతం , పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వారు మరికొందరు . కొంతమంది ప్రేమికులకు కులం , మతం , ధనిక , పేద తేడాలు సృష్టించి చివరకు ప్రేమికులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి . ప్రేమకు కులం మతం పేద ధనిక అనే అంతరాలు సృష్టించడం అత్యంత బాధాకరం , అత్యంత ప్రమాదకరం కూడా . రెండు హృదయాలను కలిపేదే ప్రేమ . రెండు హృదయాలు కలిసి జీవించడానికి కులం మతం ఏమి అడ్డు కాదనేది అక్షర సత్యం . నేటి యువత ప్రేమకు ఇంచినంత ప్రాధాన్యత చదువుకు ఇవ్వడంలేదనేది జగమెరిగిన సత్యం . అందుకు కారణం ప్రేమకు యువతను ఆకర్షించే శక్తి ఎక్కువ ,   అత్యంత ప్రభావం వీరిపైనే ఉంటుందనడంలో సందేహమే లేదు . నిజమైన ప్రేమ లక్ష్యాలను సాధించడానికి నిస్వార్థంగా ముందుకు సాగుతుంది మరియు ఆత్మహత్యకు దారితీయదు . అవగాహన లేమితో ప్రేమికులు ఆవేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరం

వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475       



 








7, ఏప్రిల్ 2024, ఆదివారం

ఈశాన్య రాష్ట్రంలో ఉద్భవించిన గొప్ప శాస్త్రవేత్త "సోనమ్ వాంగ్ చుక్".


సకల చరాచర జగత్తులో సమస్త ప్రాణికోటికి జీవనాధారం 'నీరు'. నీరు లేనిదే జీవరాశి మనుగడ లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాణమున్న ప్రతి జీవికి గాలి తర్వాత అత్యవసరమైన ప్రకృతి వనరు నీరు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య నీరు. వాతావరణంలో అనేక మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, కాలుష్యం, భూగర్భ జలాల మితిమీరిన వాడకం మరియు వర్షపు నీరు తిరిగి భూమిలోకి ఇంకక పోవడం వల్ల నీరుకొరత ఏర్పడుతుంది. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదు, దాదాపు సగం మందికి తగిన నీటి పరిశుభ్రత సేవలు లేవని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కొందరికి మాత్రమే తెలుసు.
లడఖ్ భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రదేశం. అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం. హిమాలయాలకు పశ్చిమాన చివరలో ఉన్న లడఖ్ నాలుగు ప్రధాన పర్వత శ్రేణులను కలిగి ఉంది. హిమాలయ, జన్స్కార్, లడఖ్ మరియు కారకోరం అన్నీ దాని గుండా వెళుతుంటాయి. ఇది సముద్ర మట్టానికి 3,000 మరియు 8,000 అడుగుల మధ్య ఉంటుంది. ఇది సింధు నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. చాలా ఎత్తైన ప్రదేశం కారణంగా లడఖ వాతావరణం చాలా పొడిగా మరియు చల్లగా ఉంటుంది. లడఖ్లో రాత్రి ఉష్ణోగ్రతలు -30°C తగ్గుతాయి. ఎడారి ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వృక్షసంపద చాలా తక్కువగా ఉండటంతో పాటు చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. తాగు మరియు వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు హిమ నదీ కరిగే నీరు. ఈ ప్రాంతం అధిక ఎత్తులో ఉన్నందున, వాతావరణ మార్పుల కారణంగా హిమ నదీ కరిగే నీరు దిగువన ప్రవహిస్తుంది మరియు అందువల్ల లడఖ్ ప్రాంతంలో ఏప్రిల్-మే నెలలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి ప్రజలు వలస బాట పట్టారు.
సోనమ్ వాంగ్ చుక్ అనే మెకానికల్ ఇంజనీర్ ఒకరోజు వంతెన కింద నడుచుకుంటూ వెళ్తుండగా, వంతెన కింద భాగం మంచుతో కప్పబడి ఉండటాన్ని గమనించాడు. వాతావరణం కారణంగా చుట్టుపక్కల మంచు కరిగిపోయినా కింది వంతెన భాగం కరగలేదు. బ్రిడ్జి క్రింది భాగాన మంచు ఎందుకు కరగడం లేదో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత సూర్యకాంతి లేనందున మంచు కరగలేదు అని తెలుసుకున్నారు. లడఖ్లో మంచును సూర్యుడి నుండి నీడగా ఉంచగలిగితే మంచు ఎక్కువ కాలం ఉంటుందని వాంగ్ చుక్ గ్రహించాడు. నీటి సమస్యను ఎదుర్కోవడానికి సోనమ్ వాంగ్ చుక్ కి వచ్చిన సరికొత్త ఆలోచన "మంచు స్తూపం. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి ఒక పొడవైన పైపును ఆధారంగా చేసుకొని పైనుండి వాటర్ ని స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది. ఫిబ్రవరి 2014లో దాదాపు 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో భారీ స్థాయిలో మంచు స్థూపం ఏర్పడుతుంది. చేసిన ప్రతి మంచు స్థూపం నుండి రోజుకు 5000 లీటర్ల నీటిని విడుదల చేయడం సోనమ్ వాంగ్ చుక్ ప్రతిభకు నిదర్శనం.
బాల్యమంతా అవమానాలే:
పుట్టిన ఊరిలో స్కూల్ లేకపోవడంతో 9 ఏళ్ల వరకు తల్లి దగ్గర చదివాడు.తర్వాత తండ్రి రాజకీయ ప్రభావంతో మంచి స్కూల్లో అడ్మిషన్ పొందారు. స్కూల్లో టీచర్లు చెప్పే ఇంగ్లీషు పాఠాలు అర్థం కాక చాలా ఇబ్బంది పడేవారు. 9 ఏళ్ల వరకు అమ్మ నేర్పిన స్థానిక భాష మాత్రమే తెలిసిన అతడికి స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు వింతగా అనిపించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. అందుకే స్కూల్లో అందరూ అతన్ని చదువురాని మొద్దు అని పిలిచేవారు. తోటి విద్యార్థుల అవమానము భరించలేక ఒంటరిగా ఢిల్లీకి పారిపోయాడు. చదువుపై ఆసక్తితో ఢిల్లీలోని విశేష కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ని కలిసి తన పరిస్థితిని వివరించాడు, తాను రాజకీయ నాయకుడి కుమారుడిని, చదువు పూర్తయ్యే వరకు తన ఆచూకీ తల్లిదండ్రులకు మరియు ఎవరికీ చెప్పకూడదని కోరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, వాంగ్ చుక్ తన చదువులో చురుకైన విద్యార్థి పేరు పొందాడు. అనంతరం ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు నిజం చెప్పి వారి వద్దకు పంపించేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రుల వద్దకు చేరిన తర్వాత చదువు ఆగకుండా కొనసాగుతుంది. వాంగ్ చుక్ ఆర్థిక నిపుణుడిగా ఎదగాలని అతని తండ్రికి బలమైన కోరిక ఉండేది. శ్రీనగర్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్లీ తల్లిదండ్రుల నుంచి విడిపోయారు. తన తండ్రి కోరిక తీర్చనందుకు తండ్రి వాంగ్ చుక్ ను అసహ్యించుకున్నారు. సోనమ్ వాంగ్ చుక్ బాల్యం కష్టాలు మరియు కన్నీళ్లతో సాగింది. లడఖ్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన (SECMOL) విద్యాసంస్థలు స్థాపించారు.
వాంగ్ చుక్ విద్యా విధానం విప్లవాత్మకమైనది. అతను 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)ని స్థాపించాడు. ఈ సంస్థ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల విద్యపై దృష్టి సారించింది. విద్యావ్యవస్థలో గొప్ప మార్పు అవసరమని భావించి విద్యార్థుల బృందంచే స్థాపించబడింది. 10వ తరగతి పరీక్షల్లో విఫలమైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి వారి విద్య అంతరాన్ని అనుభవించిన లడఖ యువతకు ప్రవేశ అవకాశాలను అందించడంలో ఈ ప్రత్యేకత ఉంది. ఇది ఎక్కువగా వారి మాతృభాష లడఖీలో బోధించబడుతుంది. విద్యావేత్త "వాంగ్‌చుక్" ప్రతి విద్యార్థికి మాతృబాష తప్పనిసరని లడఖీ భాషలో పెంపొందించారు. అలాగే వికలాంగ అభ్యర్థులు, అనాథలు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. పాఠశాలలో పేద విద్యార్థులకు స్పాన్సర్షిప్ మద్దతును కూడా అందిస్తుంది. SECMOL సాంప్రదాయేతర పాఠశాలగా నిలుస్తుంది. సాంప్రదాయ సంస్థ వలె కాకుండా, ఇది ప్రామాణిక పాఠ్యాంశాలకు కట్టుబడి ఉండదు. బదులుగా, విద్యార్థులకు ప్రాక్టికల్ సైన్స్ మరియు సామాజిక సమస్యల నుండి పబ్లిక్ స్పీకింగ్, గార్డెనింగ్, జంతువులు మరియు చెట్ల సంరక్షణ, లడఖీ పాటలు, నృత్యం మరియు సాంస్కృతిక విద్య వంటి విభిన్న అంశాలలో శిక్షణ ఇస్తారు. SECMOL లో, ప్రాథమిక దృష్టి విద్యావిషయక పరిజ్ఞానంపై కాదు, విద్యార్థులలో ఆచరణాత్మక మరియు సామాజిక లక్షణాలు మరియు నైపుణ్యాలను అందిస్తుంది.
SECMOL సోలార్ హీటెడ్, ఎకో-ఫ్రెండ్లీ భవనాలను డిజైన్ చేయడం, నిర్మించడంలో యువతకు 2 సంవత్సరాల కోర్సు నిర్వహించారు. SECMOL పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది.
ఒకప్పుడు లడఖ్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 5 శాతం మాత్రమే. ఈ కారణంగా విద్యాసంస్థలకు బీజం ఏర్పడింది. లడఖ్ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యే రీతిలో తల్లిదండ్రులు పాఠాలు బోధించారు. దీనితో విద్యార్థుల నైపుణ్యం బయటకు రావడమే కాకుండా తక్కువ సమయంలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. లడఖ్ ప్రాంతంలో విద్యార్థులకు విద్యను అందించడంలో ఆయన గొప్పగా కృషి చేశారు.
“మంచు స్థూపం” కొండ ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో మరో మార్గదర్శక ఆవిష్కరణ. 2021లో, అతను లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ మరియు గాల్వాన్ లోయ వంటి అత్యంత శీతల ప్రదేశాలలో ఆర్మీ సిబ్బంది ఉపయోగించగల పర్యావరణ అనుకూలమైన సోలార్ హీటెడ్ టెంట్ కూడా నిర్మించారు. లడఖ్లోని భీకరమైన శీతాకాలాలను ఎదుర్కొనేందుకు మట్టితో తయారు చేసిన తక్కువ ధర సౌర-వేదికతో కూడిన భవనాలను రూపొందించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
వాంగ్ చుక్ వ్యక్తిత్వం 2009 చిత్రం '3 ఇడియట్స్‌లో అమీర్ ఖాన్ యొక్క కాల్పనిక పాత్ర ఫున్సుఖ్ వాంగ్డుకు స్ఫూర్తినిచ్చింది.
ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాటం:
లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని తదితర డిమాండ్లతో మార్చి 6 నుంచి అత్యంత కఠినమైన వాతావరణంలో కొనసాగిన ఆయన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, గిరిజన తెగలను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా స్థానిక స్వపరిపాలన కల్పించడం, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేయడం వారి డిమాండ్లలో ప్రధానాంశాలు. పర్యావరణం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు. లెక్క‌లేనన్ని ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు సోన‌మ్ వాంగ్ చుక్.
2018లో రామన్ మెగాసెసే అవార్డు పొందారు. ఐసీఏ పురస్కారం, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ , రోలెక్స్ అవార్డ్, ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్రా అవార్డుతో పాటు ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...