మనిషి మరణం:
పల్లకి ఎక్కని మనిషి ఉంటాడో లేదో తెలియదుగానీ…
పాడె ఎక్కని మనిషి మాత్రం ఉండడు.
జననం నుంచే జీవితం
మరణం వైపు నడిచే యాత్ర—
వీధులంతా ఆశలతో నిండినా
చివరికి చేరేది
మౌనపు మృత్యువు ఒడిలోనే.
రాజ్యాలేలిన రాజైనా,
కష్టాల మట్టిలో పుట్టిన పేదైనా
శ్వాస విడిచే వేళ
అందరికీ ఒకటే దారి, ఒకటే పాడె.
పల్లకీల గర్వం క్షణికం,
పాడే నిజం శాశ్వతం
ప్రతి జీవికి మరణం సహజం,
అది తప్పించుకోలేని
జీవితానికి చివరి చరణం మనిషి మరణం.
కవి, రచయితకోట దామోదర్
మొబైల్ 9391480475
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి