17, సెప్టెంబర్ 2024, మంగళవారం

హైడ్రాతో హైదరాబాద్ చెరువులకు పునర్జన్మ రానుందా!

హైడ్రాతో హైదరాబాద్ చెరువులకు పునర్జన్మ రానుందా!


ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడే హైదరాబాద్ నగరంలో నేడు చిన్నపాటి వర్షానికే ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీల్లో, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు వరదకు గురికాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి సమన్వయంతో సరైన ప్రణాళిక సిద్ధం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆదాయంపై దృష్టి సారించి మౌలిక వసతుల పెట్టుబడులపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలు విఫలమవడం ఒక కారణమైతే చెరువులను ఆక్రమించి, నాళాలను మూసేసి అక్రమంగా  నిర్మాణాలు చేపట్టడం ప్రధాన కారణం.  హైదరాబాద్‌లో 2000 సంవత్సరానికి ముందు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి? హైదరాబాద్ వరదలకు ప్రభుత్వాలు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి? హైదరాబాద్ చరిత్ర తెలిస్తే తప్ప వీటన్నింటికీ సమాధానం తెలుసుకోవడం కష్టం.

16, 17 శతాబ్దాలలో కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉండేవి. 1970 నుంచి చెరువులు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు అనేక నీటి వనరులు ఉండేవి. కానీ వాటిలో 70 నుంచి 500 మాత్రమే నేడు మనుగడలో ఉన్నాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసబ్ ట్యాంక్ మొదలైనవి పూర్తిగా కనుమరుగవగా, మనుగడలో ఉన్న కొన్ని చెరువులు చిన్న చెరువులుగా మరియు మురికి కాల్వలుగా కుంచించుకుపోయాయి.

అడుగంటిన భూగర్భ జలాలు:

హైదరాబాదీల దాహార్తిని తీర్చేందుకు హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్ సాగర్ తో పాటు మరెన్నో చెరువులను నీటి వనరులుగా ఉపయోగించేవారు. ఒకప్పుడు హైదరాబాద్ లో నీటి సమస్య లేదు. ఎప్పటినుండైతే చెరువులు, కుంటలు అక్రమాలకు గురవుతున్నాయో అప్పటినుండి నగరంలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడుతోంది. గత కొంతకాలం నుంచి ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం లోపల మరియు పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు లేకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకక పోవడం, వృధాగా మూసినదిలో కలవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.     

ఒకప్పుడు హుస్సేన్‌సాగర్‌ చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. నేడు నగరం లోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగు నీరు మరియు పరిశ్రమల నుండి వచ్చే కలుషిత వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ సరస్సులోకి వచ్చి చేరుతుండడంవల్ల మురుగు వాసనతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చెరువుల సంరక్షణ బాధ్యతను రాజకీయ నేతలు విస్మరించి వాటిని యధేచ్ఛగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో చినుకు పడగానే వరద కారణంగా కాలనీలు మునిగిపోతున్నాయి. నాళాలకు మరమ్మతులు చేయకుంటే భవిష్యత్తులో నగరానికి ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి చెరువులను పరిరక్షించడమే పరిష్కారమని భావించింది. నగరంలోని చెరువులను పునరుద్ధరించేందుకు ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వ్యవస్థను తీసుకొచ్చారు.

కబ్జాకు గురైన చెరువులు:
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా నగర వాసులకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా ను ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల ఆక్రమణలను అరికట్టడం, ఆక్రమణల తొలగింపు, అక్రమ నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్‌లు, ప్రకటనల తొలగింపు వంటి ప్రధాన బాధ్యతలను ప్రభుత్వం హైడ్రా కు అప్పగించింది.

రోజురోజుకూ వలసలు పెరిగి రియల్‌ బూమ్‌ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, కాలువలు కనుమరుగవుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో నగరంలోని అన్ని చెరువుల్లో దాదాపు 80 శాతం ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. కొన్ని చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురై కాలనీలుగా మారడంతో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 920 చెరువుల్లో 491 చెరువులు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ విస్తీర్ణం కేవలం 30 ఏళ్లలో ఏకంగా 499 ఎకరాలు కబ్జాకు గురై 1359 ఎకరాల నుంచి 860 ఎకరాలకు కుంచించుకు పోయింది.

శామీర్‌పేట్  చెరువు 1989లో 1200 ఎకరాలు ఉండగా 2006లో దాదాపు 568 ఎకరాలు ఆక్రమణకు గురై 632 ఎకరాలకు తగ్గింది. ఇలా ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి.

2010 నాటికి, 500 సరస్సులు హుడా పరిధిలో ఉండగా, మే 2018 నాటికి 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన 169 చెరువులు మాత్రమే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.

కూకట్‌పల్లి, మూసాపేటలో అతిపెద్ద చెరువు మైసమ్మ చెరువు ఒకప్పుడు 280 ఎకరాలు ఉండగా.. ఓ నాయకుడు వెంచర్లు వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఇలా ఆక్రమణలతో ఇప్పుడు సగానికి పైగా కుంచించుకుపోయింది. అంతేకాదు కూకట్‌పల్లి సర్వే నంబర్ల పరిధిలోని కాముని  చెరువు 50 ఎకరాలు ఉండగా, ఒకవైపు అల్లాపూర్ డివిజన్, బాలాజీనగర్ డివిజన్‌ల ద్వారా రెండు వైపులా చెరువు ఆక్రమణలకు గురై చాలా వరకు కుంచించుకుపోయింది.

నేరేడ్‌మెట్‌ డివిజన్ పరిధిలోని ఆర్కే పురం చెరువు గతంలో 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా నేదు అందులో సగం కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గోల్కొండ మండల రెవెన్యూ పరిధిలోని లంగర్‌హౌస్ చెరువు విస్తీర్ణం దాదాపు 26 ఎకరాలు కాగా ప్రస్తుతం చెరువు 12.5 ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 13.5 ఎకరాల చెరువు కబ్జాకు గురైంది.

వినాయకనగర్‌, మౌలాలి, ఆనంద్‌బాగ్‌ డివిజన్లలోని బండ చెరువు గతంలో వంద ఎకరాల్లో విస్తరించి ఉండేది. చెరువు పరిరక్షణకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం, నేటికీ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిమితులు ఖరారు కాకపోవడంతో సగానికిపైగా చెరువు కబ్జాకు గురైంది.

ఒకప్పుడు 290 ఎకరాల విస్తీర్ణంలో ఉండే జీడిమెట్ల గ్రామానికి సమీపంలోని కొల్లాచెరువును రాజకీయ నేతల అండదండలతో ఆక్రమించి అక్రమ నిర్మాణాలు, పరిశ్రమలు నిర్మిస్తున్నారు. నేడు 126 ఎకరాల చెరువు మాత్రమే మిగిలి ఉంది. కబ్జాదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలవడం సిగ్గుచేటు.

మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఒకప్పుడు 180 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 130 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 50 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువు ఎఫ్‌టీఎల్‌ స్థలంలో పలు కాలనీలు ఏర్పడి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌ సర్వేనెంబర్‌ 19 వడులకుంట 1.02 ఎకరాల విస్తర్ణంలో ఉండగా, ప్రస్తుతం 200 గజాల మాత్రమే మిగిలింది.

కొన్ని చెరువులు చూద్దామన్నా కనిపించకపోవడం అంతేకాకుండా అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారడం అత్యంత  ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రేటర్‌లో చెరువుల ఆక్రమణ యధేచ్చగా సాగుతూనే ఉంది. అందుకారణంగా నగరంలో చిన్న వర్షం కురిసినా వరద పోటెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో  హైడ్రా ను ఏర్పాటు చేసి ఎంతటివారినైనా ఉపేక్షించకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది.   

హైడ్రా పాత్ర ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా విభాగం గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. హైడ్రా ప్రోయాక్టివ్ విధానం కేవలం అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా  ప్రభుత్వ భూమిని పునరుద్ధరించడం మరియు హైదరాబాద్ పట్టణాభివృద్ధి చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం, చట్టానికి ఎవరూ అతీతులు కాదు మరియు పబ్లిక్ ఆస్తులను తిరిగి పొందడం మరియు రక్షించడం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. GHMC పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో హైడ్రా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెంబడి ఆక్రమణకు గురైన సుమారు 44 ఎకరాల భూమిని విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సాహసోపేతమైన చొరవ 18 అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి దారితీసింది, వాటిలో చాలా వరకు ప్రముఖ వ్యక్తులు మరియు రాజకీయ ప్రముఖులకు చెందినవి కావడం విశేషం.

హైడ్రా కూల్చివేతలు, స్వాధీనం చేసుకున్నవి:

హైదరాబాద్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఆక్రమణల పై నోటీసులు జారీ చేసింది. హెచ్చరికలు చేసినా నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తోంది. హైడ్రా ఇప్పటివరకూ మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు ఒక నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78  ఎకరాలు, బుమ్రాక్ డౌలా 12 ఎకరాలు, సున్నం చెరువు 10 ఎకరాలు , గండిపేట్ లేక్ 8.75 ఎకరాలు , గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేయగా.. ఒక్క అమీన్‌పూర్ చెరువులోనే 51.78 ఎకరాల్లో 24 నిర్మాణాల కూల్చివేసింది. సున్నం చెరువులో 10 ఎకరాలు రికవరీ చేసింది. సున్నం చెరువులో 42 నిర్మాణాలు కూల్చివేయగా.. కత్వా చెరువు FTL, బఫర్‌జోన్‌లో 2.5 ఎకరాలు రికవరీ అయింది. కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసింది. గండిపేట్ చెరువులో 8.75 ఎకరాలు రికవరీ చేయగా.. గండిపేట్ లేక్‌లో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు, తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్లు హైడ్రా వెల్లడించింది.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

https://thebetterandhra.com/telugu/telugu-special-stories/hydra-to-extend-wide-range-of-services-with-a-lot-of-hope-to-the-future-of-hyderabad/



31, ఆగస్టు 2024, శనివారం

మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం.

 మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం.


మన నిత్య జీవితంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తాయి మరియు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. నేను చెప్పబోయేది మనందరినీ ఆశ్చర్యపరిచే మరియు ఆలోచింపజేసే అలాంటి ఒక సంఘటన. సహజంగా చెరువులు, నదులు ఎండిపోవడాన్ని మనం కొన్నిసార్లు వింటాం లేదా చూస్తాం, కానీ సముద్రం ఎండిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు కదా? కానీ ఇది ముమ్మాటికీ నిజం.

ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద అంతర్గత నీటి వనరు మరియు పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన అరల్ సముద్రం నేడు కనుమరుగైంది అనే విషయం అందరిని ఆలోచింపజేస్తుంది. కజకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న అరల్ సముద్రం 26,300 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో నిత్యం చేపలతో కళకళలాడుతూ ఆర్ధిక వ్యవస్థకు ఎన్నుదన్నుగా నిలిచింది. అలాంటి సముద్రం  గ్లోబల్ వార్మింగ్ మరియు అభివృద్ధి యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా ఈ సరస్సు 1960 నుండి తగ్గిపోతూ 2010 నాటికి పూర్తిగా ఆవిరైందని పరిశోధకులు కనుగొన్నారు.

వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. 1960లో అరల్ సముద్రం యొక్క ఉపరితలం సముద్ర మట్టానికి 175 అడుగుల (53 మీ) ఎత్తులో ఉంది మరియు సుమారుగా 26,300 చదరపు మైళ్ళు (68,000 చదరపు కిమీ) విస్తీర్ణంలో ఉంది. అరల్ సముద్రం ఉత్తరం నుండి దక్షిణానికి 270 మైళ్ళు (435 కిమీ) మరియు తూర్పు నుండి పడమరకు 180 మైళ్ళు (290 కిమీ) ఉంది. అరల్ సముద్రం అదృశ్యం కావడానికి ప్రధాన కారణం సోవియట్ యూనియన్ యొక్క ఆర్థిక విధానాలు సిర్ దర్యా మరియు అము దర్యా నదుల నీటిని సాగునీటి ప్రాజెక్టుల కోసం మరియు వ్యవసాయ అవసరాల కోసం మళ్లించడం, వలన అరల్ సముద్రం యొక్క నీటి మట్టం క్రమపద్ధతిలో మరియు భారీగా తగ్గింది. ఈ రెండు నదులు అరల్ సముద్రానికి ప్రధాన నీటి వనరులు. అందువల్ల నదుల నుండి నీరు రాకపోవడంతో సముద్రం ఎండిపోవడానికి ప్రధాన కారణం. సోవియట్ ప్రభుత్వం ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో పెద్ద ఎకరాల పచ్చిక బయళ్లను లేదా సాగు చేసిన భూములను అము దర్యా, సిర్ దర్యా మరియు వాటి ఉపనదుల జలాలను ఉపయోగించడం ద్వారా సాగునీటి వ్యవసాయ భూములుగా మార్చింది. 1980ల చివరి నాటికి సరస్సు 1960కి ముందు ఉన్న దాని పరిమాణంలో సగానికి పైగా కోల్పోయింది. ఫలితంగా, సరస్సులోని ఉప్పు మరియు ఖనిజాలు మరింత కేంద్రీకృతమయ్యాయి. సముద్రం లో నీరు లేని కారణంగా ఇరు రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కున్నాయి. నీటి సమస్యను పరిష్కరించేందుకు 1994లో కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ మరియు తజికిస్థాన్‌లతో కలిపి అరల్ సముద్రాన్ని రక్షించే ప్రయత్నాలను చేపట్టినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అరల్ సముద్రం నీటిమట్టం 2006 మరియు 2009 నాటికి నాలుగైదు వంతులు తగ్గింది. సముద్రం యొక్క ఉత్తర భాగాన్ని రక్షించడానికి ప్రపంచ బ్యాంకు, కోక్-అరల్ డ్యామ్ నిర్మాణానికి సిర్ దర్యా వెంబడి ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. అయితే, దక్షిణ భాగం-తూర్పు మరియు పశ్చిమ లోబ్‌లు కానీ ముఖ్యంగా తూర్పు-ఉత్తరం-కొంత నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, కుంచించుకుపోతూనే ఉంది. 2010 తర్వాత చాలా కాలం పాటు తూర్పు లోబ్ పూర్తిగా ఎండిపోయింది.

అరల్ సముద్రం ఎండిపోవడంతో మత్స్య సంపద, వాటిపై ఆధారపడిన వర్గాలు కుప్పకూలాయి. పెరుగుతున్న ఉప్పునీరు ఎరువులు మరియు పురుగుమందులతో కలుషితమైంది. వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన, బహిర్గతమైన సరస్సు అడుగుభాగం నుండి వీచే దుమ్ము ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది.

సముద్రాలు వాటి లోపల సరికొత్త ప్రపంచాన్ని కలిగి ఉన్నాయి. లోతైన సముద్రంలో ఉండే జీవులు చాలా అరుదు మరియు అందంగా ఉంటాయి. కానీ అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల చమత్కారమైన సముద్ర జీవులు నష్టపోయాయి. సముద్రం ఎండిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు మరియు వారు చాలా ఆశ్చర్యపోయారు.

సంకోచానికి కారణం

ఇది ఒకప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సరస్సు. ప్రధానంగా మంచు కరగడం మరియు సుదూర పర్వతాల నుండి కురిసే అవపాతం కారణంగా, అరల్ సముద్రం విస్తృతమైన మత్స్యకార సంఘాలకు మరియు కజాఖ్స్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లోని చాలా శుష్క ప్రాంతంలోని సమశీతోష్ణ ఒయాసిస్‌కు మద్దతు ఇచ్చింది.

కానీ 1950లు మరియు 60లలో, సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని రెండు ప్రధాన నదులైన సిర్ దర్యా మరియు అము దర్యాలను మళ్లించే ప్రాజెక్టులను ప్రారంభించింది. ఎడారిని పత్తి మరియు ఇతర పంటలకు వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడానికి ఆనకట్టలు, కాలువలు మరియు ఇతర నీటి పనులు నిర్మించబడ్డాయి. అప్పటి నుండి అరల్ సముద్రం నెమ్మదిగా కనుమరుగవుతోంది.

పర్యావరణంపై ప్రభావం

అరల్ సముద్రం ఎండిపోవడంతో మత్స్య సంపద, వాటిపై ఆధారపడిన వర్గాలు కుప్పకూలడమే కాకుండా అక్కడి నేల మొత్తం ఉప్పునీరు ఎరువులు మరియు పురుగుమందులతో కలుషితమైంది. వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన, బహిర్గతమైన సరస్సు అడుగుభాగం నుండి వీచే దుమ్ము ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారింది.
అరల్ సముద్రం ఎండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో దుమ్ము మరియు ఉప్పు తుఫానుల సంఖ్య బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏటా పది పెద్ద దుమ్ము తుఫానులు సంభవిస్తున్నాయని, వాటిలో ఎక్కువ భాగం ఏప్రిల్ మరియు జూలై నెలల మధ్య సంభవిస్తున్నాయని ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి.

మానవ విధ్వంసంలో భాగంగా అదృశ్యమైన అరల్ సముద్రం చరిత్ర మనకు ఒక పాఠం చెబుతుంది. మనం ప్రకృతిని అతిగా వినియోగించుకుంటే, దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475

18, ఆగస్టు 2024, ఆదివారం

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

తెలుగు సినీ జగత్తుకే అజరామరం సినారె గేయాలు

 నిజం చెప్పాలంటే కొన్ని పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిని, అనిర్వచనీయమైన అనుభూతిని, మరియు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తాయి డా. సి. నారాయణరెడ్డి గారు రాసిన పాటలు. ఆయన కలం నుండి దొర్లిన పాటలు ఎందరో తెలుగువారి హృదయాలను దశాబ్దాలుగా ఓలలాడిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన పాటలోని ప్రతిపదం శ్రోతల హృదయ కవాటాల మీటలను సుతిమెత్తగా స్పృశిస్తుంది. ప్రేమికుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన యుగళగీతాల ద్వారా అద్భుతమైన సాహిత్యాన్నిఅందించిన సాహిత్యశిఖరం "సినారె". సందార్భానుసారం వైవిధ్యభరితమైన దైవభక్తి, దేశభక్తి,బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు, వచన కవితలు, గజల్స్, పౌరాణిక రచనలతో శ్రోతలకు వీనుల విందు చేశారు. సందర్భానుసారంగా ఏ పాటైనా అలవోకగా రాయగల ప్రావీణ్యత ఆయనకు వాగ్దేవి ద్వారా సిద్ధించిన వరం. ఆయన కలం నుంచి జాలువారిన దాదాపు ప్రతి పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు అప్రయత్నంగా వారి పెదవులపై నాట్యమాడేలాచేస్తుంది. పండితుల నుంచి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. తెలుగు సినిమా పాటల్లో ఛందస్సుకు, భావానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కవి సినారె. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన శైలి అద్వితీయం. రచనలో వైవిధ్యం పాటల్లో మాధుర్యం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప మహాకవులలో ముందు వరుసలో ఉంటారు "సినారె". పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సోవియట్ - నెహ్రు పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలుగా నిలిచాయి.

 సినారె గారు రాసిన ప్రతి పాటలోనూ అద్భుతమైన పద ప్రయోగం ఉంటుంది. 1962లో "గులేబకావళి" సినిమాతో గేయ రచయితగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 3,500కు పైగా పాటలకు సాహిత్యాన్ని అందించడంతో పాటు  తెలుగు సినిమా పాటలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు. రాసిన తొలి పాటతోనే తెలుగు సాహిత్యం పై తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ.. అంటూ రాసిన పాటతో అందరి మనుషులను దోచుకున్నారు. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం.. అంటూ  ప్రేమ బంధాన్ని విడదీయరాని బంధమని,  ఆ బంధాన్ని విడదీయరాని బంధంగా ఇగిరిపోని గంధం గా అభివర్ణించారు. ఎన్ని యుగాలైనా ఆయన పాట ఇగిరిపోని గంధంలా అద్భుతమైన పద విన్యాసాలతో పసందైన పాటలను అందించారు. ఈ పాట ఇప్పటికి ఎప్పటికి ప్రజాదరణ పొందుతూనే ఉంటుంది.

 1962లో వచ్చిన "ఆత్మబంధువు" సినిమాలో" చదువురాని వాడవని దిగులు చెందకు - మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు" మానవత్వం లేని చదువులు ఉన్నా. లేకున్నా ఒక్కటే అనే విషయాన్ని  ఈపాటద్వారాసుస్పష్టంగాతెలియజేశారు. "ఏమి చదవి పక్షులు పైకెగురగలిగెను..ఏ చదువువల్ల చేపపిల్ల లీదగలిగెను"అంటూకొన్నిఉదాహరణలతోచదువురాని వారికి చదువురాదని దిగులు చెందకు మంచి హృదయమున్నచాలని తెలియజేశారు. అదే సంవత్సరం వచ్చిన "కులగోత్రాలు" సినిమాలో

చిలిపికనుల తీయని చెలికాడా.. నీ నీడను నిలుపుకొందురా.
నీలికురుల వన్నెల జవరాలా.. నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల అంటూ ప్రేమికుల మదిలో చిరకాల ముద్ర వేసుకున్నారు.

 బి.ఎస్.రంగా 1964లో శిల్పకళా ప్రావీణుడైన జక్కన్న జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చారిత్రాత్మక చిత్రం "అమరశిల్పి జక్కన" సినిమాలోని శిల్పకళకు ప్రాణం పోసే రాతిబండలపై  రచించిన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో – ఈబండల మాటున ఏ గుండెలు మ్రోగెనో" పాట ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ చెంది మనల్నిఆలోచింపజేస్తుంది.

1970 లో ఎ.సంజీవి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం "ధర్మదాత" సినిమాలోని "ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా" ఈ పాట ద్వారా ఓ తండ్రి తన కుటుంబంకోసం ఎంత కష్టపడతాడో వివరిస్తూ, తన పిల్లలను ప్రయోజకులను చేయడంకోసం తన ఇష్టాలను మరిచి తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. తాను ముళ్ల బాటలో నడిచి పిల్లలను పూల బాటలో నడిపేందుకు ఏ మాత్రం వేనుకాడడన్న విషయాన్ని మనసుకు హత్తుకునే విధంగా వివరించారు. "ఉన్న నాడు ఏమి దాచుకున్నావు.. లేనినాడు చేయి సాచనన్నావు". తండ్రి తన కోసం ఏమి దాచుకోకుండా  పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తాడు కానీ పిల్లలు కాదు పొమ్మంటే వారిదగ్గర చేయి చాచకుండా తన భాదను గుండెల్లో పెట్టుకొని పైకి నవ్వుతో కనిపిస్తాడు కనిపించని తండ్రి ప్రేమను ఈపాట ద్వారా కనిపించేలా చేశారు సినారె గారు.

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన "తాత మనవడు" చిత్రంలోని "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం"

వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే గొప్ప సందేశాత్మక చిత్రం ఇది.

1974లో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో విడుదలైన "నిప్పులాంటి మనిషి" తెలుగు చిత్రంలోని "స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం" బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్నాబాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు. బాధలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్..స్నేహమే.. హొయ్ అని గొప్పగా వర్ణిస్తూ రాసిన ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది.

2001 లో బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన "ప్రేమించు" చిత్రంలోని "కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా" ఒక తల్లి తన పిల్లలను మాత్రమే చూసుకుంటుంది కానీ పిల్లలు లేని వారు దేశంలో పిల్లలందరినీ తన బిడ్డలుగా భావిస్తారు. కేవలం తల్లిగా ఉండాలనే ఆలోచన కంటే ఎక్కువగా ఆదరించి, పెంచి పోషించిన వారు కూడా తల్లితో సమానమని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు సినారె. 

ఖసీదా ద్వారా పర్షియన్లు గజల్ ను సాహితీ లోకం లోకి తీసుకువచ్చారు. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి, హాఫిజ్, తుర్కీ కవులు గజల్ రచించారు. మొదటి గజల్ 10వ శతాబ్దంలో ఇరాన్లో ఉద్భవించింది.  తర్వాత12వ శతాబ్దంలో ముస్లిం రాజుల పాలనలో మొఘలులు ఇరానియన్ ఆచారాలతో పాటు గజల్ ఇరాన్ నుండి భారతదేశానికి వ్యాప్తి చేశారు. ఉత్తర భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్ రచించారు. గజల్ తెలుగు సాహిత్యంలోకి1963లో అడుగుపెట్టింది. ‘వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది/ పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’ చాలామందికి గజల్ అంటే అసలైన అర్ధం తెలియదు "గజల్" అంటే ప్రియురాలితో ఏకాంతమున జరిపే ప్రణయ సల్లాపమని నైఘంటికార్థం" . గజల్ ఒక శృంగార రసాత్మక అసలు సిసలైన భావకవిత. తెలుగు గజల్ మొదటిసారిగా, కాఫియా మరియు అంత్యానుప్రాస నియమాలను అనుసరించి, కవిత్వ శైలిని (లేదా శ్లోకం) కొంతవరకు, ఛందస్సులో లేదా వ్యక్తీకరణ పద్ధతి ఉపయోగించారు. తెలుగు గజల్‌ను మొదటిసారిగా తెలుగువారికి దాశరథి కృష్ణమాచార్యలు 1965లో పరిచయం చేస్తే ఆ తర్వాత సినారె గారు ఉర్దూ మాధ్యమంలో చదవడం వల్ల గజళ్ళలోని భాష, భావం. సౌందర్యం వంటివి తెలుగు గజళ్ళలోనూ ఉర్దూ వాతావరణాన్ని తేగలిగారు. ఎన్నో అద్భుతమైన తెలుగు గజల్ అందించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసారు.

ఆయన రచించిన గజల్స్ కొన్ని తెలుసుకుందాం..

"చిన్నదీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది..
జనమేం చేస్తుందని అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది"  చిన్నదీపమని అనుకోకు అదే లేకుంటే ఇల్లంతా చీకటే, జనం ఏమిచేస్తారు అనుకుంటే సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి గజల్స్ చదువుతుంటే పాఠకుడికి రసజ్ఞత భావం కలిగి ఇంకా చదవాలనే కోరిక కలుగుతుంది.

 1. "ఎవరో ఎదో అన్నారని మూసేయకు మాయని జీవితం..

ఏవో కలతలు పాకుతుంటే చించేయకు రాయని కాగితం" ..

2 . "పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని.. 

మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని"..

3 . "ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక..

ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక"..

సినారె గారి కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ అద్భుతమే.. స్వయంగా ఆయన గజళ్ళు రాయడమే కాక వాటిని అంతే ఆర్తితో స్వయంగా పాడటం మరో గొప్ప విషయం..

ప్రపంచ పదులు:

ప్రపంచపదులు అంటే విస్తరించి చెప్పడం అని అర్ధం.  సహజంగా పార్శిలోని రుబాయిలో నాలుగు పాదాలు ఉంటాయి. సినారెవాటినిఐదుపాదాలకుపెంచడమేకాకుండాఛందస్సుతోపాటుశబ్దలయ, భావస్పందనలు కలిగివుండేలా మహత్తరమైన ప్రయోగాలు చేసి ప్రపంచపదులను ప్రపంచనదులుగా విస్తరింపజేశారు. ప్రాపంచిక అన్వేషణకు అక్షర రూపంగా సినారె కలం నుండి జాలువారిన ఆణిముత్యాలే ఈ ప్రపంచపదులు.

ప్రపంచపదుల్లోని సినారె చేసిన పదప్రయోగం చూద్దాం:

జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా..
జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా..
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకుని పోరెందుకో..


రాలిపోయే ఆకులను ఎవరాపిన ఏముందిలే..
ఊడిపోయే జుత్తునెంతగా ఒత్తినా ఏముందిలే..
ఒప్పుకున్నా కొన్ని మార్పులు తప్పవేమో ప్రకృతిలో..


కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?
కత్తులు నాటిన గుడిలో భక్తి యెలా పండుతుంది?
'అంతాభద్రం' అంటూ ఎంత కాలమీ సూక్తులు.
వంచన దూరిన ఇంట్లో మంచి యెలా బతుకుతుంది?
నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది?

చూడండి సినారె గారు ఎంత అద్భుతంగా రాశారో.. చదివేకొద్దీ ఇంకా చదవాలనే రసజ్ఞతాభావం కలిగినప్పుడే అది అసలైన కవిత, అసలైన రచన.

85 ఏళ్ల జీవితకాలంలో 85 కు పైగా రచనలు చేసి ఎన్నో పదవులు చేపట్టి ఎనెన్నో పురస్కారాలు పొందిన సినారె మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన పాటకు, కవితలకు, రచనలకు మరణం లేదు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో మేరునగధీరుడు... నిత్య సాహిత్య కృషీవలుడు.. మన సినారె..


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475




28, జులై 2024, ఆదివారం

మ్యాథ్స్ ఒలంపియాడ్ లో సత్తా చాటిన భారత్

20, జులై 2024, శనివారం

టీసీఎస్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ కు పునర్వైభవం రానుందా

 *టీసీఎస్ భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ కు పునర్వైభవం రానుందా!*

16, జులై 2024, మంగళవారం

చింపుకున్న నాగరికం.. చినిగిపోయిన పేదరికం..

చినిగిపోయిన పేదరికం..

భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులు ప్రపంచానికే ఆదర్శం గా నిలుస్తాయన్నది ఎప్పటికీ నిజం. వారి వేషధారణ ను బట్టి వారు ఏ దేశానికి చెందినవారో చెప్పవచ్చు. ప్రతి దేశంలో వస్త్ర సంస్కృతి చాలా ముఖ్యమైనది. పూర్వం పెద్దలు బట్టల సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేటి యువత ఫ్యాషన్ రంగంలో భాగంగా అమెరికన్ మరియు యూరోపియన్ సంస్కృతికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారని చాలా కాలంగా వాదిస్తున్నారు. భారతదేశం యువత ఆర్థికంగానే కాకుండా వస్త్ర సంప్రదాయం, సంస్కృతి, ఆహారం విషయంలో కూడా ప్రపంచీకరణ చెందిందంటే అతిశయోక్తి కాదు. యువత మన దేశ సంప్రదాయాలను మరిచి విదేశాల్లోని సంప్రదాయాలపై ఆసక్తి చూపడం చాలా బాధాకరమైన విషయం. నేటి యువత స్వదేశీ సంస్కృతిని మరిచి విదేశీ సంస్కృతికి లొంగిపోతున్నారు. ఫ్యాషన్ పేరుతో విదేశీ దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల దేశీయ వస్త్ర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో చాలా మంది కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ దుస్తులలో ఫ్యాషన్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఎంత మార్పు వచ్చిందంటే? 

డబ్బున్నోడు బట్టలను ఫ్యాషన్‌ అంటూ చించుకుంటుండు.

డబ్బు లేనోడు చినిగిన బట్టలను కుట్టి వేసుకుంటున్నారు.. అంత మార్పు జరిగింది..

ఆ రోజుల్లో పేదవాడు, ధనవంతుడు బట్టలు వేసుకుని పద్ధతిని బట్టి నిర్ణయించేవారు కానీ ఈ రోజుల్లో అది సాధ్యం కాదు ఎందుకంటే అందరి బట్టలు చినిగే ఉంటున్నాయి కాబట్టి.

పేద, ధనిక అంతరాలు:

పేదవాడు ఎదగక పోవడానికి కారణం డబ్బు లేకపోవడమే. పేదవారికి ఏదైనా సాధించాలనే ఆలోచన ఉంటుంది కానీ దాన్ని అమలు చేయడానికి అవకాశాలు ఉండవు మరియు ఏదైనా చేయడానికి సరిపడా డబ్బు ఉండదు. ధనవంతుడు తన కళ్ల ముందు ఎన్నో అవకాశాలు మరియు తనకు కావలసినది కొనడానికి డబ్బు ఉంటుంది. అయినా సరే అవి చాలవు అన్నట్లుగా కొత్త మార్గాలను వెతుక్కుంటూ మనశ్శాంతిని కోల్పోతారు. 

"కోటివిద్యలు కూటికొరకే" అన్నట్లు ఇప్పటికీ తినడానికి తిండి లేక నిరుపేదలు అలమటిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. నిరుపేదలు తిండి దొరకక పస్తులు ఉంటుండగా మరికొంతమంది ధనికులు మాత్రం కడుపునిండా తిన్నా ఎలా అరిగించుకోవాలో తెలియక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ‘లేనోడు తిండికేడిస్తే. ఉన్నోడు అరగక ఏడ్చిండట’ అనే నానుడి పుట్టిందేమో బహుశా. ఉన్నోడికి అన్ని ఉంటాయి లేనోడికి ఏమి ఉండవు అన్నట్టుగా చాలా విచిత్రం ఏమిటంటే, పేదలకు అందుబాటులో లేని ప్రభుత్వ రేషన్ కార్డులు ధనికులకు లభిస్తున్నాయి, రేషన్ బియ్యం తినని వారికి రేషన్ కార్డులు ఉంటున్నాయి, నిరుపేదలకు మాత్రం రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో అందలేకపోతున్నాయి. ఇది మన దేశంలో పేదలకు జరుగుతున్న అన్యాయం. ఏ ఆపద వచ్చినా నష్టపోయేది పేదలే. ఆకలితో అలమటించేది పేదలే.. నిరుపేదలే ప్రాణాలు కోల్పోతున్నారు. పేద పిల్లలకు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులకు చదివించే  స్తోమత ఉండదు. అదే ధనికుల పిల్లలకు చదవాలనే ఆసక్తి లేకున్నా తల్లిదండ్రులు  చదువుకోరా బాబు అని ఎంత చెప్పిన చదవడం చేతకాదు. అందుకే ఒక సామెత పుట్టింది ఎద్దున్నోడికి బుధ్ది ఉండదు బుద్ధి ఉన్నోడికి ఎద్దుండదని. డబ్బు లేని వారికి చదువుకోవాలనే కోరిక ఉంటుంది అందుకే డబ్బు లేని వారు కష్టపడి ప్రయోజకులు అవుతారు. సివిల్స్‌లో విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. పైగా వీరంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం గొప్ప విషయం.

భారతదేశంలో పేద రాష్ట్రాల గురించి నీతి ఆయోగ్ కీలక విషయాలను వెల్లడించింది. బీహార్‌లో సగానికి పైగా పేదలు ఉండగా, కేరళలో ఒక్క శాతం కూడా పేదవారు లేరని వెల్లడించింది. భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ. దేశంలోని పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. మధ్యతరగతి వారు కూడా పేదలుగా మారుతున్నారు. ధనికులు మాత్రమే ధనవంతులు అవుతున్నారు మరియు కొద్దిమంది మాత్రమే ప్రపంచ కుబేరుల అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారనే సందేహం అందరిలోనూ కలగడం సహజం. ఈ సందేహాలకు నీతి ఆయోగ్‌ తెరపడింది. దేశం మొత్తం షాకింగ్ గణాంకాలు విడుదల చేసింది. 

నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో బీహార్ అత్యంత పేద రాష్ట్రం. బీహార్‌లో 52 శాతం మంది పేదలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. మానసిక ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట గ్యాస్ మరియు విద్యుత్ సౌకర్యాలు లేనివారు బీహార్‌లో ఎక్కువ శాతం ఉన్నారు. బీహార్‌లో పోషకాహార లోపం ఉన్నవారి శాతం అత్యధికంగా ఉంది. ఆ తర్వాత జార్ఖండ్ 42.5 శాతం, యూపీ 32 .67 శాతం తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం, మేఘాలయలో 32.67 శాతం పేదలు.

అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ. జనాభా 0.71 శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారు. అంటే కేరళలో ఒక్క శాతం కూడా పేదల లేరన్నమాట. పేదలు ఒక శాతం లోపే ఉన్నారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడి ప్రజలందరికీ గుడ్డ, నీడ కొరత లేదు. తర్వాతి స్థానంలో ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఉంది. ఆ తర్వాత దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు 4.89 శాతం మంది పేదలు మాత్రమే ఉన్నారు. పంజాబ్‌లో 5.59 శాతం మంది పేదరికంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 13.74 శాతం పేదలు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కాస్త మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 12.31 శాతం మంది పేదలున్నారు.  పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు తెలంగాణలో 31.10 శాతం, ఏపీలో 26.38 శాతం ఉన్నారు. శిశు మరణాలు ఏపీలో 1.82 శాతం, తెలంగాణలో 1.38 శాతం.

పేదరికం నిర్ములన సాధ్యమేనా?

యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఒకటి 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం. అయితే, ఆ కాలం ముగిసే సమయానికి, ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన ఉంటారని జూలై 2019లో సంస్థ విడుదల చేసిన నివేదిక అందించింది. ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు "పేదలకంటే సంపన్నులకు ఎక్కువ అందుతున్నాయని అందువల్లే భారతదేశంలో పేదలు పేదలుగానే ఉంటున్నారని, ప్రభుత్వాలు ఉచిత పథకాలంటూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదోడి నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు, ఉచిత పథకాలకంటే, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. పైగా ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడం వల్ల పేదరికం పెరిగే అవకాశం ఉందని, రాజకీయ నాయకుల అవినీతి కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. దేశంలో అవినీతి అంతమై పేదలకు సరైన ఆశ్రయం లభించినప్పుడు పేదరికం నిర్మూలించబడుతుంది.


వ్యాసకర్త 
కోట దామోదర్ 
మొబైల్: 9391480475

https://www.dishadaily.com/editpage/article-on-latest-dressing-of-youth-and-poverty-342888










25, జూన్ 2024, మంగళవారం

చదువు భుక్తి కోసం మాత్రమే కాదు

*చదువు భుక్తి కోసం మాత్రమే కాదు*

చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదివితేనే విషయం ఎక్కువ కాలం గుర్తుండిపోతుందన్న వాస్తవాన్ని నేటి విద్యార్థులు గమనించలేక పోతున్నారు. మన దేశంలోని విద్యార్థులకు సరైన విజ్ఞానం అందించలేకపోవడంతో, వారు ఇతర దేశాల్లో ఉత్పత్తి అయ్యే పరిజ్ఞానంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల మన డిజిటల్ రంగం పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. మౌలిక సదుపాయాల కొరత, బోధనలో నాణ్యత లోపించడం లాంటి అనేక ఇతర సమస్యలు నూతన ఆవిష్కరణలకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. మన దేశంలో ఎంతమంది విద్యావేత్తలు ఉన్నా.. కొందరి చదువు దేశానికి, ఇరుగుపొరుగు వారికి ఉపయోగపడడం లేదనడంలో సందేహం లేదు. అయితే తాము నేర్చుకున్నది సమాజానికి, పదిమందికి ఉపయోగపడేలా చదువుకునే వారు కొందరైతే, నేర్చుకున్న ప్రతి అక్షరం కొత్త ఆవిష్కరణల కోసమే అన్నట్లుగా సంకల్ప బలం ఉన్నవారు మరికొందరు. అలాంటి వారిలో ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి ఒకరు.

సుశీల్ IIT బాంబే పూర్వ విద్యార్థి 2008 - 2013 బ్యాచ్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. సోలార్ ఎనర్జీ గురించి అధ్యాపకులు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అవగతం చేసుకుని సూర్యుని శక్తి యొక్క అద్భుతాల గురించి చాలా మందికి తెలియని విషయాలు  తెలియజేయాలనే సంకల్పంతో సౌరశక్తి పై తనకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు బొంబాయిలోని సోలార్ స్టార్టప్‌లో రెండేళ్లపాటు పనిచేశాడు. అతను అక్కడ ఉన్న సమయంలో భారతదేశంలో సౌరశక్తి యొక్క అవగాహన పై అనేక అంతర్దృష్టులను పొందారు. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు మరియు ఎలక్ట్రిక్ వాహనాలలో సాధారణంగా ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొద్ది మందికి తెలుసు. ఈ రెండు మానవాళికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని గ్రహించి సుశీల్, భవిష్యత్తును పర్యావరణ అనుకూలమైనది మరియు కాలుష్య రహితంగా మార్చాలనే విప్లవాత్మక ఆలోచనలో భాగంగా 2016లో "ది సన్‌పెడల్ రైడ్" అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ పెట్రోల్, డీజిల్ లేదా బ్యాటరీ ని ఉపయోగించకుండా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్. ప్రారంభ దశలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ప్రాజెక్ట్ యొక్క మొదటి ప్రయాణం పాక్షికంగా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్‌పై భారతదేశంలోని  తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ స్థానికులతో సంభాషిస్తూ పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో సౌరశక్తి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ 79 రోజులలో 7000 కిలోమీటర్లు ప్రయాణించారు. భారతదేశంలోనే కాకుండా 2017లో ఫ్రాన్స్‌లో 30 రోజుల్లో 2000 కి.మీ ప్రయాణం, అదే సంవత్సరంలో USA లోని కాలిఫోర్నియాలో 15 రోజుల్లో 1500 కి.మీ, 2021-2022 లో USA లో 150 రోజులలో 11,800 కిమీ ప్రయాణించి ప్రపంచ స్థాయిలో అనేకమందికి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ పై పూర్తి అవగాహన కల్పించారు. అతనికి అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా సౌరశక్తితో నడిచే సైకిల్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సంపాదించాడు, ఆ తర్వాత సోలార్ సైకిల్‌పై సుదీర్ఘ ప్రయాణం చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు.

పెట్రోల్, డీజిల్ వాడకం వల్ల పర్యావరణానికి హాని:

పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పర్టిక్యులేట్ పదార్థం వంటి వాయువులు విడుదలై పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా మానవులలో ఊపిరితిత్తులు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవడం గాక హానికరమైన UV-కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఓజోన్ పొరను కూడా దెబ్బతీస్తుంది. అధిక పెట్రోల్, డీజిల్ వాడకం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుతుంటుంది దాంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పర్యావరణానికి హానికరం.

ఎలక్ట్రిక్ వాహనాలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా బ్యాటరీ సౌకర్యంతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీ లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ లు కూడా విషపూరితమైనవని కొంత మందికి తెలుసు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ మరియు డీజిల్ ధర కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బ్యాటరీ ల నుండి లిథియం, కోబాల్ట్, నికెల్ మరియు మాంగనీస్ వంటి పదార్థాలు విడుదల చేయడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది, వాటిని సరిగ్గా పార వేయకపోతే మానవ ఆరోగ్యం, వన్యప్రాణులు మరియు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నప్పటికీ ఫలితం అంతంత మాత్రమే. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు అంటుకున్న సందర్భాలు భద్రతా సమస్యలను ఏర్పడుతునే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు,  ప్రభుత్వం ఈవీ లలో ఉపయోగించే బ్యాటరీల కోసం కొత్త నాణ్యత నియంత్రణ చర్యలు చేపట్టింది. అయినా సరే కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పర్యావరణం తో పాటు, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగిస్తుంది.

సుశీల్ రెడ్డి సోలార్ సైకిల్ ప్రదర్శన:

ఈ సైకిల్ ని తొక్క వలసిన అవసరం లేదు. సౌర ఫలకాల ద్వారా సూర్యుని నుండి గ్రహించబడిన సౌర శక్తి ని విద్యుత్ శక్తి గా మార్చి మోటార్ సహాయంతో పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి పర్యావరణ కాలుష్యం, శబ్దం ఉండదు. ఈ విద్యుత్ ను సెల్‌ఫోన్లు, బల్బులు లకూ కూడా ఉపయోగించుకోవచ్చు. సైకిల్ కు  అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీసీ బ్యాటరీ సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దానితో సైకిల్ వెనుక చక్రానికి అమర్చిన డీసీ మోటార్ పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉన్న చోట ఒకేసారి 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సోలార్ ఎనర్జీ  వాడటం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా విద్యుత్తును పొందే అవకాశం ఉంటుంది.

సౌరశక్తి ఉపయోగాలు:

సోలార్ ఉత్పత్తుల ధర ఎక్కువగా ఉండటం మరియు సౌర విద్యుత్ గురించి తెలియకపోవడంతో చాలా మంది ఈ ఉత్పత్తులను వినియోగించడం లేదు. ఈ ఉత్పత్తుల గురించి ప్రజలలో ప్రత్యేక అవగాహన కల్పించినట్లయితే ప్రతి ఒక్కరు సౌర విద్యుత్ ను వినియోగించడానికి ఇష్టపడుతారు. ఇప్పకే వివిధ రకాల సౌర ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్న విషయం అతికొద్ది మందికి తెలుసు. వీధిలైట్లు, ఇంటి లైటింగ్ సిస్టమ్స్, వాటర్ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అపార్ట్‌మెంట్లలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు  30 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇందుకోసం న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీలు మీ అపార్ట్ మెంట్ ను పరిశీలించి ఎన్ని వాట్ల విద్యుత్ అవసరమో అంచనా వేసి అందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలియజేస్తారు తర్వాత ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. సోలార్ ఎమర్జెన్సీ లైట్‌ను 6 గంటల పాటు ఎండలో ఉంచితే మూడు గంటల పాటు బల్బు నిరంతరం వెలుగుతుంది. రాత్రిపూట అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని దీపాలుగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా సోలార్ హీటర్, ఇన్వర్టర్లు కూడా ఎంతో ఉపయోగపడతాయి.

పర్యావరణ కాలుష్యం నివారించాలంటే ప్రభుత్వం సౌర విద్యుత్ వాహనాలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిన అవసరముంది. అందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి.

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎందరో భారతీయులు విదేశాల్లో సెటిలవుతున్నారు. కానీ ముంబై ఐఐటీకి చెందిన సుశీల్ రెడ్డి మాత్రం మాతృదేశం లోనే ఉంటూ మన దేశ గొప్పతనాన్ని విదేశాలలో ప్రచారం చేయడం గర్వించదగిన విషయం.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

21, మే 2024, మంగళవారం

మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:

వన్నె తగ్గుతున్న తెలుగు:

విద్యావంతులు మాతృభాష సమస్యను ఎదుర్కొంటే మనం కలలు కంటున్న స్వేచ్ఛా భారతాన్ని సాధించలేమని, అన్ని స్థాయిలలో మాతృభాషను ప్రభుత్వ భాషగా, బోధనా భాషగా కొనసాగించాలని మహాత్ముడు ఆనాడే కోరారు. నేటికీ మహాత్ముడి మనోవ్యధను చిత్రించే పరిస్థితులు ఎందుకున్నాయో అందరూ ఆలోచించాల్సిన విషయమే.

భారత రాజ్యాంగం (ఆర్టికల్ 350A) మరియు కొఠారి కమిషన్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరం అని సూచించారు. యునెస్కో తో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా పిల్లలకు మాతృభాషలోనే చదువు చెప్పాలని చెబుతున్నాయి. ఉత్పత్తిలో అత్యున్నత స్థాయి అభివృద్ధి సాధించిన జపాన్ దేశీయ మాధ్యమాన్ని అత్యున్నత స్థాయిలో అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం 2010 లో ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించిన ప్పటికీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. చాలా దేశాలు మాతృభాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండగా, మన దేశం మాత్రం ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విచారకరం. యువత ఇంగ్లీషు భాషపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో అన్ని రాష్ట్రాల్లో మాతృభాషా మాధ్యమాన్ని బోధించే ప్రభుత్వ పాఠశాలలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగు వద్దు ఆంగ్లం ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాలలు యువతను, తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తున్నా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

మాతృభాషలోనే ఎందుకు బోధించాలి:

భాష ఒక దేశం యొక్క నాగరికత, సంస్కృతి మరియు ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భాష అనేది భావాన్ని వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా, భావాలు ఏకీకృతం చేయడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మనం తల్లి నుండి మొట్టమొదటగా నేర్చుకునేది , ఎక్కువగా మాట్లాడేదీ, భావోద్వేగ లేదా హృదయాను గత సంబంధం కలిగినదీ, ప్రతిచర్యలో ఉపయోగించేది మాతృభాష. చదువు సమయంలో పిల్లలకు ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు మాతృభాషలో బోధన తప్పనిసరి. విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడంలో మాతృభాష ముఖ్య పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో బోధించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందుతాయి. మాతృభాషలో వ్యక్తీకరించడం, బోధించడం మరియు నేర్చుకోవడం వంటి ప్రక్రియలు సులభతరం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం, కళాపోషణ, సాహిత్య అభినయం, సృజనాత్మకత, తీర్పు మొదలైన వాటిలో మాతృభాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. మాతృభాషలో చదువుకోవడం వల్ల ప్రతి పాఠాన్ని కంఠస్థం చేయకుండా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న పాఠం మరచిపోలేము. అంతేకాదు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవగాహన భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థి మాతృభాషలో జ్ఞానాన్ని పెంపొందించుకుని స్వీయ రచనకు సిద్ధమవుతాడు. మాతృభాషలో విద్యాబోధన చేస్తే విషయం బాగా అర్థమవుతుంది. ఇంగ్లీషు మీడియంలో అదే చదివే పిల్లలు  పాఠం పై పట్టు సాధించ లేరు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారిని, మాతృభాషా మాధ్యమం లో చదివిన వారిని పరిశీలించినప్పుడు మాతృభాషా మాధ్యమంలో చదివే వారికి పాఠ్యాంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది.

తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత కొరత:

ఇప్పటివరకు ఏ పార్టీ అయినా ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియానికి మార్చుతామని, తెలుగు ని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంచుతామని హామీలు ఇవ్వడం జరిగింది అంతే తప్ప ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్టుగా ఉంచుతామని ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం లో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకపోవడమే కాదు గత మూడేళ్ల నుంచి అనేక ప్రాథమిక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం గా మార్చారు. దీంతో పాటు మిగిలిన పాఠశాలలను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అవుతుందనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమంపై మక్కువ చూపుతున్నారనే ఒక్క కారణం చూపుతూ తెలుగు మాధ్యమాన్ని లేకుండా తీసిపారేస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు మాతృభాష పై పట్టు కోల్పోవడమే కాక గురువులు చెప్పే పాఠం లోని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మహాత్మాగాంధీ మాతృభాషలో విద్య ఉంటె స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట. ఇది మాత్రం అక్షర సత్యమే, భాషా చాతుర్యం ఉంటే ఏదైనా సంక్లిష్టమైన విషయాన్ని సులభంగా పరిష్కరించగలము మరియు మనం చెప్పదలుచుకున్న ప్రతిదాన్ని క్షణాల్లో వివరించగలము. ఊహాత్మక ఆలోచనకు, ఊహాత్మక శక్తికి, సృజనాత్మకతకు మూలం మాతృభాష.

మాతృభాషను విస్మరిస్తున్నారు:

మాతృభాషను విస్మరించి పర భాషకు పట్టం ఎందుకు కడుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పర భాషలోనే దొరుకుతున్నాయి కాబట్టి అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య లేనందున విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం కోల్పోతున్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా  ఆంగ్లమాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగు మాట్లాడితే అందులో చాలావరకు తప్పులు ఉంటున్నాయి. అంటే వారు కనీసం మాట్లాడటానికి కూడా విముఖత చూపుతున్నారు. రాబోవు రోజుల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముంది. ఆంగ్ల మాధ్యమానికి ఉన్నంతగా ప్రోత్సాహకాలు తెలుగు మాధ్యమానికి లేకపోవడంతో ప్రజలు కూడా తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని మార్పు కోరుకుంటున్నారు.  

ఇతర దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో చూద్దాం:

అభివృద్ధి చెందిన దేశాలన్నీ మాతృభాషకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడి విద్యా విధానం విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది కాబట్టి వారు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు.

 జపాన్:

జపాన్‌లో విద్యార్థులకు పాఠాలే కాకుండా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం ఎలా? స్వీయ నియంత్రణ ఎలా ఉండాలి? ఈ సబ్జెక్టులను ప్రాథమిక మాధ్యమంలోనే విద్యార్థులకు బోధిస్తారు. పది సంవత్సరాల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా చిన్న చిన్న పరీక్షలతోనే విద్యార్థులకు బోధిస్తున్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత గా భావించి ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే కాకుండా వారితో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉపయోగపడే జపనీస్ కాలిగ్రఫీ మరియు సాహిత్యం కూడా నేర్పిస్తారు.

ఫ్రాన్స్:

ఆరేళ్లలోపు పిల్లలందరిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలి. ఇక్కడ పాఠశాలలు వారానికి నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మన దేశంలో 10వ తరగతి పరీక్ష లాగా ఇక్కడ కూడా బ్యాకలారియాట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయినట్లు. బ్యాకలారియాట్ అనేది US హైస్కూల్ డిప్లొమా కి సమానం.

సింగపూర్:

ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్య నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు.

ప్రభుత్వ పాఠశాలలు మూత బడటానికి కారణం:

తెలంగాణలో ప్రభుత్వ బడులు మూసివేయడం బాధాకరమైన విషయం. అందుకు కారణం బడుల్లో పిల్లలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలో టీచర్స్ కొరత వల్లే పిల్లలను పంపలేక పోతున్నామని చెబుతున్నారు. కానీ ఆయా ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరకపోవడానికి, తల్లిదండ్రులు చేర్పించక పోవడానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి అధికారికంగా, శాస్త్రీయంగా ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. కేవలం ఉపాధ్యాయులనే నిందిస్తున్నారనే విష ప్రచారం జోరుగా సాగుతోంది. పిల్లలను తెలుగు మీడియం చదివిస్తే రాబోవు రోజుల్లో సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువు కొరకు ఊరి బడిని వదిలి, కిక్కిరిసిన బస్సుల్లో తమ పిల్లలను పేరెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు బడులకు పంపడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందులో మొదటిది. కాగా సర్కారు బడుల్లో ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో ఒకటి లేదా రెండు గదుల్లో అన్ని తరగతులు ఒకరు లేదా ఇద్దరు టీచర్లు నిర్వహించాల్సి రావడం మరొక ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా, ఉపాధ్యాయుల కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.


వ్యాసకర్త

కోట దామోదర్

మొబైల్ : 9391480475

11, మే 2024, శనివారం

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్నారు ":KS రాజన్న".

చేతులతో కాక చేష్టలతో పద్మశ్రీ అందుకున్న ":KS రాజన్న".

“సేవే మార్గం” అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చరిత్రలో తన నమూనా సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమంటే దేవుడిని సాక్షాత్తు పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, “ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలువైనవి”అని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం మరియు సేవా తత్పరత జీవిత పరమార్థమని ఆమె తన జీవితం ద్వారా చాటిచెప్పింది. ఆమె తన జీవిత కాలంలోనే కాకుండా మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. “మానవుడే మహనీయుడు” అనే నానుడి నిజమని నిరూపించిన మహిళా మూర్తి ఆమె. మదర్‌ థెరిసా స్ఫూర్తితోనేటికీ ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటం ఆమె ఆదర్శమయ జీవితానికి ప్రతీక.

మనిషికి వైకల్యం ఉన్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వికలాంగుడు, సామాజిక సేవాతత్పరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కె ఎస్ రాజన్న జీవిత కథ గురించి కొంత తెలుసుకుందాం.

పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయిన ఆయన స్వీయ ప్రేరణ, దీక్షతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. సమాజంలో తాను ఎవరికీ తక్కువ కాదని భావించిన రాజన్న 2002లో వివిధ వైకల్యాలున్న క్రీడాకారుల కోసం నిర్వహించిన పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో క్రీడలో స్వర్ణం సాధించాడు. అంతేకాదు స్విమ్మింగ్‌లో రజతం సాధించి ఆశయసిద్ధికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు. అతను వికలాంగుల రాష్ట్ర కమిషనర్‌గా కూడా పనిచేశాడు.

కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన కేఎస్ రాజన్న 11 ఏళ్ల వయసులో పోలియో బారిన పడి చేతులు, కాళ్లు చచ్చుబడి వికలాంగుడైన రాజన్న ధైర్యం కోల్పోకుండా మోకాళ్లపై నడవడం నేర్చుకున్నాడు. అందరితో సమానంగా విద్యనభ్యసించాలనే దృఢ సంకల్పంతో పట్టుదలతో చదివి 1975లో రాష్ట్రస్థాయి సివిల్ పరీక్షల్లో విజయం సాధించారు. 1980లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత వికలాంగులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు వికలాంగుల హక్కులను పరిరక్షించడానికి, తను వికలాంగుల ప్రయోజనాల కోసం, వికలాంగుల సమాన అవకాశాల కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సామాజిక కార్యకర్తగా శ్లాఘనీయమైన సేవలందించారు. వికలాంగుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి వివిధ రంగాల్లో అఖండ విజయాలు సాధించారు. వందలాది మందికి ఉపాధి కల్పించి వేలాది మంది వికలాంగులకు స్వావలంబన కల్పించారు. అక్కడితో ఆగకుండా, రాజకీయాల్లో చేరి లింగరాజ పురం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన ఎస్ ఎంకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బెళూరు సిటీ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా నామినేషన్‌కు చేర్చారు. వికలాంగులకు ఉపాధి హామీ కల్పించడం కోసం రాజన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు.తన సంస్థ ద్వారా ప్రత్యేకంగా 500 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పించడం అభినందనీయం. రాజన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2013లో రాజన్నకు 'కమిషనర్ డిసేబుల్' పదవి ఇచ్చింది. రాజన్న 54 ఏళ్ల వయసులో రాష్ట్ర తొలి వికలాంగ కమిషనర్‌గా సభ్యులవ్వడం గర్వకారణమని.. ఆయన హయాంలో వికలాంగుల జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వికలాంగుల చట్టం సక్రమంగా అమలు కావాలంటే వికలాంగుల గణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్ద ఎత్తున పోరాటం సాగింది. ఈ నేపథ్యంలోనే వికలాంగుల సంఖ్య మాత్రమే కాకుండా వైకల్యంతో బాధపడుతున్న జనాభా ఎంత, విద్యార్హత, ఉపాధి, ఆదాయం వంటి వివరాలను కూడా నమోదు చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అనేక సమస్యలపై అధ్యయనం చేసి వికలాంగులకు ప్రశంసనీయమైన సేవలందించారు. కమిషనర్ పదవిలో రాజన్న 2016 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రారంభంలో ఆయనను పదవి నుంచి తొలగించింది. రాజన్నను తొలగించడంపై రాష్ట్ర వికలాంగుల సంఘాలు విమర్శించాయి. కాగా ఆ తర్వాత ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం పునః సంస్కరణల్లో భాగంగా రాజన్నను తిరిగి నియమించింది. పునర్నియామకం తర్వాత ఆయన  ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

KS రాజన్న సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం “అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త” విభాగంలో ఆయనకు 2024 మే 9న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆయనను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

"ఆత్మే పరమాత్మ" అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలవడం ద్వారానే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్న వారే గొప్పవారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసే వారిని ఇష్టపడతారు. అందుకే 'దయగల హృదయమే భగవంతుని నిలయం' అన్నారు పెద్దలు.

సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించుకోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో జీవించడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనినైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసే వారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా పరోక్షంగా సేవ చేస్తున్నట్టే. రాజన్న సేవలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేఎస్ రాజన్న తన సామాజిక సేవలో వైకల్యాన్ని ఎప్పుడూ అడ్డంకిగా భావించలేదు. అది ఆశయ సాధనకు ఏమాత్రం అవరోధం కాబోదని ఆయన సాధించిన ఈ విజయం నేటి యువతకు ముఖ్యంగా వికలాంగులకు ఎంతో స్ఫూర్తిదాయకం.

సంకల్పం, నిర్విరామ కృషితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని మరోసారి నిరూపించిన "కె.ఎస్.రాజన్న" జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు..  

అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం "KS రాజన్న". ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475

3, మే 2024, శుక్రవారం

చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం"

  చదువు స్వల్పం, ప్రతిభ అమోఘం "చింతకింది మల్లేశం":


మానవుడు దైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఆటంకాలు, అవహేళనలు, భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. విమర్శలు వింటూ కూర్చుంటే లక్ష్యం సాధించడం అసాధ్యం. విమర్శలను వినకుండా ముందుకు సాగినప్పుడే విజయం తథ్యం.

మారుతున్న కాలానికి అనుగుణంగా, శ్రమను తగ్గించడానికి మరియు పనిని సులభతరం చేయడానికి అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఆవిష్కరణలు సృష్టించడం అవసరం. మునుపు చేతితో ఉత్పత్తి చేయడం ద్వారా తక్కువగా ఉండే ఉత్పాదకతను యంత్రీకరణ ద్వారా పెంచేందుకు అవిశ్రాంత కృషి చేసిన ఆవిష్కర్తలకు అభినందనలు. తయారు చేయడానికి విద్య మాత్రమే కాదు, యంత్రం యొక్క పనిలో నైపుణ్యం కూడా అవసరం. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆవిష్కర్తలలో ఉన్నత విద్యావంతుల కంటే సామాన్యులే ఎక్కువగా ఉండటం వారి కళాత్మక ప్రతిభకు నిదర్శనం.

మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుసడలని ప్రయత్నం, సాధించాలంటే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏదైనా పనిని మొదట ప్రారంభించినప్పుడు ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు పొందడం కంటే అవహేళనలు, అవరోధాలు ఎక్కువగా ఎదుర్కొంటాము. అవరోధాలకు భయపడి వెనుతిరిగితే లక్ష్యం చేరడం అసాధ్యం. అవరోధానికి అవకాశాలుగా మలచుకొని లక్ష్య సాధన కోసం ముందుకు సాగిన వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చేనేత కార్మికులకు అవసరమైన మాన్యువల్ ప్రయత్నాన్ని 7 సంవత్సరాల పాటు కష్టపడి "లక్ష్మీ ఆసు" యంత్రాన్ని కనిపెట్టిన గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి "చింతకింది మల్లేశం".

అతను కనిపెట్టిన "లక్ష్మీ ఆసు" యంత్రం అతనికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చి పెట్టింది అదనంగా ఫోర్బ్స్ జాబితాలో మల్లెశంకు చోటు దక్కింది. లక్ష్మి ఆసు యంత్రం ఆసియాలోనే అత్యుత్తమమైనది అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ కొనియాడడం గర్వించదగ్గ విషయం. అద్వితీయమైన ఆవిష్కరణ అతని గుర్తింపుగా భారతదేశం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ' తో సత్కరించింది.

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చింతకింది మల్లెశం స్వగ్రామం యాదాద్రి జిల్లా, ఆలేరు మారుమూల పల్లె షారాజీపేట. తండ్రి లక్ష్మి నారాయణ, తల్లి లక్ష్మి ఇద్దరు చేనేత కార్మికులు, రోజు అంత కష్టపడితే గాని కడుపునిండని పరిస్థితి వారిది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా 6వ తరగతి లోనే చదువు ఆపేశాడు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకవైపు మగ్గం పని చేస్తూనే చదువుపై ఆసక్తితో ప్రైవేటుగా 7వ చదివి పాసైనారు, తోటి స్నేహితులందరూ చదువుతున్నారు తాను మగ్గం పని చేస్తున్నాను రాబోవు కాలంలో కనీసం 10వ తరగతి చదివే వారికి సరైన ఉపాధి అవకాశాలు ఉండవు అనే ఉద్దేశ్యంతో 10వ తరగతి కూడా ప్రైవేటుగా చదివి పాసయ్యాడు. తండ్రి చీరలు నేస్తూ కొడుకును కూడా చీరలు నేయడంలో నిపుణుడిని చేశారు. తల్లి చీర నేయడానికి సరిపడా దారాన్ని ఆసు పోసి వారికి అందించింది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. ఇలా రోజుకు 18 వేల సార్లు అంటే సుమారు 25 కి.మీ దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారుకావు. ఎంతో శ్రమ తో కూడుకున్నది చేనేత పని. రోజు కండెల చుట్టూ దారాన్ని తిప్పడం వలన చేతులు లాగుతూ భుజం నొప్పితో బాధపడుతుండేది. అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక అమ్మ శ్రమను తగ్గించడానికి ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచన ఆచరణలో పెట్టేందుకు తల్లితో కలిసి ఆమె చేస్తున్న పనిని గమనించి ఆ పనిని ఐదు భాగాలుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.తన ఆలోచన ఇరుగుపొరుగు వారితో పంచుకున్నాడు. అందరూ మల్లేశం ను నిరుత్సాహపరిచారు కానీ ఎవరూ ప్రోత్సహించలేదు కానీ అతను తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు మరియు విఫలమయ్యాడు మరియు కొంత డబ్బు కోల్పోయాడు. అయితే, ప్రతి రోజూ అదే పని గురించి ఆలోచన. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. వారి నుంచి విమర్శలు రావడం వంటి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే ఆ పనిని వదలక పోవడం వల్ల మల్లేశం కి పెళ్లి చేస్తే నైనా ఆ పనిని మరచి వేరే పని చేసి బతుకుతాడు అని భావించి అతనికి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంత కాలం వరకు ఆ పని జోలికి వెళ్లకుండా మగ్గం పని చేశారు. తర్వాత మధ్యలో ఆగిపోయిన పనిపై మళ్లీ ఆలోచన వచ్చింది. తన ఆలోచన భార్యకు చెప్పి, తన వద్ద ఉన్న కొంత డబ్బుతో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అతను విజయం సాధించలేకపోయాడు మరియు అతను తన భార్య నుండి తీసుకున్న డబ్బు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు తీవ్రంగా విమర్శిస్తుండగా.. ఇక్కడ అప్పులు తీర్చడం కష్టమని భావించి హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్ దగ్గర ఉద్యోగంలో చేరాడు. అతను ఎలక్ట్రికల్ మోటార్స్ గురించి కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. తాను తయారు చేయాలనుకున్న యంత్రానికి కావాల్సిన టెక్నాలజీని వెతుకుతుండగా బాలానగర్ లోని ఓ ఎలక్ట్రికల్ కంపెనీలో తనకు కావాల్సిన టెక్నాలజీ దొరికింది. తాను తయారు చేసిన యంత్రానికి సాంకేతికతను అమర్చేందుకు ప్రయత్నించి, అనుకున్నట్లుగానే విజయం సాధించాడు. అనంతరం తాను తయారు చేసిన యంత్రాన్ని పరీక్షించమని కొందరిని అడగగా, పరీక్షిస్తే ముడిసరుకు వృధా అవుతుందని చెప్పారు. అయితే తాము విజయం సాధిస్తామని పట్టుబట్టి.. ముడిసరుకు వృధా అయితే చెల్లిస్తామని చెప్పి యంత్రాన్ని పరీక్షించారు. అద్భుతంగా పనిచేస్తుంది అని వారు చెప్పడంతో తన 7 ఏళ్ల శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.చాలా ఏళ్ల తర్వాత చేనేత శ్రామికకుల శ్రమను తగ్గించేందుకు సరైన యంత్రాన్ని కనుగొన్న మల్లేశం ను చేనేత కార్మికులు, జిల్లా నాయకులు అభినందించారు. అతని యంత్రాన్ని పరీక్షించిన కొందరు ఇలాంటి యంత్రాన్ని కూడా తయారు చేయమని అడిగారు మరియు చాలా కొనుగోలు చేశారు. అయితే మొదట్లో ఆసు యంత్రాన్ని పూర్తిగా స్టీల్ తో తయారు చేయబడినందున యంత్రం ధర 13000 మాత్రమే అవుతుంది. అనూహ్యంగా 2005లో స్టీలు రేటు పెరగడంతో యంత్రం ఖరీదు 26000 కు చేరుకోగా అంత డబ్బుతో ఎవరికైనా యంత్రం కొనడం కష్టమని తెలిసి మల్లేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అనుకోకుండా ఒక స్నేహితుడు అతనికి మంచి సలహా ఇచ్చారు. స్టీల్ తో తయారు చేస్తే ఎక్కువ ఖర్చవుతుందని, అదే యంత్రాన్ని విద్యుత్ సహాయంతో తయారు చేస్తే ఖర్చు తగ్గుతుందని సూచిస్తున్నారు. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ లో ప్రావీణ్యం సంపాదించేందుకు ఎలక్ట్రికల్ సంబంధిత పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా కొన్నాడు. ప్రతి రోజు ఒక్కో పాఠాన్ని డిక్షనరీ సహాయంతో అర్థం చేసుకుని కష్టపడి తనకు కావాల్సిన యంత్రాన్ని తయారు చేసి రెండేళ్ల తర్వాత స్టీల్ మెషీన్ ధర రూ.13000 కి తయారు చేసి ఎలక్ట్రికల్ ఆసు యంత్రాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశాడు. అతి తక్కువ సమయంలోనే 750 మిషన్లు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2009లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్‌లు నేయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.ఆ తర్వాత 2009 లో మనిషి కంటే ఎక్కువ పని చేసే విధంగా మరియు కొత్త డిజైన్ లు తీయడానికి ఇంకా ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన మదిలో వచ్చిన ఆలోచన మైక్రో కంట్రోలర్ సిస్టమ్ ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ సిస్టమ్ అంటే ఏమిటో కూడా తెలియదు కానీ నేర్చుకోవాలనే పట్టుదలతో మళ్లీ పుస్తకాలు కొనుక్కుని అన్నీ అర్థం చేసుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అసాధ్యమైన దాన్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి, సాధ్యమని నిరూపించాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరో తరగతితోనే చదువు మానేసిన మల్లేశం. తీవ్ర ఏకాగ్రతతో మైక్రో కంట్రోలర్ సిస్టమ్ కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇది ప్రపంచం గర్వించదగ్గ విషయం. తల్లి కష్టం మల్లేశం ను కుదిపేసింది. ఆ ఆవేదనే ఆసు యంత్రం ఆవిష్కరణకు ఆయనలో ప్రేరణ కలిగించింది. అందుకే ఆ యంత్రానికి తన అమ్మ పేరు పెట్టారు.
మొదట్లో విమర్శలు చేసిన తల్లిదండ్రులు సైతం గర్వించదగ్గ ఆవిష్కరణ చేశారు.
చేనేత కార్మికులకు సాంకేతిక సహకారం అందించిన చింతకింది మల్లెశం కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

అవార్డులు:
2009లో భారత రాష్ట్రపతి చే
2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు లభించాయి.
2011లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చేరింది.
2017లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు లభించింది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్స్ అవార్డులు మరియు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ యంత్రాన్ని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) భారతదేశం ద్వారా అత్యుత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్‌గా గుర్తించింది మరియు మల్లేశం ను 2009లో భారత రాష్ట్రపతి సత్కరించారు.

ప్రేరణ పొందారు:

2019లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "మల్లేశం" చింతకింది మల్లెశం జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. 

పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది.


వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475                              

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...